News
శాశ్వతంగా త్రాగునీటి పరిష్కరించాలని సిపిఎం పార్టీ పాదయాత్ర
కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని చాలా గ్రామాల్లో త్రాగడానికి నీళ్లు లేక అల్లాడుతున్న ప్రజానీకానికి తక్షణమే త్రాగునీళ్ళు అందించాలని శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ మే 11 12 13 తేదీలలో సిపిఎం పార్టీ చేపట్టిన పాదయాత్ర ఆదివారం ఉదయం పెద్ద తుంబలం గ్రామం నుంచి సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు రామాంజనేయులు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే వెంకటేశులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్రం వచ్చి 80 ఏళ్లు కావస్తున్న త్రాగడానికి మంచి నీళ్లు కావాలని అడగడం సిగ్గుచేటని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికోసం పనిచేస్తున్నాయని వారు ప్రశ్నించారు. గత 30 సంవత్సరాల క్రితం నిర్మించిన ఎస్ ఎస్ ట్యాంకులు పైప్ లైన్ ఇప్పుడున్న జనాభాకు అనుగుణంగా నీళ్లు అందించడంలో పూర్తిగా విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎమ్మెల్యే కూడా ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తున్నారని ఇప్పటికైనా త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం గ్రామాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని త్రాగునీరందించాలని వారు డిమాండ్ చేశారు.

సిపిఎం పార్టీ చేపట్టిన పాదయాత్ర పెద్దతుంబలం నుండి ప్రారంభమై నెట్టేకల్ వరకు కొనసాగుతుందని మూడు రోజులపాటు 80 కిలోమీటర్లు 22 గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించి మే 14న ఆర్డబ్ల్యూఎస్ ఈ ఈ కార్యాలయం ముందు మహా ధర్నాతో ముగుస్తుందన్నారు.

ప్రజానీకం పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే లింగన్న, నేషనల్ స్కూల్ స్కరస్పాండెంట్ D కృష్ణమూర్తి, మండల కార్యదర్శి వర్గ సభ్యులు బి వీరారెడ్డి, రామాంజనేయులు, పాండవగల్ గ్రామ సర్పంచ్ కె ఉమాదేవి, పార్టీ మండల నాయకులు అయ్యప్ప, హనుమంత్ రెడ్డి, పాండురంగ, అయ్యన్న, మునిస్వామి పార్టీ సీనియర్ సభ్యులు దాసప్ప నాయుడు, ఈరన్న, శాఖ కార్యదర్శులు జి.విరుపాక్షి, కే గోవిందు, కె వెంకటేష్, ఎస్ అనిఫ్ భాష, వీరేష్ పార్టీ సభ్యులు లక్ష్మన్న, గర్జప్ప, హనుమంత్ రెడ్డి, కాజా, తదితరులు పాల్గొన్నారు.
News
ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
ఎమ్మిగనూరు, మే 13:
లైసెన్స్ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..
ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. — సోమన్న, ఏసీబీ డీఎస్పీ
-
News3 weeks agoలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
-
News6 days agoరోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
-
News4 weeks agoరైతులు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై పొందవచ్చు: ఆదోని మండల వ్యవసాయ అధికారి
-
News4 weeks agoరైతులు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై పొందవచ్చు: ఆదోని మండల వ్యవసాయ అధికారి
-
News4 days agoఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్లు స్వాధీనం
