Connect with us

News

శాశ్వతంగా త్రాగునీటి పరిష్కరించాలని  సిపిఎం పార్టీ పాదయాత్ర

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని చాలా గ్రామాల్లో త్రాగడానికి నీళ్లు లేక అల్లాడుతున్న ప్రజానీకానికి తక్షణమే త్రాగునీళ్ళు అందించాలని శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ మే 11 12 13 తేదీలలో సిపిఎం పార్టీ చేపట్టిన పాదయాత్ర ఆదివారం ఉదయం పెద్ద తుంబలం గ్రామం నుంచి  సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు రామాంజనేయులు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే వెంకటేశులు ప్రారంభించారు.

పాదయాత్ర నిర్వహిస్తున్న సిపిఎం నాయకులు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్రం వచ్చి 80 ఏళ్లు కావస్తున్న త్రాగడానికి మంచి నీళ్లు కావాలని అడగడం సిగ్గుచేటని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికోసం పనిచేస్తున్నాయని వారు ప్రశ్నించారు. గత 30 సంవత్సరాల క్రితం నిర్మించిన ఎస్ ఎస్ ట్యాంకులు పైప్ లైన్ ఇప్పుడున్న జనాభాకు అనుగుణంగా నీళ్లు అందించడంలో పూర్తిగా విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎమ్మెల్యే  కూడా ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తున్నారని ఇప్పటికైనా త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం గ్రామాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని త్రాగునీరందించాలని వారు డిమాండ్ చేశారు.

నీటి సమస్య పరిష్కారానికి పాదయాత్ర నిర్వహిస్తున్న సిపిఎం నాయకులు

సిపిఎం పార్టీ చేపట్టిన పాదయాత్ర పెద్దతుంబలం నుండి ప్రారంభమై నెట్టేకల్ వరకు కొనసాగుతుందని మూడు రోజులపాటు 80 కిలోమీటర్లు 22 గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించి మే 14న ఆర్డబ్ల్యూఎస్ ఈ ఈ కార్యాలయం ముందు మహా ధర్నాతో ముగుస్తుందన్నారు.

పాదయాత్ర నిర్వహిస్తున్న సిపిఎం నాయకులు

ప్రజానీకం పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే లింగన్న, నేషనల్ స్కూల్ స్కరస్పాండెంట్ D కృష్ణమూర్తి,  మండల కార్యదర్శి వర్గ సభ్యులు బి వీరారెడ్డి, రామాంజనేయులు, పాండవగల్ గ్రామ సర్పంచ్ కె ఉమాదేవి, పార్టీ మండల నాయకులు అయ్యప్ప, హనుమంత్ రెడ్డి, పాండురంగ, అయ్యన్న, మునిస్వామి పార్టీ సీనియర్ సభ్యులు దాసప్ప నాయుడు, ఈరన్న, శాఖ కార్యదర్శులు జి.విరుపాక్షి, కే గోవిందు, కె వెంకటేష్, ఎస్ అనిఫ్ భాష, వీరేష్ పార్టీ సభ్యులు లక్ష్మన్న, గర్జప్ప, హనుమంత్ రెడ్డి, కాజా, తదితరులు పాల్గొన్నారు.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడులు

Published

on

కర్నూలు జిల్లా ఆదోని సబ్ రిజిష్టర్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు దాడులు నిర్వహించారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని అధికారులతో ప్రైవేట్ వ్యక్తులతో అనధికారికంగా ఉన్న  1లక్ష 18 వేల 700 వందల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్సీ సీతారామారావు తెలిపారు.

పూర్తి వీడియో చూడాలంటే యూట్యూబ్ లింకులు క్లిక్ చేయండి

డీఎస్పీ సీతారామారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో భారీ ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లు వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం రావడంతో ఈ దాడులు ఆకస్మికంగా నిర్వహించామని అన్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇద్దరు అధికారులు నలుగురు అనధికారులు, ముగ్గురు డాక్యుమెంట్ రైటర్లు వారి అసిస్టెంట్లు మరియు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఇద్దరు ప్రవేటు వ్యక్తులు ఉన్నారని వారిని విచారిస్తున్నామని తెలిపారు. ఈ దాడుల్లో సీఐ కృష్ణయ్య వారి సిబ్బంది పాల్గొన్నట్లు  తెలిపారు.

సబ్ రిజిస్టర్ అధికారి
తనిఖీలు చేస్తున్న అధికారులు
తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు
Continue Reading

News

జగన్ 2.0 యాప్ పోస్టర్ ఆవిష్కరన

Published

on

కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో జగన్ 2.0 యాప్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలపై కూటమి నాయకులు  చేస్తున్న అరాచకాలను ఈ యాప్ ద్వారా జగన్మోహన్ రెడ్డి కి తెలుపవచ్చు అన్నారు. పోస్టర్ విడుదల కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

జగన్ 2.0 యాప్ పోస్టర్ ను ఆవిష్కరించిన
Continue Reading

News

BREAKING ఏపీలో సర్ గడువు 24 వరకు పొడిగింపు

Published

on

ఏపీలో SIR గడువును పొడిగిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఇవాల్టితో గడువు ముగియనుండగా కొన్నిచోట్ల ప్రక్రియ పూర్తికాలేదు. దీంతో అన్ని పార్టీల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని ఈ నెల 24 వరకు గడువును పొడిగిస్తున్నట్లు తెలిపింది.

Continue Reading

Trending