News
ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం నిర్మించాలని DSF,PDSO డిమాండ్
కర్నూలు జిల్లా ఆదోనిలో PDSO రాష్ట్ర నాయకుడు తిరుమలేష్ DSF జిల్లా కార్యదర్శి ఉదయ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదోని చుట్టుపక్కల గ్రామాల నుంచి వందల మంది విద్యార్థులు ఆదోనికి చదువుకోడానికి వస్తున్నారు కానీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత స్థలం లేదు, సొంత భవనం లేదని అద్దె భవనంలో కళాశాల నడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని ఇది చాలా సిగ్గుచేటు కాబట్టి తక్షణమే ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించి భవన నిర్మాణం పూర్తి చేయాలని డి.ఎస్.ఎఫ్ పి.డి.ఎస్.ఓ విద్యార్థి సంఘాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఆదోని డివిజన్ లో చాలా సంవత్సరాల నుంచి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని గతంలో ఎన్నో ఉద్యమాలు చేశామని గుర్తుచేశారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వాలు మారుతున్న కూడా ఆదోనికి మాత్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత స్థలం లేదు.. సొంత భవన నిర్మాణం లేదు… అలాగే మైనారిటీ ఐటిఐ కళాశాల భవన నిర్మాణం కూడా పూర్తిచేసి వచ్చే అకాడమీ కేర్ అంత పూర్తి చేసి అడ్మిషన్లు ప్రారంభించాలని కోరారు. లేని పక్షంలో దశలవారీగా ఉద్యమాలు చేసేందుకు సిద్ధమవుతామని మరొక్కసారి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ఓ నాయకులు డివిజన్ కార్యదర్శి శివ, పట్టణ కార్యదర్శి రాజేష్ డిఎస్ఎఫ్ నాయకుడు హనుమేష్ రఘు వీర తదితరులు పాల్గొన్నారు.
News
ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడులు
కర్నూలు జిల్లా ఆదోని సబ్ రిజిష్టర్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు దాడులు నిర్వహించారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని అధికారులతో ప్రైవేట్ వ్యక్తులతో అనధికారికంగా ఉన్న 1లక్ష 18 వేల 700 వందల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్సీ సీతారామారావు తెలిపారు.
డీఎస్పీ సీతారామారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో భారీ ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లు వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం రావడంతో ఈ దాడులు ఆకస్మికంగా నిర్వహించామని అన్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇద్దరు అధికారులు నలుగురు అనధికారులు, ముగ్గురు డాక్యుమెంట్ రైటర్లు వారి అసిస్టెంట్లు మరియు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఇద్దరు ప్రవేటు వ్యక్తులు ఉన్నారని వారిని విచారిస్తున్నామని తెలిపారు. ఈ దాడుల్లో సీఐ కృష్ణయ్య వారి సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు.



News
జగన్ 2.0 యాప్ పోస్టర్ ఆవిష్కరన
కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో జగన్ 2.0 యాప్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలపై కూటమి నాయకులు చేస్తున్న అరాచకాలను ఈ యాప్ ద్వారా జగన్మోహన్ రెడ్డి కి తెలుపవచ్చు అన్నారు. పోస్టర్ విడుదల కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

News
BREAKING ఏపీలో సర్ గడువు 24 వరకు పొడిగింపు
ఏపీలో SIR గడువును పొడిగిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఇవాల్టితో గడువు ముగియనుండగా కొన్నిచోట్ల ప్రక్రియ పూర్తికాలేదు. దీంతో అన్ని పార్టీల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని ఈ నెల 24 వరకు గడువును పొడిగిస్తున్నట్లు తెలిపింది.

-
News1 week agoఆదోని నూతన ఆర్డీవో గా బాధ్యతలు స్వీకరించిన కె. అరుణా దేవి
-
News1 week agoకుప్పగల్ రైల్వేగేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి..
-
News1 week agoఆదోనిలో ఆసక్తికర ఘటన.. వైరల్గా మారిన ఎమ్మెల్యే వ్యాఖ్యలు
-
News4 weeks agoసూర్యుని చుట్టూ ఒక పెద్ద వృత్తాకార వలయం
-
News1 week agoతుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ
-
News4 weeks agoఅదోనిలో 30 లక్షలు విలువ చేసే 35 బైక్లు స్వాధీనం
-
News2 weeks agoవృద్ధురాలిని బావిలోకి తోసేసిన డిగ్రీ విద్యార్థి అరెస్ట్
-
News6 days agoతుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ
