News
పోలీసుల దాడులు నాటుసార బట్టీలు ధ్వంసం
కర్నూలు జిల్లా ఆదోనిలో అక్రమంగా నాటుసారా తయారు చేస్తున్న ఇద్దరు అరెస్ట్ 350 లీటర్ల నాటు సారా ఊట ధ్వంసం 20 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్న వన్ టౌన్ సిఐ విక్రమసింహ. సిఐ తెలిపిన వివరాల మేరకు రాబడిన సమాచారం మేరకు బోయ శ్రీను అనే వ్యక్తిని అదుపులో తీసుకొని తల్పరి తానీషా సమీపాన గల కొండలలో బోయ శీను కి చెందిన నాటు సారాయి బట్టీ ని మరియు 350 లీటర్ల సారాయి ఊటని ధ్వంసం చేసి పక్కన పొదల్లో దాచి ఉంచిన 20 లీటర్ల నాటు సారాయి ని స్వాధీనం చేసుకొని బోయ శీను ని ఇతనికి సహకరించిన బోయ గేరికి చెందిన రామయ్యను అరస్ట్ చేసి ఇద్దరిపై కేసు నమౌదు చేసి రిమాండ్ కి తరలించినట్లు వన్ టౌన్ సిఐ విక్రమసింహ తెలిపారు. ఈ దాడుల్లో 1 టౌన్ CI విక్రమసింహ సిబ్బంది హాజి బాషా, రంగస్వామి, HC వీరా రెడ్డి, నదిదవేటి, ముస్తాక్ లు పాల్గొన్నారు.
పోలీసులకు సహకరించండి.. అవినీతి అక్రమాలను నిర్మూలిద్దాం.. వన్ టౌన్ సిఐ విక్రమ సింహ
సిఐ విక్రమసింహా మాట్లాడుతూ అక్రమ సారాయ్, కర్ణాటక మధ్యం అక్రమ రవాణా , క్రికెట్ బెట్టింగ్ ,
పేకాట ఎవరైనా నిర్వహిస్తుంటే అంటే 9121101135 ఈ ఫోన్ నెంబర్కు సమాచారం అందించాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని వన్ టౌన్ సిఐ విక్రమ సింహ తెలిపారు.

News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




