Connect with us

News

పోలీసుల దాడులు నాటుసార బట్టీలు ధ్వంసం

Published

on

కర్నూలు జిల్లా ఆదోనిలో అక్రమంగా నాటుసారా తయారు చేస్తున్న ఇద్దరు అరెస్ట్ 350 లీటర్ల నాటు సారా ఊట ధ్వంసం 20 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్న వన్ టౌన్ సిఐ విక్రమసింహ. సిఐ తెలిపిన వివరాల మేరకు రాబడిన సమాచారం మేరకు బోయ శ్రీను అనే వ్యక్తిని అదుపులో తీసుకొని తల్పరి తానీషా సమీపాన గల కొండలలో బోయ శీను కి చెందిన నాటు సారాయి బట్టీ ని మరియు 350 లీటర్ల సారాయి ఊటని ధ్వంసం చేసి పక్కన పొదల్లో దాచి ఉంచిన 20 లీటర్ల నాటు సారాయి ని స్వాధీనం చేసుకొని బోయ శీను ని ఇతనికి సహకరించిన బోయ గేరికి చెందిన రామయ్యను అరస్ట్ చేసి ఇద్దరిపై కేసు నమౌదు చేసి రిమాండ్ కి తరలించినట్లు వన్ టౌన్ సిఐ విక్రమసింహ తెలిపారు. ఈ దాడుల్లో 1 టౌన్ CI విక్రమసింహ సిబ్బంది హాజి బాషా, రంగస్వామి, HC వీరా రెడ్డి, నదిదవేటి, ముస్తాక్ లు పాల్గొన్నారు.

పోలీసులకు సహకరించండి.. అవినీతి అక్రమాలను నిర్మూలిద్దాం.. వన్ టౌన్ సిఐ విక్రమ సింహ

సిఐ విక్రమసింహా మాట్లాడుతూ అక్రమ సారాయ్, కర్ణాటక మధ్యం అక్రమ రవాణా , క్రికెట్ బెట్టింగ్ ,
పేకాట ఎవరైనా నిర్వహిస్తుంటే అంటే 9121101135 ఈ ఫోన్ నెంబర్కు సమాచారం అందించాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని వన్ టౌన్ సిఐ విక్రమ సింహ తెలిపారు.

నాటు సారా తయారీ సామాగ్రిని కాలుస్తున్న పోలీసులు
నాటు సారా ధ్వంసం చేస్తున్న వీడియో

News

తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 28-08-2025

Published

on

By

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 19617 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 19412 క్యూసెక్కులు

Continue Reading

News

ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

Published

on

By

ఆదోని 28 08 25:

రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 20/- రూపాయలు, రిటైల్: 1kg 22/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 12/- రూపాయలు, రిటైల్: 1kg 14/- రూపాయలు

28 08 25 రైతు బజార్ ధరల పట్టిక
Advertisement

Continue Reading

News

పాము కాటుకు మహిళ మృతి

Published

on

కర్నూలు జిల్లా ఆలూరు మండలం కమ్మరచేడు గ్రామంలో పాము కాటుకు మంగమ్మ అనే మహిళ మృతి చెందింది. బంధువులు తెలిపిన వివరాలు ఈలా ఉన్నాయి.. ఉదయం పత్తి పొలంలో ఎరువు చల్లడానికి వెళ్ళిన మంగమ్మ కు పాము కరిచిందని వెంటనే చికిత్స నిమిత్తం ఆటోలో ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు మంగమ్మ ను పరీక్షించి మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు తెలపడంతో బంధువులు కన్నీరు మున్నీరయ్యారు.

అన్న గాదిలింగ
Continue Reading

Trending