Connect with us

News

పోలీసుల దాడులు నాటుసార బట్టీలు ధ్వంసం

Published

on

కర్నూలు జిల్లా ఆదోనిలో అక్రమంగా నాటుసారా తయారు చేస్తున్న ఇద్దరు అరెస్ట్ 350 లీటర్ల నాటు సారా ఊట ధ్వంసం 20 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్న వన్ టౌన్ సిఐ విక్రమసింహ. సిఐ తెలిపిన వివరాల మేరకు రాబడిన సమాచారం మేరకు బోయ శ్రీను అనే వ్యక్తిని అదుపులో తీసుకొని తల్పరి తానీషా సమీపాన గల కొండలలో బోయ శీను కి చెందిన నాటు సారాయి బట్టీ ని మరియు 350 లీటర్ల సారాయి ఊటని ధ్వంసం చేసి పక్కన పొదల్లో దాచి ఉంచిన 20 లీటర్ల నాటు సారాయి ని స్వాధీనం చేసుకొని బోయ శీను ని ఇతనికి సహకరించిన బోయ గేరికి చెందిన రామయ్యను అరస్ట్ చేసి ఇద్దరిపై కేసు నమౌదు చేసి రిమాండ్ కి తరలించినట్లు వన్ టౌన్ సిఐ విక్రమసింహ తెలిపారు. ఈ దాడుల్లో 1 టౌన్ CI విక్రమసింహ సిబ్బంది హాజి బాషా, రంగస్వామి, HC వీరా రెడ్డి, నదిదవేటి, ముస్తాక్ లు పాల్గొన్నారు.

పోలీసులకు సహకరించండి.. అవినీతి అక్రమాలను నిర్మూలిద్దాం.. వన్ టౌన్ సిఐ విక్రమ సింహ

సిఐ విక్రమసింహా మాట్లాడుతూ అక్రమ సారాయ్, కర్ణాటక మధ్యం అక్రమ రవాణా , క్రికెట్ బెట్టింగ్ ,
పేకాట ఎవరైనా నిర్వహిస్తుంటే అంటే 9121101135 ఈ ఫోన్ నెంబర్కు సమాచారం అందించాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని వన్ టౌన్ సిఐ విక్రమ సింహ తెలిపారు.

నాటు సారా తయారీ సామాగ్రిని కాలుస్తున్న పోలీసులు
నాటు సారా ధ్వంసం చేస్తున్న వీడియో

News

తుంగభద్రా డ్యాం 4 గేట్లు ఎత్తి దిగువకు నీరు

Published

on

తుంగభద్ర డ్యాం. 02 07 2025 బుధవారం ఉదయం నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నట్లు డ్యామ్ అధికారులు తెలిపారు. రెండు అడుగులు ఎత్తుకు నాలుగు గేట్లు ఎత్తి దిగువకు 10400 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు తుంగభద్ర డ్యామ్ అధికారులు సమాచారం ఇచ్చారు నది తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తుంగభద్ర డ్యాం అధికారులు ఆదేశాలు  జారీ చేశారు.
.

తుంగభద్ర డ్యాం నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీరు వదిలిన అధికారులు
Continue Reading

News

అక్రమంగా ఫీజులు వసూలు చేస్తూన్నారు

Published

on

ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు  గుర్తింపు రద్దు చేయాలని డి ఎస్ ఎఫ్, పిడిఎస్ఓ విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లా ఆదోని బీమాస్ రెస్టారెంట్లో విద్యార్థి సంఘాలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిహెచ్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, పి ఎస్ డి ఓ రాష్ట్ర నాయకుడు తిరుమలేష్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కొన్ని పాఠశాల యాజమాన్యలు స్కూల్ ఫీజు, యూనిఫామ్ ఫీజు బస్సు ఫీజు, ట్యూషన్ ఫీజు, డిపాజిట్ ఫీజ్ అని రకరకాల పేర్లతో తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు వసూళ్లకు పాల్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత చేస్తున్నా విద్యాశాఖ అధికారులు ఏమి తెలియనట్లు వివరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించాలని డి.ఎస్.ఎఫ్, పి.డి.ఎస్.ఓ విద్యార్థి సంఘా నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో దశలవారీగా ఉద్యమాలు చేపట్టేందుకు సిద్ధమవుతామని ప్రభుత్వనికి, విద్యాశాఖ అధికారులను హెచ్చరించారు.ఈ సమావేశంలో DSF, PDSO నాయకులు నవీన్ రాజ్ కుమార్ కిరణ్ పాల్గొన్నారు.

ధనాపురం ఉదయ్ యూట్యూబ్ వీడియో
Continue Reading

News

ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

Published

on

By

ఆదోని 02 07 25:

రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 38/- రూపాయలు, రిటైల్: 1kg 40/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 23/- రూపాయలు, రిటైల్: 1kg 25/- రూపాయలు

02 07 25 రైతు బజార్ ధరల పట్టిక
Advertisement

Continue Reading

Trending