News
సూపర్ సిక్స్ వాగ్దానాలు అమలు చేయాలి.. సిపిఎం
అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాల అమలు చేస్తామని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాధాకృష్ణ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణం కల్లుబావి, శంకర్ నగర్ లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై ప్రజా పోరు కార్యక్రమం నిర్వహించరు. అనంతరం ప్రజాపోరు పోస్టర్స్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాధాకృష్ణ సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్, తిప్పన్న, ముక్కన్న మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకపోవడం దారుణమని వారు తెలిపారు. అన్నిటికంటే ముఖ్యమైన పిల్లల చదువుకు సంబంధించి తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు, 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు ₹1500, రైతు భరోసా క్రింద 20వేల రుపాయాలు తదితర పథకాలు నేటికీ అమలుకు నోచుకోలేదని వారు తెలిపారు. మెగా డీఎస్సీ నిరుద్యోగ భృతి, నిరుద్యోగులకు అందని ద్రాక్షాగా మారిందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజలకు తాము ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకులు వీరేష్, నాగేంద్ర, నాగరాజు, మల్లయ్య,రాజు తదితరులు పాల్గొన్నారు.
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




