News
కబ్జాలకు పాల్పడితే తాట తీస్తా అన్న ఎమ్మెల్యే ఎక్కడ?
కర్నూలు జిల్లా ఆదోని వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయం అవినీతికి అండగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలల క్రితం కూటమి ఎమ్మెల్యే సన్నిహితుడు నకిలీ ఆధార్ కార్డుతో స్థలాన్ని కబ్జా చేసిన విషయం గుర్తు చేశారు. ప్రస్తుతం బ్రతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ సర్టిఫికెట్ సృష్టించి కోట్ల స్థలాన్ని కబ్జా చేసేందుకు ఓటమి నాయకులే కొత్త వ్యక్తులతో ఈ పని చేయించారని ఆరోపించారు. ఆదోని ప్రజలను మోసం చేస్తే ఊరుకునేది లేదని బాధితులకు వైసిపి పార్టీ అండగా నిలబడుతుందని ఎవరు భయపడవద్దని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి భరోసా ఇచ్చారు. అక్రమ రిజిస్ట్రేషన్ను రద్దు పరచాలని లేకపోతే సబ్ రిజిస్టర్ కార్యలయం ముట్టడించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. బతికున్న వ్యక్తిని మృతి చెంది నట్లు నకిలీ పత్రాలు సృష్టించిన వారిని కఠినంగా శిక్షించే వరకు పోరాడుతంఅని తెలిపారు.
కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఆస్తులు ఉన్నవారు వారానికి ఒకసారి అయినా ఆన్లైన్లో చెక్ చేసుకునే పరిస్థితి ఏర్పడిందిని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదోనిలో మార్పు తేస్తా అన్న ఎమ్మెల్యే నకిలీ ఆధార్ కార్డు నకిలీ డెత్ సర్టిఫికెట్లు నకిలీ ఫ్యామిలీ సర్టిఫికెట్లు ఎలా తయారు చేయాలి వాటిని వాడి స్థలాలను ఎలా కబ్జాలు చేయాలని నేర్పిస్తున్నారు మార్పు అంటే ఇదేనా అని ప్రశ్నించారు. కబ్జాలకు పాలు పడితే తాట తీస్తా అన్న ఎమ్మెల్యే ఎక్కడున్నావ్ అని ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు.
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




