Connect with us

News

నకిలీ పత్రాలు పెట్టండి…. కోట్ల ఆస్తులు సొంతం చేసుకోండి

Published

on

నకిలీ పత్రాలు పెట్టండి…. కోట్ల ఆస్తులు సొంతం చేసుకోండి అనే చందంగా మారింది ఆదోని సబ్ రిజిస్టర్ కార్యలయం.. ఒకటి మరవక ముందే మరొకటి నకిలీ పత్రాల భాగవతం బయటపడడంతో స్థానిక ప్రజల్లో ఆందోళన మొదలైంది.. ఇంకా ఇలా ఎన్ని జరిగాయి అని ఆదోని ప్రజలు చర్చించుకుంటున్నారు.

సబ్ రిజిస్టర్ కార్యాలయంలో బాధితులు
వివరాల కోసం పూర్తి వీడియో

కర్నూలు జిల్లా ఆదోనిలో కోట్ల విలువ చేసే భూమి అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని బాధితుడు యగ్గటి ఈశ్వరప్ప సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట కూర్చొని ఆందోళన చేపట్టారు. బతికున్న వ్యక్తికి మృతి చెందినట్లు ఫేక్  సర్టిఫికెట్లు సృష్టించి అముదాల భాస్కర్ అనె వ్యక్తి కోట్ల భూమిని  చాకలి ఇరన్న అనే వ్యక్తికి జి.పి. (జండ్రల్ పవర్ ఆఫ్ అటార్నీ) ఎలా చేసుకున్నాడని సబ్ రిజిస్టర్ ను బాధితులు యగ్గటి ఈశ్వరప్ప , కుమారులు మోహన్, సునిల్ నిలదీశారు. అనంతరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో యగ్గటి ఈశ్వరప్ప,, సబ్ రిజిస్టర్ హాజీమియా ఫిర్యాదు చేశారు.

జిపి చేసే స్థలం

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ఎగటి ఈశ్వరప్పకు ఇద్దరు కుమారులు మోహన్ సునీల్ బండిగిరి గ్రామ పంచాయతీ పరిధిలో 7 ఎకరాల 41 సెంట్లు భూమి ఉంది. అందులో 90 సెంట్లు నేషనల్ హైవేకి పోగా మిగిలిన ఆరు ఎకరాల 51 సెంట్లు భూమి మిగిలింది ఆ భూమిపై కన్నేషన్ అక్రమార్కులు ఆముదాల భాస్కర్ అనే వ్యక్తి తన పేరు ముందు ఎగటి అని జోడించి ఎగటి ఆముదాల భాస్కర్ గా పేరు మార్చుకుని తండ్రి ఎగటి ఈశ్వరప్ప చనిపోయాడని నకిలీ డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ సర్టిఫికెట్ సృష్టించి డిసెంబర్ 31వ తేదీ చాకలి ఇరన్న అనే వ్యక్తి కి జి.పి. (జండ్రల్ పవర్ ఆఫ్ అటార్నీ) చేసి రిజిస్ట్రేషన్ చేశారు. జనవరి నాలుగవ తేదీ ఎగటి ఈశ్వరప్పకు సమాచారం రావడంతో సబ్ రిజిస్టర్ నిలదీశారు ఆఫీస్ ముందు బెటాయించి ఆందోళన చేశారు. అనంతరం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆరు మందిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..

నకిలీ ఫ్యామిలీ సర్టిఫికెట్
నకిలీ డెత్ సర్టిఫికెట్

News

తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 14-07-2025

Published

on

By

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1625.49 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 78.106 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 43223 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 36345  క్యూసెక్కులు

Continue Reading

News

ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

Published

on

By

ఆదోని 14 07 25:

రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 26/- రూపాయలు, రిటైల్: 1kg 28/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 23/- రూపాయలు, రిటైల్: 1kg 25/- రూపాయలు

14 07 25 రైతు బజార్ ధరల పట్టిక
Advertisement

Continue Reading

News

చెడు నడవడిక గల వారికి పోలీసుల కౌన్సిలింగ్

Published

on

కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని  చెడు నడవడిక గల వారందరినీ పిలిపించి సిఐ ట్రాఫిక్ సిఐ గంట సుబ్బారావు కౌన్సిలింగ్ ఇచ్చారు. సిఐ మీడియాకు తెలిపిన వివరాలు కర్నూలు జిల్లా ఎస్పీ ఉత్తర్వులు మేరకు ఆదోని సబ్ డివిజనల్ ఆఫీసర్ మేడమ్  హేమలత పర్యవేక్షణలో ఈ కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. కౌన్సిలింగ్ లో పాల్గొన్న  వారందరినీ మంచి ప్రవర్తనతో ఉండాలని, ఎటువంటి క్రిమినల్ కేసుల్లో ఇన్వాల్వ్ కావద్దని, సమాజంలో మంచిగా బతుకుతూ,  ఇతరుల పట్ల సోదర భావం కలిగి ప్రశాంతంగా  జీవించాలని తెలియజేశారు.

కౌన్సిలింగ్ ఇస్తున్న సిఐ
Continue Reading

Trending