News
నకిలీ పత్రాలు పెట్టండి…. కోట్ల ఆస్తులు సొంతం చేసుకోండి
నకిలీ పత్రాలు పెట్టండి…. కోట్ల ఆస్తులు సొంతం చేసుకోండి అనే చందంగా మారింది ఆదోని సబ్ రిజిస్టర్ కార్యలయం.. ఒకటి మరవక ముందే మరొకటి నకిలీ పత్రాల భాగవతం బయటపడడంతో స్థానిక ప్రజల్లో ఆందోళన మొదలైంది.. ఇంకా ఇలా ఎన్ని జరిగాయి అని ఆదోని ప్రజలు చర్చించుకుంటున్నారు.

కర్నూలు జిల్లా ఆదోనిలో కోట్ల విలువ చేసే భూమి అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని బాధితుడు యగ్గటి ఈశ్వరప్ప సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట కూర్చొని ఆందోళన చేపట్టారు. బతికున్న వ్యక్తికి మృతి చెందినట్లు ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి అముదాల భాస్కర్ అనె వ్యక్తి కోట్ల భూమిని చాకలి ఇరన్న అనే వ్యక్తికి జి.పి. (జండ్రల్ పవర్ ఆఫ్ అటార్నీ) ఎలా చేసుకున్నాడని సబ్ రిజిస్టర్ ను బాధితులు యగ్గటి ఈశ్వరప్ప , కుమారులు మోహన్, సునిల్ నిలదీశారు. అనంతరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో యగ్గటి ఈశ్వరప్ప,, సబ్ రిజిస్టర్ హాజీమియా ఫిర్యాదు చేశారు.

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ఎగటి ఈశ్వరప్పకు ఇద్దరు కుమారులు మోహన్ సునీల్ బండిగిరి గ్రామ పంచాయతీ పరిధిలో 7 ఎకరాల 41 సెంట్లు భూమి ఉంది. అందులో 90 సెంట్లు నేషనల్ హైవేకి పోగా మిగిలిన ఆరు ఎకరాల 51 సెంట్లు భూమి మిగిలింది ఆ భూమిపై కన్నేషన్ అక్రమార్కులు ఆముదాల భాస్కర్ అనే వ్యక్తి తన పేరు ముందు ఎగటి అని జోడించి ఎగటి ఆముదాల భాస్కర్ గా పేరు మార్చుకుని తండ్రి ఎగటి ఈశ్వరప్ప చనిపోయాడని నకిలీ డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ సర్టిఫికెట్ సృష్టించి డిసెంబర్ 31వ తేదీ చాకలి ఇరన్న అనే వ్యక్తి కి జి.పి. (జండ్రల్ పవర్ ఆఫ్ అటార్నీ) చేసి రిజిస్ట్రేషన్ చేశారు. జనవరి నాలుగవ తేదీ ఎగటి ఈశ్వరప్పకు సమాచారం రావడంతో సబ్ రిజిస్టర్ నిలదీశారు ఆఫీస్ ముందు బెటాయించి ఆందోళన చేశారు. అనంతరం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆరు మందిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..


News
మత్తులో వాహనాలు నడిపితే శిక్షలు తప్పవు
మద్యం మత్తులో వాహనాలు నడిపితే తీవ్రమైన శిక్షలు తప్పవని మరోసారి రుజువు అయ్యింది.

కర్నూలు జిల్లా ఆదోని మండలంలో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. మద్యం మత్తులో వాహనాలను నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు లో పట్టుబడిన 15 మందిని పోలీసులు న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. వారిలో ట్రాఫిక్ పోలీసులు నలుగురిని, రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 11 మందిని అదుపులోకి తీసుకుని కోర్టు లో హాజరు పరుచగా విచారణ అనంతరం న్యాయమూర్తి 4 గురికి ఒక వారం రోజులు, 5 గురికి 30 రోజులు రిమాండ్ విధిస్తూ ఆదోని సబ్ జైలుకు తరలించరు. 6గురికి 10 వేల రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించరు. రోడ్డుపై ప్రయాణించే వాహన చోదకులు ముఖ్యంగా ద్విచక్ర వాహనాలతో పాటు, అన్ని రకాల వాహనాలను నడిపే వాహన డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలను రోడ్డుపై నడపవద్దని, ఇది చాలా ప్రమాదకరమని ఇకపై ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలో పట్టుపడితే ఇదే విధమైన జైలు శిక్ష తప్పదని ఆదోని పోలీసులు హెచ్చరించరు.

News
ఆదోనిలో రోడ్డు ప్రమాదం – వ్యక్తి మృతి
కర్నూలు జిల్లా ఆదోనిలో ఆస్పరి బైపాస్ రోడ్డు పెట్రోల్ బంక్ సమీపంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని AP 04 V 1430 నంబర్గల లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నప్పటికీ, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
ఆదోని పాత బ్రిడ్జిపై నుంచి పడి వృద్ధురాలికి తీవ్రగాయాలు
కర్నూలు జిల్లా ఆదోని పాత ఓవర్ బ్రిడ్జి పై నుండి కింద పడి శాంతమ్మ (70) అనే వృద్ధురాలికి తీవ్రగాయాలు అయ్యాయి. వృద్ధురాలి కుమారుడు మహానంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి కల్లుబాయిలో నివాసం ఉంటున్నామని వారం రోజుల క్రితం మహానంది తల్లి శాంతమ్మ (70) ఆస్పరి లో ఉన్న తన కూతురు వద్దకు వెళ్లి ఈరోజు మధ్యాహ్నం తిరుగు ప్రయాణమై బ్రిడ్జిపై నుంచి నడుచుకుంటూ వస్తూ కళ్ళు తిరగడంతో కింద పడిందని మహానంది తెలిపారు. స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా తీవ్ర గాయాలు ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారని మహానంది మీడియాకు తెలిపారు.
