రైతు కంటతడి పెడుతున్నాడు

కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్ యాడ్ లో  రైతులకు యూరియా అందించాలి అలాగే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు డీ ఎస్ ప్ విద్యార్థి సంఘం నాయకులు. అనంతరం విలేకరుల సమావేశంలో DSF జిల్లా అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ రైతులు ఈరన్న, సిద్ధ లింగ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాలలో మండల కేంద్రాల్లో రైతులకు యూరియా అందక యూరియా కోసం షాపుల దగ్గర గంటల తరబడి వేచి చూస్తున్న పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి వెన్నుముక అయినటువంటి రైతన్నకు రాష్ట్రంలో కష్టాలు వస్తున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం చూపించడం సరైనది కాదని అన్నారు. ఆదోని సెకండ్ ముంబై గా పేరు పొందింది అటువంటి ఆదోనిలోనే ఇవాళ రైతులకు గిట్టుబాటు ధర లేక రైతులు కంటతడి పెడుతున్న పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇప్పటికైనా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి రైతులను ఆదుకోవాలి అలాగే రైతులకు యూరియా అందించాలి రైతులకు ఏ కష్టం రాకుండా చూడాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైతులు ఈరన్న సిద్ధ లింగ, వర్మ మల్లప్ప మరియు DSF నాయకులు నరసింహులు మురళి, అరవింద్ హరి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

మీడియాతో మాట్లాడుతున్న DSF జిల్లా అధ్యక్షుడు ధనాపురం ఉదయ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top