News
బిసిలపై దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేసి కఠినంగాశిక్షించాలి
బిసిలపై దాడి చేసిన అగ్రవర్ణాల నిందితులను అరెస్ట్ చేసి కఠినంగాశిక్షించాలి అని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లా నందవరం మండలం జోహరాపురం గ్రామస్తులను వెటకోడవల్లుతో దాడి చేసిన అగ్రవర్ణాల వారిని కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిసె శివన్న జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి దేవేంద్ర డిమాండ్ చేశారు. పోలం విషయంలో కురువ మల్లేష్, కురువ నాగేంద్ర,కురువ పరమేష్ మహిళలు సరస్వతమ్మ,పెద్ద రాములమ్మ కురువ సామాజిక వర్గానికి చెందినవారు పొలం విషయంలో అగ్రవర్ణాలకు చెందిన సంజీవరెడ్డి, బాలు రెడ్డి, అర్జున్ రెడ్డి, రాఘవరెడ్డి, రామకృష్ణ రెడ్డి తదితరులు కొడవళ్లు, రాడ్లు, కర్రలతో దాడి విశాలని ఆరోపించారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా ఎస్పీ ని కోరారు.
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




