News
కర్ణాటకలో తుది దశకు చేరిన ఎన్నికల ప్రచారం
◆ కర్ణాటకలో తుది దశకు చేరిన ఎన్నికల ప్రచారం
◆ పోటాపోటీగా ప్రధాన పార్టీల హామీలు
◆ మే 10న పోలింగ్ మే 13న ఓట్ల లెక్కింపు
◆ ఒపీనియన్ పోల్స్ లో కాంగ్రెస్ ముందంజ
◆ ఒక నావాలో ఇద్దరు కెప్టెన్లు
కర్ణాటక ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. పోటాపోటీగా మేనిఫెస్టో విడుదల చేస్తున్న ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ బిజెపి తరఫున అగ్ర నేతలు రాహుల్ ప్రియాంక గాంధీ మోడీ అమిత్ షా మూల మూలన తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు 224 స్థానాలు ఉన్న కర్ణాటక అసెంబ్లీకి ఈనెల 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి మే 13వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది ఏ పార్టీ అయితే 113 సీట్లు రాబట్టుకుంటుందో అది కర్ణాటక పీఠాన్ని చేజిక్కించుకుంటుంది.

ఈసారి కన్నడ ఓటర్లు కాంగ్రెస్కు పట్టం కడుతున్నట్లు అనేక ఒపీనియన్ పూల్స్ చెప్తున్నాయి. అధికారంలో ఉన్న బిజెపికి 79 నుంచి 49 స్థానాలు రావచ్చుని ఒపీనియన్ పూల్స్ చెప్తున్నాయి. జెడిఎస్ కు 24 నుంచి 34 సీట్లు కె పరిమితమవుతుందని అంటున్నారు.

ఇంకా 6 రోజుల్లో పోలింగ్ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా తన సీఎం బెట్టిని ప్రకటించలేదు మాజీ సీఎం సిద్ధరామయ్య కేపీసీసీ అధ్యక్షుడు శివకుమార్ రేసులో ఉన్నట్టు తెలుస్తుంది

ప్రజాధరణలో ముందంజలో ఉన్న సిద్ధరామయ్య 2013 నుంచి 2018 వరకు కర్ణాటక సీఎం కొనసాగారు గడిచిన 40 ఏళ్లలో పూర్తి ఐదేళ్ల పదవీకాలంలో ఉన్న తొలి సీఎం గా సిద్ధార్థ రామయ్య ఉన్నారు కర్ణాటకలో ఈయన బాగా ఫేమస్ 8సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఒకప్పుడు జిడిఎస్ అధినేత హెచ్డి దేవ గోడకు కుడి భుజం లాంటివాడు దేవగూడ కుమారుడు కుమారస్వామిని రాజకీయ వారసుడిగా ప్రకటించటంతో ఆయనతో విభేదించి 2005లో కాంగ్రెస్ పార్టీలో చేరారు 2010లో బెంగళూరు నుంచి బళ్లారి వరకు పాదయాత్ర తీసి కాంగ్రెస్లో జోష్ నింపారు.

మరోవైపు కెపిసిసి అధ్యక్షుడు డీకే శివకుమార్ సీఎం పదవికి పోటీ పడుతున్నారు. యూత్ కాంగ్రెస్ కార్యదర్శి నుంచి కెపిసిసి అధ్యక్షుడిగా ఎదిగారు అయన అత్యంత సంపన్నుడు శివకుమార్ పార్టీని చాలాసార్లు కష్టాల నుంచి గట్టెక్కించిన వ్యక్తి. ఆయన బెంగళూరు సిటి కనకాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. గతంలో రెండు సార్లు మంత్రిగా పని చేశారు.
కాంగ్రెస్ లో గట్టి పట్టున్న ఇద్దరు నాయకులు సీఎం రేస్ లో ఉన్నట్లు బహిరంగంగానే చెబుతున్నారు. తమ పార్టీలో ఎవరైనా సీఎం పదవికి పోటీ పడవచ్చుని బహిరంగం గానే సిద్ధరామయ్య కూడా చెప్పారు. ఈ ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న పోటీ చూస్తే కాంగ్రెస్లో చీలికలు వస్తాయని స్థానికులు విమర్శలు గుపిస్తున్నారు. కానీ సిద్ధరామయ్య శివకుమార్ ఇద్దరు కలిసి పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. సిద్ధరామయ్య కు పార్టీపై ఉన్న పట్టు క్లీన్ ఇమేజ్ ఉన్నట్లు అందులో మాస్ ఫాలోయింగ్ ఉండడంతో అతనికి ఎక్కువ ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు కానీ శివకుమార్ కు ఆర్థిక అవకతవకలు మనీ లాంటి అవినీతి ఆరోపణ వెంటాడుతున్నాయి.
ప్రజా తీర్పు ఎటువైపు ఉందనేది ఈనెల 13వ తేదీ తెలియనుంది.
News
సహకార ఉద్యోగుల సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం బాసట
ఆదోని, ఫిబ్రవరి 21:ఆదోనిలోని డి.సి.సి.బి (DCCB) బ్యాంక్ ఎదుట తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సహకార సంఘాల ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం శనివారం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సమ్మె శిబిరాన్ని సందర్శించిన సంఘం నాయకులు ఉద్యోగుల పోరాటానికి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె. లింగన్న, మండల కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు:
- వ్యవసాయానికి వెన్నెముక: గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి సాగు పెట్టుబడి నుంచి ఇతర సేవల వరకు ప్రాథమిక సహకార సంఘాలు ఎంతో మేలు చేస్తున్నాయని వారు కొనియాడారు.
- ప్రభుత్వ బాధ్యత: సహకార వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా, వాటిని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు గుర్తు చేశారు.
- తక్షణ పరిష్కారం: గత కొంతకాలంగా తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు శాంతియుతంగా పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. వారి న్యాయమైన కోర్కెలను వెంటనే ప్రభుత్వం ఆమోదించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సహకార సంఘాల ఉద్యోగులు, కార్మిక సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
News
పోగొట్టుకున్న బ్యాగ్ను పోలీసులు ఒకే ఒక్క గంటలో రికవరీ
ఆదోని, ఫిబ్రవరి 18:
ప్రయాణంలో అజాగ్రత్తగా వదిలేసిన లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఆదోని వన్ టౌన్ పోలీసులు కేవలం ఒకే ఒక్క గంటలో రికవరీ చేసి బాధితురాలికి అప్పగించారు. పోలీసుల వేగవంతమైన స్పందనపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
అసలేం జరిగిందంటే? కౌతాలం నుంచి ఆదోనికి ఆర్టీసీ బస్సులో వచ్చిన ఓ మహిళ, విశాల్ మార్ట్ వద్ద దిగుతూ తన బ్యాగును బస్సులోనే మరిచిపోయింది. ఆ బ్యాగులో 6 లక్షల రూపాయల విలువైన 4 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. అయితే, ఆ తొందరలో తన వెంట తెచ్చుకున్న బ్యాగును బస్సులోనే మరిచిపోయారు. కొద్దిసేపటి తర్వాత బ్యాగు గుర్తుకు రావడంతో హుటాహుటిన బస్టాండ్కు చేరుకుని డ్రైవర్ను సంప్రదించారు. బస్సులో వెతికినప్పటికీ బ్యాగు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన బాధితురాలు సాయంత్రం 3:30 గంటలకు ఆదోని వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్ గారికి ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు.. బాధితురాలి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన పోలీసులు బస్సు డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు విచారణ చేపట్టారు. పలు ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గాలింపు చేపట్టారు. సాయంత్రం 4:30 గంటలకు పోగొట్టుకున్న సొత్తును తిరిగి పొందిన బాధితురాలు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
News
నాటు సారా స్థావరంపై పోలీసుల దాడి
ఆదోని రూరల్, ఫిబ్రవరి 18:
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా ఆదోని డీఎస్పీ శ్రీ హేమలత సూచనల మేరకు, రూరల్ సీఐ నల్లప్ప పర్యవేక్షణలో బుధవారం పెద్దతుంబలం పోలీసులు భారీ దాడులు నిర్వహించారు.
ఘటన వివరాలు:
పెద్దతుంబలం ఎస్ఐ విద్యా శ్రీ, తన సిబ్బంది రంగస్వామి (PC-3603), రామకృష్ణ (PC-3637)లతో కలిసి దొడ్డనగిరి గ్రామ శివార్లలోని సిద్ధాపురం ఆంజనేయస్వామి గుడి సమీపంలో ఉన్న గుట్టల వద్ద తనిఖీలు చేపట్టారు. అక్కడ గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న నాటు సారా బట్టిని పోలీసులు గుర్తించారు. పోలీసుల రాకను గమనించిన నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు.
భారీగా ఊట ధ్వంసం:
పోలీసులు సారా బట్టి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అక్కడ నిల్వ ఉంచిన ఊటను తక్షణమే ధ్వంసం చేశారు. అలాగే, ప్లాస్టిక్ క్యాన్లలో నిల్వ ఉంచిన 10 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
నిందితుడి గుర్తింపు:
పోలీసుల ప్రాథమిక విచారణలో, సారా బట్టి నిర్వహిస్తున్న వ్యక్తి ఆదోని పట్టణానికి చెందిన నాగరాజు కుమారుడు బోయ శివగా తేలింది. స్థానిక పొలాల యజమానుల నుంచి సేకరించిన సమాచారం మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విద్యా శ్రీ తెలిపారు. అక్రమ మద్యం తయారీ మరియు రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

-
News1 week agoవ్యాధి నయం కావడం లేదన్న బెంగతో ఆత్మహత్య
-
News2 weeks agoహత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు
-
News1 week agoఅదోనిలో అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తులు అరెస్ట్
-
News1 week agoపోగొట్టుకున్న బ్యాగ్ను పోలీసులు ఒకే ఒక్క గంటలో రికవరీ
-
News1 week agoమహిళా భద్రతపై అవగాహన సదస్సు
-
News6 days agoసహకార ఉద్యోగుల సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం బాసట
-
News1 week agoనాటు సారా స్థావరంపై పోలీసుల దాడి
