News
కర్ణాటకలో తుది దశకు చేరిన ఎన్నికల ప్రచారం

◆ కర్ణాటకలో తుది దశకు చేరిన ఎన్నికల ప్రచారం
◆ పోటాపోటీగా ప్రధాన పార్టీల హామీలు
◆ మే 10న పోలింగ్ మే 13న ఓట్ల లెక్కింపు
◆ ఒపీనియన్ పోల్స్ లో కాంగ్రెస్ ముందంజ
◆ ఒక నావాలో ఇద్దరు కెప్టెన్లు
కర్ణాటక ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. పోటాపోటీగా మేనిఫెస్టో విడుదల చేస్తున్న ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ బిజెపి తరఫున అగ్ర నేతలు రాహుల్ ప్రియాంక గాంధీ మోడీ అమిత్ షా మూల మూలన తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు 224 స్థానాలు ఉన్న కర్ణాటక అసెంబ్లీకి ఈనెల 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి మే 13వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది ఏ పార్టీ అయితే 113 సీట్లు రాబట్టుకుంటుందో అది కర్ణాటక పీఠాన్ని చేజిక్కించుకుంటుంది.

ఈసారి కన్నడ ఓటర్లు కాంగ్రెస్కు పట్టం కడుతున్నట్లు అనేక ఒపీనియన్ పూల్స్ చెప్తున్నాయి. అధికారంలో ఉన్న బిజెపికి 79 నుంచి 49 స్థానాలు రావచ్చుని ఒపీనియన్ పూల్స్ చెప్తున్నాయి. జెడిఎస్ కు 24 నుంచి 34 సీట్లు కె పరిమితమవుతుందని అంటున్నారు.

ఇంకా 6 రోజుల్లో పోలింగ్ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా తన సీఎం బెట్టిని ప్రకటించలేదు మాజీ సీఎం సిద్ధరామయ్య కేపీసీసీ అధ్యక్షుడు శివకుమార్ రేసులో ఉన్నట్టు తెలుస్తుంది

ప్రజాధరణలో ముందంజలో ఉన్న సిద్ధరామయ్య 2013 నుంచి 2018 వరకు కర్ణాటక సీఎం కొనసాగారు గడిచిన 40 ఏళ్లలో పూర్తి ఐదేళ్ల పదవీకాలంలో ఉన్న తొలి సీఎం గా సిద్ధార్థ రామయ్య ఉన్నారు కర్ణాటకలో ఈయన బాగా ఫేమస్ 8సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఒకప్పుడు జిడిఎస్ అధినేత హెచ్డి దేవ గోడకు కుడి భుజం లాంటివాడు దేవగూడ కుమారుడు కుమారస్వామిని రాజకీయ వారసుడిగా ప్రకటించటంతో ఆయనతో విభేదించి 2005లో కాంగ్రెస్ పార్టీలో చేరారు 2010లో బెంగళూరు నుంచి బళ్లారి వరకు పాదయాత్ర తీసి కాంగ్రెస్లో జోష్ నింపారు.

మరోవైపు కెపిసిసి అధ్యక్షుడు డీకే శివకుమార్ సీఎం పదవికి పోటీ పడుతున్నారు. యూత్ కాంగ్రెస్ కార్యదర్శి నుంచి కెపిసిసి అధ్యక్షుడిగా ఎదిగారు అయన అత్యంత సంపన్నుడు శివకుమార్ పార్టీని చాలాసార్లు కష్టాల నుంచి గట్టెక్కించిన వ్యక్తి. ఆయన బెంగళూరు సిటి కనకాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. గతంలో రెండు సార్లు మంత్రిగా పని చేశారు.
కాంగ్రెస్ లో గట్టి పట్టున్న ఇద్దరు నాయకులు సీఎం రేస్ లో ఉన్నట్లు బహిరంగంగానే చెబుతున్నారు. తమ పార్టీలో ఎవరైనా సీఎం పదవికి పోటీ పడవచ్చుని బహిరంగం గానే సిద్ధరామయ్య కూడా చెప్పారు. ఈ ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న పోటీ చూస్తే కాంగ్రెస్లో చీలికలు వస్తాయని స్థానికులు విమర్శలు గుపిస్తున్నారు. కానీ సిద్ధరామయ్య శివకుమార్ ఇద్దరు కలిసి పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. సిద్ధరామయ్య కు పార్టీపై ఉన్న పట్టు క్లీన్ ఇమేజ్ ఉన్నట్లు అందులో మాస్ ఫాలోయింగ్ ఉండడంతో అతనికి ఎక్కువ ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు కానీ శివకుమార్ కు ఆర్థిక అవకతవకలు మనీ లాంటి అవినీతి ఆరోపణ వెంటాడుతున్నాయి.
ప్రజా తీర్పు ఎటువైపు ఉందనేది ఈనెల 13వ తేదీ తెలియనుంది.
News
శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్

కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.


News
16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.


News
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.


-
News2 weeks ago
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా
-
News3 weeks ago
భారీ వర్షనికి రామజల చెరువు నిండి ఇళ్లలోకి నీరు
-
News3 weeks ago
తుంగభద్ర డ్యాంకు పెరుగుతున్న వరద నీరు 27-09-2025
-
News3 weeks ago
ఆదోని డివిజన్లో కురిసిన వర్షపాతం
-
Business3 weeks ago
రోజు రోజుకు పతనమవుతున్న పత్తి ధర..
-
Business4 weeks ago
Gold, Silver Price బంగారు ధర
-
Business4 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు
-
Business3 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు