News
స్మార్ట్ మీటర్లు మరియు కరెంట్ చార్జీలు భారాలకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం సిపిఎం
రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏడాదికాలంలోనే ప్రజలపై సుమారు 18 వేల కోట్ల రూపాయల కు పైగా కరెంటు చార్జీల బారాలు వేసిందని, ఇది చాలదన్నట్లు ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్ బిగించి మరింత భారం మోపాలని చూస్తుందని ఈ భారాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉంటాయని, ఉద్యమాలలో కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి. గౌస్ దేశాయ్ గౌస్, జిల్లా కార్యవర్గ సభ్యులు కే. వెంకటేశులు పిలుపునిచ్చారు.
కర్నూలు జిల్లా అదోనిలో సిపిఎం పార్టీ రాజకీయ శిక్షణ తరగతులు రెండో రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ గత ఐదేళ్లలో వేసిన కరెంటు చార్జీల భారాన్ని ఒక్క సంవత్సరంలోనే కుటమి ప్రభుత్వం ప్రజలపై వేసిందని ఈ భారాలకు వ్యతిరేకంగా ఇప్పటికే తీవ్రమైన ఉద్యమాలు జరిగాయని భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేపట్టాల్సి ఉంటుందని కార్యకర్తలు అందరూ కూడా ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ క్లాసులో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి లింగన్న మండల కార్యదర్శి వర్గ సభ్యులు బి. వీరారెడ్డి, ఎం. ఉచ్చిరప్ప, రామాంజనేయులు, మండల నాయకులు భాష, అయ్యప్ప, మునిస్వామి, పాండురంగ, తిక్కప్ప, హనుమంత్ రెడ్డి, అయ్యన్న, పాండవగల్ సర్పంచ్ కె. ఉమాదేవి, శాఖా కార్యదర్శులు నాగరాజు, విరుపాక్షి, పరమేష్, నరసమ్మ పార్టీ సభ్యులు మరియు సానుభూతిపరులు పాల్గొన్నారు.

News
ఆదోని జిల్లా కోసం ఐదు నియోజకవర్గ లు బంద్
ఆదోని జిల్లా చేయాలనే డిమాండ్కు మద్దతుగా JAC (జాయింట్ యాక్షన్ కమిటీ) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆదోని బందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా 𝐘𝐒𝐑𝐂𝐏 రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మునిసిపల్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మీడియా తో మాట్లాడుతూ పార్టీ లకు అతీతంగా, కుల, మత భేదాలు లేకుండా ఆదోని జిల్లా సాధన లక్ష్యంగా ప్రజలంతా ఏకమై ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. “ఆదోని జిల్లా – మన హక్కు” అనే నినాదంతో బందు కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించారని అన్నారు.


News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
