Connect with us

News

ఆదోనికి ఎమ్మెల్యే ఎవరు

Published

on

ఆదోనికి ఎమ్మెల్యేగా ఎవరు..
రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తుంది..
తమ అభిప్రాయాన్ని తెలిపిన ప్రజలు..
ఇది నిజమవుతుందా?

పబ్లిక్ జడ్జిమెంట్ న్యూస్ ఛానల్ చేసిన సర్వే

పబ్లిక్ జడ్జిమెంట్ న్యూస్ ఛానల్ చేసిన సర్వేలో ఆదోని ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారని ప్రజల్ని వాట్సాప్ లో ఓటింగ్ నిర్వహిస్తే వైసీపీ అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి విజయం సాధిస్తారని 59.76% ఓటు వేశారు. టిడిపి కూటమి బిజెపి అభ్యర్థి పార్థసారథి కి 40.24% ఓటు వేసి తెలిపారు.

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అడిగితే 54.1% వైఎస్ఆర్సిపి పార్టీ వస్తుందని 45.9% టిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రజలు తమ అభిప్రాయాలను తెలిపారు.
రేపటి వరకు వెయిట్ అండ్ సీ…
తెల్లవారితే ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నారన్నది ఈవీఎంలలో దాగి ఉన్న ప్రజల తీర్పు వెలువడుతుంది.

News

తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 05-08-2025

Published

on

By

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 24116 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 23655 క్యూసెక్కులు

Continue Reading

News

కర్రతో దాడి తలకు తీవ్ర గాయం

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద పెండేకల్ గ్రామంలో ఉసేని అనే వ్యక్తికి తలకు తీవ్ర గాయం కావడంతో చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉసేని తెలిపిన వివరాల మేరకు గ్రామంలో  ఘర్షణ పడుతున్నరని చూడడానికి వెళ్ళిన తనపై కర్రతో దాడి చేశారని  ఈ ఘర్షణకు తనకు ఎటువంటి సంబంధం లేకున్నా తనపై దాడి చేశారని తెలిపారు.

హుసేని తమ్ముడు తెలిపిన వివరాల వీడియో
హుసేని తెలిపిన వివరాల వీడియో
Continue Reading

News

ఆర్ అండ్ బి రోడ్లు బాగు చేయండి.. సిపిఎం పార్టీ డిమాండ్

Published

on

కర్నూలు జిల్లా ఆదోని సిపిఎం పార్టీ కార్యాలయంలో సోమవారం మండల కమిటీ సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి లింగన్న మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2025 జనవరి  (సంక్రాంతి) నాటికి గుంతలు లేని రోడ్లు ఉంటాయని చెప్పినట్లు  గుర్తుచేశారు . కానీ  ఆగస్టు నెల వచ్చిన ఒక్క గుంతను కూడా పూడ్చలేదని కావున ప్రభుత్వం తక్షణమే ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ గుంతలు పూడ్చాలని కోరారు.
ఆదోని తిమ్మారెడ్డి బస్టాండ్ నుండి సిరుగుప్ప క్రాస్ వరకు మరియు బైచిగేరి క్రాస్ నుండి కపటి గ్రామం వరకు, ధనాపురం నుండి నాగనాతనహాళ్ళి వరకు వయా హోళగుంద వరకు రోడ్లు పూర్తి గుంతల మయమై వాహనాలు ప్రయాణికులు తిరగడానికి తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే రోడ్లను బాగు చేయాలని సిపిఎం పార్టీ మండల కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదోని మండలం పాండవగల్ దగ్గర నుండి కుప్పగల్ క్రాస్ వరకు రోడ్డుకు ఇరువైపులా మట్టి అడుగు నుండి రెండు అడుగుల వరకు కోతకు గురై వాహనాలు సైడ్ కు తీసుకోలేని పరిస్థితి ఉందని, ప్రస్తుతం శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి శ్రావణమాసం ఉత్సవాలు సందర్భంగా తీవ్రమైన రద్దీ పెరిగిందని  దీనివలన రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. తక్షణమే రోడ్డుకి ఇరువైపులా గర్ల్స్ వేసి ప్రమాదాల బారి నుండి కాపాడాలని కోరారు. సమావేశంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు బి వీరారెడ్డి, ఎం. ఉచ్చిరప్ప, జే రామాంజనేయులు, మండల కమిటీ సభ్యులు భాష, అయ్యప్ప, పాండురంగ, హనుమంత్ రెడ్డి, మునిస్వామి అయ్యన్న తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending