Connect with us

News

కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం, ఈ రూట్‌లో నడిచే 43 రైళ్ల రద్దు

Published

on

షాలిమర్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్ప్రెస్ ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఆగి ఉన్న గూడ్స్ రైలు ఢీకొట్టి పట్టాలు తప్పిన ప్రమాదంలో మృతుల సంఖ్య 237కు చేరింది. 1000 మందికి పైగా గాయాలు. సిగ్నల్ ఫెయిల్ అయినందుకు ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించిన అధికారులు.
ఒడిశా రైలు ప్రమాద బాధితులకు కేంద్రం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఆర్థికసాయం, తీవ్రంగా గాయపడ్డవారికి రూ. 2 లక్షలు, స్వల్పంగా గాయాలపాలైనవారికి రూ. 50 వేలు ఆర్థిక సాయం ప్రకటించింది.
కోరమాండల్‌ ప్రమాదం : హెల్ప్‌లైన్‌ నెంబర్లు…రద్దైన రైళ్ల వివరాలు ఇవే

మానవ తప్పిదమే వందల మంది ప్రాణాలను బలిగొందా?. ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం. ఇటీవల కాలంలో మన దేశంలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదం. మూడు రైళ్లు ఒకదాన్ని మరొకటి ఢీకొనడంతో ప్రమాద తీవ్రత వర్ణనాతీతంగా పెరిగింది. కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాద ఘటనకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే హెల్ప్‌లైన్‌ నంబర్లు ఏర్పాటు చేసింది.

*రైల్వేస్టేషన్లు :
విజయవాడలో 0866 2576924,
రాజమండ్రిలో 0883 2420541,
రేణిగుంటలో 9949198414,
తిరుపతిలో 7815915571,
నెల్లూరులో 0861 2342028,
సామర్లకోటలో 7780741268,
ఒంగోలులో 7815909489,
గూడూరులో 08624250795,
ఏలూరులో 08812232267
నంబర్లను అందుబాటులో ఉంచింది. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో 040 27788516 నంబర్‌ను ఏర్పాటు చేసింది. రైలు ప్రమాదంలో చిక్కుకున్న తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమాచారం తెలుసుకోవడానికి ఈ నంబర్లకు ఫోన్‌ చేయొచ్చని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో వెల్లడించింది.

అలాగే హౌరాలో 033 2638227,
ఖరగ్‌పూర్‌లో 8972073925, 9332392339,
బాలాసోర్‌లో 8249591559, 7978418322, 858 5039521,
షాలిమార్‌లో 9903370746,
సంత్రగాచిలో 8109289460, 8340649469 నంబర్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది.

రద్దయిన రైళ్లు ఇవే : ఈ రూట్‌లో నడిచే దాదాపు 43 రైళ్లను రద్దు చేసినట్లు తెలుస్తోంది. మరో 38 రైళ్లను దారి మళ్లించింది. బెంగళూర్‌ గౌహతి రైలు.. విజయనగరం, టిట్లాగఢ్‌, టాటా మీదుగా దారి మళ్లించారు. అలాగే సికింద్రాబాద్‌-షాలిమార్‌ని దారి మళ్లించారు. హౌరా-హైదరాబాద్‌(ఈస్ట్‌ కోస్ట్‌), హౌరా-సికింద్రాబాద్‌(ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్‌), హౌరా-తిరుపతి రైళ్‌లు రద్దు అయ్యాయి.

12837 హౌరా–పూరీ ఎక్స్‌ప్రెస్‌ (02.06.2023),
12863 హౌరా–సర్‌ ఎం.విశ్వేశ్వరయ్య టెర్మినల్‌ ఎక్స్‌ప్రెస్‌ (02.06.2023),
12839 హౌరా–చెన్నై మెయిల్‌ (02.06.2023),
12895 షాలిమార్‌–పూరీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (02.06.2023),
20831 షాలిమార్‌–సంబల్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌(02.06.2023),
02837 సంత్రాగచ్చి–పూరి (02.06.2023),
22201 సీల్దా–పూరీ దురంతో ఎక్స్‌ప్రెస్‌ 0(2.06.2023),
12074 భువనేశ్వర్‌–హౌరా జన్‌ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌ (03.06.2023),
12073 హౌరా–భువనేశ్వర్‌ జన శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌ (03.06.2023),
12278 పూరీ–హౌరా శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌ (03.06.2023),
12277 హౌరా–పూరీ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌ (03.06.2023),
12822 పూరీ–షాలిమార్‌ ధౌలీ ఎక్స్‌ప్రెస్‌ (03.06.2023),
2821 షాలిమార్‌ – పూరి ధౌలీ ఎక్స్‌ప్రెస్‌ (03.06.2023),
12892 పూరి–బంగిరిపోసి (03.06.2023),
12891 బంగిరిపోసి–పూరి ఎక్స్‌ప్రెస్‌ (03.06.2023),
02838 పూరీ–సంత్రగచ్చి స్పెషల్‌ (03.06.2023),
12842 చెన్నై–షాలిమార్‌ కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ (03.06.2023),
12509 ఎస్‌ఎంవీటీ బెంగళూరు–గౌహతి (02.06.2023)

ప్రమాదం జరిగిన సంఘటన స్థలం
రైలు ప్రమాదం జరిగిన ఫోటో
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టండి.. ఆదోని సబ్ కలెక్టర్

Published

on

కర్నూలు జిల్లా ఆదోనిలో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు. గురువారం ఆదోని పట్టణంలో  నిమజ్జనం వెళ్లే ప్రధాన దారి అయినా , తిక్క స్వామికి దర్గా, ఎమ్మిగనూరు సర్కిల్, బీమా సర్కిల్, ఫరిసా మోహల్ల, శ్రీనివాస్ భవన్, గణేష్ సర్కిల్, న్యూ ఫ్లైవర్, వినాయక ఘాట్ ప్రధాన దారులను తనిఖీ చేసి పరిశీలించారు.

వినాయక కాటు వద్ద పరిశీలిస్తున్న అధికారులు

ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ… నిమజ్జనం కు ఎటువంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా గణేష్ విగ్రహాల ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తుతో నిమజ్జన ఏర్పాట్లకు చేయాలని పోలీసులను విగ్రహాలు వెళ్లే దారిలో రోడ్లో ఉండే ప్యాచ్ వర్క్ ను తర్వాత గతిన పూర్తి చేయాలని కొన్ని ముఖ్యమైన ప్రదేశాలలో బారికేడ్లను ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి అధికారులకు, విగ్రహాల ఊరేగింపు సమయంలో  విద్యుత్ తీగలు, కేబుల్ వైర్లు ను అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఊరేగింపు జరిగే వీధుల్లో రోడ్డు కన్స్ట్రక్షన్ సంబంధించిన ఇసుక, కంకర అడ్డు లేకుండా చూసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కు తెలిపారు. నిమజ్జనం సమయంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా పకడ్బందీ నియంత్రణ చేపట్టాలని పోలీసులకు సూచించారు. కెనాల్ దగ్గర గజ ఈతగాలను ఏర్పాటు చేయాలని ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులను, మెడికల్ క్యాంప్ ఏఆర్పాటు చేయాలని వైద్యాధికారులకు, నిమజ్జనం సమయంలో క్రేన్లు గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో ఉంచుకొని  ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జనం విజయవంతం చేయాలని సబ్ కలెక్టర్ స్పష్టం చేశారు.

అధికారులకు ఆదేశాలు ఇస్తున్న సబ్ కలెక్టర్


ఈ కార్యక్రమంలో డిఎస్పి హేమలత, తాసిల్దార్ రమేష్, మున్సిపల్ కమిషనర్ కృష్ణ, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పద్మనాభ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

వినాయక ఘాటు వద్ద అధికారులతో సబ్ కలెక్టర్
Continue Reading

News

కుక్క దాడి 10 మందికి గాయాలు

Published

on

కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెలగల్ గ్రామంలో పిచ్చికుక్క గ్రామస్తులపై దాడి చేయడంతో  10 మందికి గాయాలు అయ్యాయి. అందులో ఇద్దరికీ మస్తాన్ సాబ్ (68), గౌతమ్ (8) కు తీవ్ర గాయాలు కావడంతో ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  మిగిలిన 8 మందిని ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు బాధ్యులు తెలిపారు.

ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మస్తాన్ షాప్
మస్తాన్ తెలిపిన వివరాలు
Continue Reading

News

తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 28-08-2025

Published

on

By

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 19617 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 19412 క్యూసెక్కులు

Continue Reading

Trending