News
కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం, ఈ రూట్లో నడిచే 43 రైళ్ల రద్దు
షాలిమర్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్ప్రెస్ ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఆగి ఉన్న గూడ్స్ రైలు ఢీకొట్టి పట్టాలు తప్పిన ప్రమాదంలో మృతుల సంఖ్య 237కు చేరింది. 1000 మందికి పైగా గాయాలు. సిగ్నల్ ఫెయిల్ అయినందుకు ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించిన అధికారులు.
ఒడిశా రైలు ప్రమాద బాధితులకు కేంద్రం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఆర్థికసాయం, తీవ్రంగా గాయపడ్డవారికి రూ. 2 లక్షలు, స్వల్పంగా గాయాలపాలైనవారికి రూ. 50 వేలు ఆర్థిక సాయం ప్రకటించింది.
కోరమాండల్ ప్రమాదం : హెల్ప్లైన్ నెంబర్లు…రద్దైన రైళ్ల వివరాలు ఇవే
మానవ తప్పిదమే వందల మంది ప్రాణాలను బలిగొందా?. ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం. ఇటీవల కాలంలో మన దేశంలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదం. మూడు రైళ్లు ఒకదాన్ని మరొకటి ఢీకొనడంతో ప్రమాద తీవ్రత వర్ణనాతీతంగా పెరిగింది. కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాద ఘటనకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే హెల్ప్లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది.
*రైల్వేస్టేషన్లు :
విజయవాడలో 0866 2576924,
రాజమండ్రిలో 0883 2420541,
రేణిగుంటలో 9949198414,
తిరుపతిలో 7815915571,
నెల్లూరులో 0861 2342028,
సామర్లకోటలో 7780741268,
ఒంగోలులో 7815909489,
గూడూరులో 08624250795,
ఏలూరులో 08812232267
నంబర్లను అందుబాటులో ఉంచింది. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో 040 27788516 నంబర్ను ఏర్పాటు చేసింది. రైలు ప్రమాదంలో చిక్కుకున్న తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమాచారం తెలుసుకోవడానికి ఈ నంబర్లకు ఫోన్ చేయొచ్చని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో వెల్లడించింది.
అలాగే హౌరాలో 033 2638227,
ఖరగ్పూర్లో 8972073925, 9332392339,
బాలాసోర్లో 8249591559, 7978418322, 858 5039521,
షాలిమార్లో 9903370746,
సంత్రగాచిలో 8109289460, 8340649469 నంబర్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది.
రద్దయిన రైళ్లు ఇవే : ఈ రూట్లో నడిచే దాదాపు 43 రైళ్లను రద్దు చేసినట్లు తెలుస్తోంది. మరో 38 రైళ్లను దారి మళ్లించింది. బెంగళూర్ గౌహతి రైలు.. విజయనగరం, టిట్లాగఢ్, టాటా మీదుగా దారి మళ్లించారు. అలాగే సికింద్రాబాద్-షాలిమార్ని దారి మళ్లించారు. హౌరా-హైదరాబాద్(ఈస్ట్ కోస్ట్), హౌరా-సికింద్రాబాద్(ఫలక్నామా ఎక్స్ప్రెస్), హౌరా-తిరుపతి రైళ్లు రద్దు అయ్యాయి.
12837 హౌరా–పూరీ ఎక్స్ప్రెస్ (02.06.2023),
12863 హౌరా–సర్ ఎం.విశ్వేశ్వరయ్య టెర్మినల్ ఎక్స్ప్రెస్ (02.06.2023),
12839 హౌరా–చెన్నై మెయిల్ (02.06.2023),
12895 షాలిమార్–పూరీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (02.06.2023),
20831 షాలిమార్–సంబల్పూర్ ఎక్స్ప్రెస్(02.06.2023),
02837 సంత్రాగచ్చి–పూరి (02.06.2023),
22201 సీల్దా–పూరీ దురంతో ఎక్స్ప్రెస్ 0(2.06.2023),
12074 భువనేశ్వర్–హౌరా జన్ శతాబ్ధి ఎక్స్ప్రెస్ (03.06.2023),
12073 హౌరా–భువనేశ్వర్ జన శతాబ్ధి ఎక్స్ప్రెస్ (03.06.2023),
12278 పూరీ–హౌరా శతాబ్ధి ఎక్స్ప్రెస్ (03.06.2023),
12277 హౌరా–పూరీ శతాబ్ధి ఎక్స్ప్రెస్ (03.06.2023),
12822 పూరీ–షాలిమార్ ధౌలీ ఎక్స్ప్రెస్ (03.06.2023),
2821 షాలిమార్ – పూరి ధౌలీ ఎక్స్ప్రెస్ (03.06.2023),
12892 పూరి–బంగిరిపోసి (03.06.2023),
12891 బంగిరిపోసి–పూరి ఎక్స్ప్రెస్ (03.06.2023),
02838 పూరీ–సంత్రగచ్చి స్పెషల్ (03.06.2023),
12842 చెన్నై–షాలిమార్ కోరమండల్ ఎక్స్ప్రెస్ (03.06.2023),
12509 ఎస్ఎంవీటీ బెంగళూరు–గౌహతి (02.06.2023)


News
బస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష
కర్నూలు జిల్లా ఆదోని కోర్టు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట ఇద్దరు స్లీపర్ బస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష విధించరు. టూ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి సోమవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్న సమయంలో బళ్లారి నుండి హైదరాబాద్ వెళుతున్న గీతా ట్రావెల్స్ మరియు ఐ.వి.ఆర్.ఎస్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులకు డ్రైవర్లకు పోలీసులు టెస్టులు నిర్వహించరు. బ్రీత్ అనలైజర్ ద్వారా చెక్ చేసి వారిని డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు బుక్ చేసి ఇద్దరు డ్రైవర్లని పోలీసులు కోర్టు ముందు హాజరు పరిచరు. స్లీపర్ బస్సు డ్రైవర్లు గణేష్ కు 15 రోజులు, సుధీర్ కు 7 రోజులు, ఒక ద్విచక్ర వాహనం దారుడికి మూడు రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించారు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్.

News
పత్తికొండలో ఏసీబీ అధికారుల దాడులు
కర్నూలు జిల్లా పత్తికొండలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దేవనకొండ మండలం నల్లచెల్లిమిల వీఆర్వో అశోక్ రైతు నుండి 40000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నరు. ఆర్మీ రిటైర్డ్ జవాన్ శివకుమార్ తన తల్లి పేరునా ఉన్న భూమిని మార్చాలని అప్లికేషన్ పెట్టడంతో విఆర్వో లంచం డిమాండ్ చేశాడు. ఆర్మీ జవాన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించరు. కర్నూలు ఏసీబీ డిఎస్పి సోమన్న పత్తికొండ లోని నెట్ సెంటర్లో రైతు నుండి పొలం పాస్ బుక్ ముటేషన్ కోసం డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నరు.
News
ఆదోని సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు (మం) కోటేకల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారు జామున 4 గంటలకు షిఫ్ట్ డిజైర్, ఫార్చునర్ ఢీకొనడంతో షిఫ్ట్ డిజైర్లో ఉన్న ఐదు మంది కర్ణాటక వాసులు మృతి చెందారు.
ఫార్చునర్ లో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. మృతులంతా కర్ణాటక కోలార్ జిల్లా బంగారు పేటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వరిలో ఒకే కుటుంబానికి చెందిన బార్య మీనాక్షి భర్త సతీష్ కుమార్ కుమారుడు రుతిక్ మామ వెంకటేష్ అప్ప బంధువుల పిల్లోడు బనిత్ గౌడ్ మృతి చెందారు. అత్త గంగమ్మ, డ్రైవర్ చేతన్ ఇద్దరు తీవ్రగాయాలతో ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో పొందుతున్నారు.



ఫార్చునర్ కార్ లో ఉన్న నలుగురికి బెలూన్స్ ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతో ఆదోనిలో ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో చికిత్స పొందుతున్నారు. ఫార్చునర్ కార్ లో ఉన్న అశోక్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి ఆదోనిలో వారి బంధువుల రిసెప్షన్ హైదరాబాదు నుంచి ఆదోని వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు.


-
News4 days agoఆదోని సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
-
News2 weeks agoఆదోనిలో రోడ్డు ప్రమాదం – వ్యక్తి మృతి
-
News2 weeks agoమత్తులో వాహనాలు నడిపితే శిక్షలు తప్పవు
-
News2 days agoపత్తికొండలో ఏసీబీ అధికారుల దాడులు
-
News20 hours agoబస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష
-
News1 week agoపత్తి కొనుగోలు కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు
-
News3 weeks agoఆదోని పాత బ్రిడ్జిపై నుంచి పడి వృద్ధురాలికి తీవ్రగాయాలు
-
News3 weeks agoవైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ రౌండ్ టేబుల్ సమావేశం
