News
తప్పిపోయి 30 సంవత్సరాల తర్వాత ఇంటికి చేరిన యువకుడు..

తప్పిపోయి 30 సంవత్సరాల తర్వాత సొంత కుటుంబానికి చేరాడు యువకుడు..
కర్నూలు జిల్లా ఆదోని పట్టానికి చెందిన వీరేష్ గత 30 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల వయసులో రైల్లో తప్పిపోయి తమిళనాడులో ప్రత్యక్షమయ్యాడు. అక్కడ బోర్డింగ్ లో కొద్దిరోజులు నివసించి. అక్కడనుండి ముంబై లోని అనాధాశ్రమమునకు బదిలీ చేశారు. అక్కడే పదవ తరగతి వరకు చదువుకొని హోటల్లో వెయిటర్ గా పనిచేస్తున్నాడు. ఎప్పటికైనా సొంత వారిని కలుస్తానన్న ఆశ తగ్గలేదు. కేవలం అతనకు నానమ్మ అంజనమ్మ, నాన్న జనార్ధన్, ఊరు ఆదోని అని మాత్రమే తెలుసు. ఈ నేపథ్యంలోనే గత రెండు రోజుల నుంచి ఆదోని లో తిరుగుతున్న ఎటువంటి కుటుంబ సభ్యుల సమాచారం అందలేదు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉన్నదని తెలుసుకొని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు తనకు జరిగిన విషయాన్ని తెలియజేశాడు. అనంతరం సబ్ కలెక్టర్ వెంటనే స్పందించి మున్సిపల్ కమిషనర్ ఫోన్ ద్వారా వీరేష్ వివరాలు తెలియజేసారు. ఈ నేపథ్యంలో పట్టణంలో ఉండే సచివాలయాల్లో మరియు సామాజిక మాధ్యమం, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రకటన విడుదల చేశారు. ప్రకటనల ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న మేనత్త భర్త జగదీష్ సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. జగదీష్ విషయాలను పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని తాసిల్దార్ వారికి మరియు మున్సిపల్ కమిషనర్కు సబ్ కలెక్టర్ ఆదేశించారు. అనంతరం పూర్తిస్థాయిలో విచారణ చేపట్టగా వీరేష్ వారి అమ్మ వీరేష్ పుట్టిన సంవత్సరం లోపల మరణించిందని, వీరేష్ తండ్రి అనారోగ్యంతో 2008 సంవత్సరంలో మరణించాడని అలాగే వారి నానమ్మ అంజనమ్మ 2011వ సంవత్సరంలో మరణించారని తెలిపారు. వారి కుటుంబ సభ్యులలో వారి మేనత్త లక్ష్మి (చిట్టెమ్మ) మాత్రమే జీవించారని ప్రస్తుతం వారు కర్నూలు నగరంలో నివసిస్తున్నారని విచారణలో తెలిపారు. చిన్నప్పుడు తను నివసించిన ప్రదేశాల్లో మేనత్త భర్త అయినా జగదీష్ తీసుకెళ్లి చూపించాడు. చూసిన వీరేష్ ఇవన్నీ నిజమేనని వీరు నా రక్త సంబాధికులే అని వీరేష్ అధికారులకు తెలిపాడు.
ఈ సందర్భంగా వీరేష్ జనార్ధన్ మాట్లాడుతూ… నేను చిన్న వయసులో తప్పిపోయాను, 30 సంవత్సరాలు అయిందని నా కుటుంబ సభ్యులను , 24 గంటల్లోపే నాయొక్క కుటుంబ సభ్యుల చెంతకు చేర్చిన సబ్ కలెక్టర్కు, మున్సిపల్ కమిషనర్, తాసిల్దార్, రెవెన్యూ, మీడియా సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మేనత్త భర్త అయినా జగదీష్ మాట్లాడుతూ… వీరేష్ కొరకు చాలా రోజులుగా వెతికాము కానీ ఎటువంటి సమాచారం లేదు, 30 సంవత్సరాల తర్వాత వీరేష్ మమ్మల్ని వెతుక్కుంటూ రావడం చాలా భావిద్వేగానికి గురై సంతోషం గా ఉన్నది. వీరేష్ మా వరకు తీసుకొని వచ్చిన ప్రభుత్వ అధికారులకు మరియు మీడియా కృతజ్ఞతలు తెలియజేశారు.
News
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 03-07-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1625.53 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 78.239 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 28500 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 13748 క్యూసెక్కులు
News
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 03 07 25:
రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 38/- రూపాయలు, రిటైల్: 1kg 40/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 24/- రూపాయలు, రిటైల్: 1kg 26/- రూపాయలు


News
ఆదోని డివిజన్ లో కురిసిన వర్షపాత నమోదు

కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ లో 02వ తేదీ బుధవారం కురిసిన వర్షపాతంపై రెవెన్యూ అధికారులు అధికారులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి..
1. కౌతాళం Kowthalam : 44.6 mm
2. పెద్దకడుబూర్ Peddakadabur : 43.6 mm
3.ఎమ్మిగనూరు Yemmiganur : 38.6 mm
4.గోనెగండ్ల Gonegandla : 25.6 mm
5.ఆదోని Adoni : 21.6 mm
6.నందవరం Nandavaram : 18.2 mm
7.మంత్రాలయం Mantralayam : 13.6 mm
8.కోసిగి Kosigi : 12.6 mm
9.హోలాగుంద Holagunda: 9.4 mm
ఆదోని డివిజన్లో కూర్చున్న వర్షం మొత్తం : 227.8 mm
సుమారుగా : 25.3 mm
-
News1 day ago
తుంగభద్రా డ్యాం దిగువకు నీరు విడుదల
-
News4 days ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 29-6-2025
-
News18 hours ago
తుంగభద్రా డ్యాం 4 గేట్లు ఎత్తి దిగువకు నీరు
-
Business18 hours ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
News1 day ago
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
-
News1 day ago
స్కూల్ బస్సులు తనిఖీలు నిర్వహించిన అధికారులు
-
Business2 days ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business18 hours ago
Gold, Silver Price బంగారు ధర