కర్నూలు జిల్లా ఆదోనిలో సిరుగుప్ప టర్నింగ్ వద్ద వ్యవసాయ రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. వ్యవసాయ అధికారి అశోక్ కుమార్ తెలిపిన వివరాల ఎలా ఉన్నాయి ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా ఎరువుల రవాణా చేస్తున్నారని సమాచారంతో సోమవారం అక్రమ రవాణాను అరికట్టుడాం కోసం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వ్యవసాయ అధికారి పి. ఎల్. వరలక్ష్మి ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ, రవాణా మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బృందాలను బృందాలుగా ఏర్పడి శిరుగుప్ప చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించామని తెలిపారు. ఈ తనిఖీలో వ్యవసాయ శాఖ వ్యవసాయ సహాయ సంచాలకులు బి.బాలవర్ధి రాజు, వ్యవసాయ అధికారి సి. అశోక్ కుమార్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్, ఆర్ ఐ పెద్దయ్య పాల్గొన్నారు.



