ఆదోని ఫర్టిలైజర్స్ షాపులలో 32 లక్షల అక్రమ నిల్వలను పట్టుకున్న విజిలెన్స్ అధికారులు

ఆదోని ఫర్టిలైజర్ షాపులపై వ్యవసాయ మరియు విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు..

శ్రీ భీమేశ్వర ఫర్టిలైజర్స్, భువనేశ్వరి సీడ్స్, గీత హైబ్రిడ్ సీడ్స్ దుకాణాలలో సుమారు 32 లక్షల విలువగల రసాయనకి ఎరువులు, బిటి పత్తి విత్తనాలు, కూరగాయల విత్తనాలు అమ్మకాలను నిలిపివేసిన అధికారులు..

తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు

వ్యవసాయ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ఆదోనిలో ని విత్తనా మరియు ఎరువుల దుకాణాలపై వ్యవసాయ మరియు విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఆకస్మిక దాడులు నిర్వహించిరు. ఈ దాడులలో
భీమేశ్వర ఫర్టిలైజర్స్ స్టాట్ బుక్ కు మరియు ఈపాస్ మిషన్ నందు పొందుపరిచిన నిల్వల లో తేడాలు ఉండడం వల్ల 5 లక్షల 88 వేల 520 రూపాయల విలువగల రసాయనిక ఎరువులను మరియు భువనేశ్వరి సీడ్స్ నందు 22 లక్షల 61 వేల 941 రూపాయల విలువగల రసాయనిక ఎరువుల అమ్మకాలను తాత్కాలికంగా అధికారులు నిలిపివేశారు.

స్టాక్ నిలువల బుక్కులను తనిఖీ చేస్తున్న అధికారు

అంతేకాక భువనేశ్వరి సీడ్స్ సెంటర్ నందు 2 లక్షల 46 వేల 240 రూపాయల విలువగల బిటి పత్తి విత్తనాలను మరియు గీత హైబ్రిడ్ సీడ్స్ లో ఒక లక్ష 7 వేల 700 రూపాయల కూరగాయ విత్తనాల అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేశారు.

ట్రాన్స్పోర్ట్ లలో అధికారుల తనిఖీలు

అనంతరం నవత ట్రాన్స్పోర్ట్ మరియు SRMT ట్రాన్స్పోర్ట్ లలో కూడా తనిఖీలు నిర్వహించారు.
ఈ దాడుల్లో వి. హనుమంతరావు సహాయ వ్యవసాయ సంచాలకులు, క్రోసూరు మరియు పి చంద్రశేఖర్ రెడ్డి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి, మండల వ్యవసాయ అధికారి అశోక్ కుమార్ రెడ్డి, సహాయ సంచాలకులు అరుణకుమారి పాల్గొన్నారు.

రికార్డులను పరిశీలిస్తున్న అధికారులు
యూట్యూబ్ వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version