News
పెండింగ్లో ఉన్న ఉపాధి వేతనాలు చెల్లించాలి జిల్లా అధ్యక్షులు వీరశేఖర్ డిమాండ్

జిల్లాలో సుమారు 8 వారాలుగా పెండింగ్ లో ఉన్న ఉపాధి హామీ వేతనాలు తక్షణమే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి వీరశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లా ఆదోనిలో శనివారం జరిగిన వర్క్ షాప్ లో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ నెల నుండి ఈరోజు వరకు ఉపాధి వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని, ఉపాధి కూలీలను నష్టం చేస్తుందన్నారు. ఒకపక్క చాలీచాలని వేతనాలు, మరోపక్క నెలలు గడుస్తున్న వేతనాలు చెల్లించకుండా పెండింగ్లో పెట్టడం ఉపాధి హామీని నిర్వీర్యం చేయడం కోసం చేస్తున్న కుట్ర లాగా కనిపిస్తుందని ఆరోపించారు. ఉపాధి హామీ కూలీల ఐక్యంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే లింగన్న ,సహాయ కార్యదర్శి తిక్కన్న, ఆదోని, పెద్దకడబూరు, కౌతాళం, కోసిగి మండలాల ముఖ్య కార్యకర్తలు శ్రీనివాసులు, నాగేంద్ర, శంకర్, తదితరులు పాల్గొన్నారు.

News
రైతులకు రాయితీ వేరుశనగ పంపిణీ

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ అధికారి అశోక్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆదోని మండలం లోని గ్రామాల రైతు సోదరులకు ప్రభుత్వ రాయితీ ద్వారా వేరుశనగ పంపిణీ చేస్తుందని రైతు సేవ కేంద్రాలలో రాయితీ వేరుశనగ కోసం రైతులు తమ ఆధార్ కార్డులతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. వేరు శనగ విత్తనాలు (K 6) రకం కావాల్సిన రైతులు రిజిస్ట్రేషన్ చేసుకొని విత్తనాలు పొందవచ్చని ఒక రైతుకు ఎకరాల ప్రకారం (0.5 ఎకరాలకు 1 బ్యాగు, 2 ఎకరాలకు 03బ్యాగులు) గరిష్టంగా 3 బ్యాగుల వరకు ఇస్తున్నట్లు తెలిపారు, ఒక బ్యాగు బరువు 30 కేజీలు. ఉంటుందని వేరు శనగ క్వింటాలు ధర 9300/- కు, ప్రభుత్వ రాయితీ 3720/- రైతు వాటా 5580/- కట్టాలని అన్నారు.


News
ఎరువుల అక్రమ రవాణా పై ఉక్కు పాదం

కర్నూలు జిల్లా ఆదోనిలో సిరుగుప్ప టర్నింగ్ వద్ద వ్యవసాయ రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. వ్యవసాయ అధికారి అశోక్ కుమార్ తెలిపిన వివరాల ఎలా ఉన్నాయి ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా ఎరువుల రవాణా చేస్తున్నారని సమాచారంతో సోమవారం అక్రమ రవాణాను అరికట్టుడాం కోసం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వ్యవసాయ అధికారి పి. ఎల్. వరలక్ష్మి ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ, రవాణా మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బృందాలను బృందాలుగా ఏర్పడి శిరుగుప్ప చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించామని తెలిపారు. ఈ తనిఖీలో వ్యవసాయ శాఖ వ్యవసాయ సహాయ సంచాలకులు బి.బాలవర్ధి రాజు, వ్యవసాయ అధికారి సి. అశోక్ కుమార్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్, ఆర్ ఐ పెద్దయ్య పాల్గొన్నారు.


News
మెడికల్ కళాశాల పనులు ప్రారంభించాలి

కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు విద్యార్థి సంఘం నాయకులు మెడికల్ కాలేజ్ పనులు ప్రారంభించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా PDSO రాష్ట్ర నాయకుడు తిరుమలేష్, DSF జిల్లా అధ్యక్షుడు దనాపురం ఉదయ్ PSA రాష్ట్ర అధ్యక్షుడు రాజు SSA రాష్ట్ర కార్యదర్శి శివ ప్రసాద్ గౌడ్ PDSO డివిజన్ కార్యదర్శి శివ మాట్లాడుతూ. మెడికల్ కళాశాల పై కూటమి ప్రభుత్వం నిర్లక్షం వీడలని ఆదోని మెడికల్ కళాశాల అర్ధాంతరంగా పనులు నిలిపేసి కూటమి ప్రభుత్వం 66 సంవత్సరాలకు లీజుకి ఇస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్య ప్రజలకు సరైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేశారని కొనియాడారు. కానీ కూటమి ప్రభుత్వం విద్యార్థుల కడుపులు కొడుతూ ప్రైవేట్ పరం చేస్తూ PPP పద్ధతిలో కొనసాగిస్తామని ప్రభుత్వ నిర్ణయం సరైన పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ అధీనంలోనే మెడికల్ కళాశాలను కొనసాగించాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
-
News3 days ago
కౌతాళం మండలం లో దారుణం
-
News2 days ago
క్రికెట్ బెట్టింగ్ లో 91 లక్షల నగదు స్వాధీనం
-
News3 weeks ago
భారత్-పాక్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన
-
News2 weeks ago
ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్గా లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నిక
-
News3 hours ago
ఫిట్నెస్ లేని స్కూల్ బస్సుల యాజమాన్యం పై చర్యలు తీసుకోండి
-
News3 weeks ago
వీరజవాన్ మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించిన మంత్రి నారా లోకేష్
-
News1 day ago
వెన్నుపోటు దినం పోస్టర్ విడుదల చేసిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి
-
News3 weeks ago
శాశ్వతంగా త్రాగునీటి పరిష్కరించాలని సిపిఎం పార్టీ పాదయాత్ర