Connect with us

News

వర్షాలు లేక ఎండిపోతున్న పంటలనకు ట్యాంకర్ల ద్వారా నీళ్లతో తడుపుతున్న రైతు

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని మధిర గ్రామంలో సిపిఎం ప్రతినిధి బృందం పొలాలలో పంటలను పరిశీలించారు. వర్షాలు లేక ఎండిపోతున్న మిరప, ఉల్లి పంటలను కాపాడుకోవడానికి ట్యాంకర్ల ద్వారా నీళ్లు పొలాలకు తడుపుతున్న రైతు రామాంజనేయులు పొలాన్ని పరిశీలించారు. ఆ రైతును అడిగి వివరాలు తెలుసుకొన్నారు రైతు రామాంజనేయులు మాట్లాడుతూ ఒకసారి ఎకరా పొలం తడపాలంటే 30 వేల రూపాయలు ఖర్చవుతుందని, ఏడెకరాలకు ఒకసారి 2 లక్షల పదివేల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపాడు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కే. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, పంట చేతికి వస్తుందో లేదో గ్యారెంటీ లేని దానికోసం ఒక ఎకరాకు 1 లక్ష 50 వేల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు తెలిపారు. ఇంత తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కరువు మండలాల ప్రకటన విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

అందుకోసమే సిపిఎం పార్టీగా అక్టోబర్ 30 నుండి ఆదోని నుండి రాయలసీమ రైతుల కరువు యాత్ర పేరిట బస్సు జాత నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కే. ప్రభాకర్ రెడ్డి జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, బిరామాంజనేయులు, వెంకటేశులు సిపిఎం మండల కార్యదర్శి కే లింగన్న, మండల కార్యదర్శి వర్గ సభ్యులు బి వీరారెడ్డి, మండల నాయకులు రామాంజనేయులు, తిక్కప్ప, తదితరులు పాల్గొన్నారు.

రైతుతో మాట్లాడి వివరాలు కనుకుంటున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కే. ప్రభాకర్ రెడ్డి
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

Published

on

ఆదోని 09-01-2026:

కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు

09 01 26 రైతు బజార్ ధరల పట్టిక
అడ్వర్టైజ్మెంట్
Continue Reading

News

వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక

Published

on

వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్‌ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.

Continue Reading

News

కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం

Published

on

కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.

కాలుతున్న పత్తి
మంటలు ఆర్పుతున్న స్థానికులు
మంటలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది
జెసిబి తో పత్తిని పక్కకు చూస్తున్న ఫోటో
Continue Reading

Trending