News
ఆర్ట్స్ కాలేజ్ సమీపంలో రెండు స్కూటర్లు ఢీ
సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో డ్రైనేజ్, సిసి రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ.
కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో గురువారం రూ. 35 లక్షల వ్యయం తో డ్రైనేజీ, సిసి రోడ్డు నిర్మాణ పనులకు సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ. కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రోడ్డు సదుపాయం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రారంభించిన పనులను 3 నెలల లోపు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వర్షం పడితే కార్యాలయ ఆవరణంలో ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉండేది మున్సిపల్, సబ్ కలెక్టర్ వారి సహకారంతో రూ 35. లక్షల వ్యయంతో సి.సి రోడ్డు, డ్రైనేజ్ ఏర్పాటు చేయడం సంతోషమన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ కే. శాంత, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, ఇంజనీర్స్ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.


News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




