News
కురిసిన భారీ వర్షాలకు 30 లక్షల పంట నష్టం
రెండు రోజులుగా కూర్చున్న భారీ వర్షాలకు పంట పొలాలు నీటిలో మునిగి భారీ నష్టం వాటిల్లింది.

కర్నూలు జిల్లా ఆదోనిలో రెండు రోజుల నుండి కురిసిన వర్షానికి కడిచోట గ్రామ సమీపంలో ని నర్సరీ లో సుమారు 30 లక్షల పంట నార నష్టం జరిగింది. మీరంతా నర్సరీకి చేరడంతో మిరప మొక్కల వేలు కొట్టుకపోయాయి సామాగ్రి బాక్సులు రేలు ఎరువులు మెట్లు దెబ్బతిన్నాయి దీంతో లక్షల నష్టం వాటిల్లింది అన్నమయ్య జిల్లా మదనపల్లి కి చెందిన రమేష్ గత 15 సంవత్సరాలుగా కడి తోట గ్రామ సమీపంలో నర్సరీ నిర్వహిస్తున్నారు ప్రస్తుతం ఆరు ఎకరాల లో మిరప మొక్కలు పెంచుతున్నారు.
మిరపనార పెంచి 30 రోజుల తర్వాత రైతులకు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. ఇంకొక రెండు రోజులు ఉంటే రైతులకు మిరప నారా అందించేవారమని తెలిపారు. వర్షానికి మిరప నారా మొత్తం దెబ్బతిని కొట్టుకుపోయిందని దాదాపు 30 లక్షల నష్టం వాటిల్లిందని నర్సరీ నిర్వాహకులు రమేష్ తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




