రెండు రోజులుగా కూర్చున్న భారీ వర్షాలకు పంట పొలాలు నీటిలో మునిగి భారీ నష్టం వాటిల్లింది.
కర్నూలు జిల్లా ఆదోనిలో రెండు రోజుల నుండి కురిసిన వర్షానికి కడిచోట గ్రామ సమీపంలో ని నర్సరీ లో సుమారు 30 లక్షల పంట నార నష్టం జరిగింది. మీరంతా నర్సరీకి చేరడంతో మిరప మొక్కల వేలు కొట్టుకపోయాయి సామాగ్రి బాక్సులు రేలు ఎరువులు మెట్లు దెబ్బతిన్నాయి దీంతో లక్షల నష్టం వాటిల్లింది అన్నమయ్య జిల్లా మదనపల్లి కి చెందిన రమేష్ గత 15 సంవత్సరాలుగా కడి తోట గ్రామ సమీపంలో నర్సరీ నిర్వహిస్తున్నారు ప్రస్తుతం ఆరు ఎకరాల లో మిరప మొక్కలు పెంచుతున్నారు.
మిరపనార పెంచి 30 రోజుల తర్వాత రైతులకు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. ఇంకొక రెండు రోజులు ఉంటే రైతులకు మిరప నారా అందించేవారమని తెలిపారు. వర్షానికి మిరప నారా మొత్తం దెబ్బతిని కొట్టుకుపోయిందని దాదాపు 30 లక్షల నష్టం వాటిల్లిందని నర్సరీ నిర్వాహకులు రమేష్ తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.