Connect with us

News

ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్న జయ మనోజ్ రెడ్డి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని 34 వార్డు ఎల్.బి స్ట్రీట్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్చార్జి జయ మనోజ్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి గడపకు తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జయ మనోజ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి పేదవాళ్ళకి అమ్మ ఒడి, నాడు నేడు కింద స్కూళ్ళు సుందరికరణ, రజకులకు నాయి బ్రాహ్మణులకు మౌజాన్లకు పాస్టర్లకు, బ్రాహ్మణులకు చేనేతలకు, డ్వాక్రా మహిళలకు ఇలాగ అనేక వర్గాలకు అండగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నిలిచిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాల తో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేసింది తెలిపారు.

ప్రజలకు సమస్యలు అడిగి తెలుసుకుంటున్న జయ మనోజ్ రెడ్డి

చంద్రబాబు ప్రభుత్వంలో దోపిడీ దొంగ గా ప్రజా కోర్టులో ప్రజా ద్రోహిగా చంద్రబాబు నిలవడం జరిగింది అని అన్నారు. ప్రజల ఆశీస్సులతో 2024లో వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి సీఎంగా అలాగే సాయి ప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి ఈ రాష్ట్ర అభివృద్ధికి నియోజకవర్గ అభివృద్ధికి ప్రజలందరూ కూడా సహకరించాలని జయ మనోజ్ రెడ్డి కోరారు.

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న జయ మనోజ్ రెడ్డి


ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి ఆదోని పట్టణ అధ్యక్షులు బి దేవా స్టేట్ డైరెక్టర్ రేణుక చైర్పర్సన్ బోయ శాంత జిల్లా ఒక బోర్డ్ చైర్మన్ నియాజమ్మద్ కౌన్సిలర్లు రఘునాథ్ రెడ్డి చలపతి నర్సింలు మధుసూదన్ శర్మ మాజీ మార్కెట్ చైర్మన్ భాష శ్రీలక్ష్మి జులేఖబి చిన్న ఈరన్న సన్నీ రహీం గంగాధర్ కోదండ శంకర్ శోభలత నాగరాజ్ శీనా వార్డు కౌన్సిలర్ అంజినమ్మ వార్డ్ ఇన్చార్జి కె భాస్కర్ సూరి రామలింగేశ్వర్ యాదవ్ మధు సచివాలయం సిబ్బంది మున్సిపల్ అధికారులు తదితరు పాల్గొన్నారు.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్

Published

on

కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్‌మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.

పరీక్షలు నిర్వహిస్తున్న మున్సిపల్ అధికారులు
సంతకం చేస్తున్న కౌన్సిలర్ ఫయాజ్
Continue Reading

News

16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.

పూర్తయిన కాలువలు
పూర్తి చేసిన రోడ్డు పనులు
Continue Reading

News

శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా

Published

on

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో  ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు  బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.

అదుపుతప్పి బోల్తా పడిన బస్సు
అదుపుతప్పి బోల్తా పడిన బస్సు
Continue Reading

Trending