News
నిర్మాణంలో అవినీతి మాయ.. నాణ్యత లోపం CPM విమర్శ

ఆదోని పట్టణానికి త్రాగునీరు అందించే ఉద్దేశంతో 2002-2005 మధ్యలో నిర్మించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణంలో నాణ్యత లోపించిందని అందువల్లనే ఇప్పటికి మూడుసార్లు కట్ట కృంగిపోవడం జరిగిందని, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పీఎస్ రాధాకృష్ణ ఆరోపించారు. కుంగిపోయిన ఎస్ఎస్ ట్యాంకు కట్టను సిపిఎం ప్రతినిధి బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో మంచినీటి సమస్య పరిష్కారం కోసం, ఎస్ ఎస్ ట్యాంక్ నిర్మించాలని, సిపిఎం తోపాటు ఇతర రాజకీయ పార్టీలు, రెండు దశాబ్దాలుగా పోరాట ఫలితంగా, 2000 సంవత్సరంలో ఎస్ఎస్ ట్యాంక్ మొదలై 36 కోట్ల రూపాయలతో నిర్మించిన ఎస్ ఎస్ ట్యాంకు స్థాయిలో పట్టణ ప్రజల దాహార్తి పూర్తిస్థాయిలో తీర్చకముందే, ట్యాంకు కట్ట 2021లో రెండుసార్లు, ప్రస్తుతం 2023లో దాదాపు 100 మీటర్లు కట్ట కృంగిపోయినది ఇంకా 300 మీటర్లు కుంగి కూలిపోవడానికి సిద్ధంగా ఉందని దీనివల్ల కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఎస్ ఎస్ ట్యాంక్ కట్ట నిర్మాణంలో స్లాబ్ పద్ధతి కాకుండా రాళ్లతో పేడ్చి కట్టాలని దానివల్ల 100 సంవత్సరాలైనా కట్టకు ఎటువంటి ప్రమాదం ఉండదని దీనికి ఉదాహరణ ఆదోని రాంజల్లా చెరువు అని తెలిపారు. ఎస్ ఎస్ ట్యాంక్ నిర్మాణం సందర్భంగా ఉన్న ఇంజనీర్, ప్రజాప్రతినిధి, కాంట్రాక్టర్ పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టి, కారకులపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కట్ట కుంగిపోవడంతో నీటి నిలువలు చేసుకునే అవకాశం లేదని, దీనివల్ల ఆదోని పట్టణానికి త్రాగునీటి సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా పట్టణ కార్యదర్శి డి లక్ష్మన్న, మండల కార్యదర్శి లింగన్న, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ గోపాల్, ము, పట్టణ కమిటీ సభ్యులు నాగరాజు, వీరేష్, వెంకటేష్ పాల్గొన్నారు.


News
శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్

కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.


News
16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.


News
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.


-
News2 weeks ago
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా
-
News3 weeks ago
భారీ వర్షనికి రామజల చెరువు నిండి ఇళ్లలోకి నీరు
-
News3 weeks ago
తుంగభద్ర డ్యాంకు పెరుగుతున్న వరద నీరు 27-09-2025
-
News3 weeks ago
ఆదోని డివిజన్లో కురిసిన వర్షపాతం
-
Business3 weeks ago
రోజు రోజుకు పతనమవుతున్న పత్తి ధర..
-
Business4 weeks ago
Gold, Silver Price బంగారు ధర
-
Business4 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు
-
Business4 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు