News
మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరచడమే లక్ష్యం
కర్నూలు జిల్లా ఆదోని లో బుధవారం టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో మెప్మా సిటీ మిషన్ మేనేజర్ షమీనా, మెప్మా ఆఫీసర్ వీరారెడ్డి అధ్యక్షతన అర్బన్ మెప్ప మార్కెట్ను ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదోని అర్బన్ లో సుమారుగా 3వేల పొదుపు గ్రూపులు ఉన్నాయని ప్రతి ఏడాది బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలను రూ20 కోట్లు మంజూరు అయ్యేలా లక్ష్యంగా పెట్టుకున్నాము అన్నారు. ప్రతి పొదుపు మహిళకు లక్ష నుండి 2 లక్షల రూపాయల వరకు రుణాలు అందిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి సీఎం జగన్మోహన్ రెడ్డి బాటలు వేస్తున్నారని తెలిపారు. వారు తయారు చేసిన వంటకాలు, బట్టలు, తినుబండరాలు, ఆహార పదార్థాలను, బజార్లలో విక్రయించుకునేందుకు స్టాళ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ఆదోనిలో ప్రత్యేకంగా మెప్మా బజారు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ శాంత, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కామాక్షి తిమ్మప్ప, మెప్మా సి ఓ లు అరుణ, కృష్ణవేణి, ఇదృష్ ఆర్పీలు పాల్గొన్నారు.


News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




