News
పాండవగల్ గ్రామంలో 2వ వార్డ్ కు సిపిఎం ఏకగ్రీవంగా ఎన్నిక

ఆదోని మండలం పాండవగల్ గ్రామంలో గత 2021 ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థిగా 2వ వార్డుకు పోటీచేసి, తుంబలం మూకయ్య గెలుపొందారు. 2022 నవంబర్లో ఆయన అనారోగ్యంతో మృతి చెందారు.
2వ వార్డుకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. సిపిఎం తరపున తుంబలం ముకయ్య 2వ కుమారుడు తుంబలం వెంకటేశ్వర్లు
నామినేషన్లు దాఖలు చేశారు.
వారి నాయన మరణాంతరం జరుగుతున్న ఎన్నికలు కావడంతో వైసిపి టిడిపి జనసేన పార్టీలు అభ్యర్థులను నిలబెట్టకుండా తుంబలం వెంకటేశ్వర్లు కు మద్దతు ఇస్తామని చెప్పడంతో 2వ వార్డుకు వార్డు మెంబర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
2వ వార్డు ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థి తుంబలం వెంకటేశ్వర్లు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే.వెంకటేశ్వర్లు, సిపిఎం పార్టీ మండల నాయకులు రామాంజనేయులు, శాఖ కార్యదర్శులు పాండురంగ, అనిఫ్, గోవిందు వార్డు సభ్యులు కృష్ణ, స్థానిక కార్యకర్తలు హుసేని, మల్లి మాట్లాడుతూ రెండో వార్డును ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సహకరించిన వైసిపి టిడిపి జనసేన పార్టీల నాయకులు మరియు పాండవగల్ గ్రామ 2 వ వార్డు ఓటర్లకు, ప్రజలకు సిపిఎం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిపారు.

News
శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్

కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.


News
16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.


News
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.


-
News2 weeks ago
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా
-
News3 weeks ago
భారీ వర్షనికి రామజల చెరువు నిండి ఇళ్లలోకి నీరు
-
News3 weeks ago
తుంగభద్ర డ్యాంకు పెరుగుతున్న వరద నీరు 27-09-2025
-
News3 weeks ago
ఆదోని డివిజన్లో కురిసిన వర్షపాతం
-
Business3 weeks ago
రోజు రోజుకు పతనమవుతున్న పత్తి ధర..
-
Business4 weeks ago
Gold, Silver Price బంగారు ధర
-
Business4 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు
-
Business4 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు