News
జన జాగరణ కార్యక్రమం జయప్రదం చేయండి
◆ ఆగస్టు 14వ తేదీన దేశవ్యాప్తంగా జన జాగరణ కార్యక్రమం..
◆ బడా కార్పొరేటర్లకు కొమ్ముకాస్తున్న బిజెపి ప్రభుత్వం..
◆ మతతత్వ విధానాల ద్వారా ప్రజల్ని చీల్చి దేశాన్ని అధోగతి పాలు.. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కే వెంకటేశులు
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతులను కూలీలను కార్మికులను విస్మరించి బడా కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ, తన మతతత్వ విధానాల ద్వారా అన్ని వర్గాల ప్రజల్ని చీల్చి దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నదని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కే వెంకటేశులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే లింగన్న తెలిపారు.
కర్నూలు జిల్లా ఆదోని సుందరయ్య భవన్లో శుక్రవారం మూడు సంఘాల సంయుక్త సమావేశం సిఐటియు మండల కార్యదర్శి బి వీరారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కే వెంకటేశులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే లింగన్న మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బడా కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ, మతతత్వ విధానాల ద్వారా అన్ని వర్గాల ప్రజల్ని చీల్చి దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా రైతు సంఘం, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆగస్టు 14వ తేదీన దేశవ్యాప్తంగా జన జాగరణ కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్నట్లు తెలిపారు. జన జాగరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో రైతు సంఘం మండల కార్యదర్శి అయ్యప్ప, సిఐటియు మండల అధ్యక్షులు జే. రామాంజనేయులు, రైతు సంఘం మండల నాయకులు భాష, కౌలు రైతు సంఘం మండల కార్యదర్శి దస్తగిరి బాషా, ఆటో వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి వీరేష్, కెవిపిఎస్ మండల నాయకులు పరమేష్, సిఐటియు నాయకులు ఉరుకుందు, ఏలియా తదితరులు పాల్గొన్నారు.
News
ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
ఎమ్మిగనూరు, మే 13:
లైసెన్స్ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..
ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. — సోమన్న, ఏసీబీ డీఎస్పీ
