News
వీధి దీపాలు వెలిగించాలని క్యాండిల్స్ తో నిరసన
ఆదోని పట్టణంలో భీమ్ రెడ్డి కాలనీలో వీధిలైట్లు వేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్ వెలిగించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న మాట్లాడుతూ భీమ్ రెడ్డి కాలనీ నందు వీధిలైట్లు వేయాలని కాలనీవాసులు సంబంధిత అధికారులకు తెలిపిన చెవిటి వాడి ముందు శంఖం ఉదినట్లు చందంగా ఉందని అన్నారు. కాలనీలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో సంబందిత అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు తెలిపారు. కాలనీ నందు వీధిలైట్లు వెలగకపోవడంతో రాత్రి వేళలో ప్రజలు చిన్నపిల్లలు బయటకు రాని పరిస్థితి ఉంది అని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో ముళ్ళపోదలు ఎక్కువగా ఉన్నాయని విష పురుగులు కరిచే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలిపారు. కాలనీలో విద్యుత్ స్తంభాలు కేవలం అలంకారప్రాయంగా ఉన్నాయి తప్ప వాటికి వీధిలైట్లు లేవని వారు తెలిపారు. ఇప్పటికైనా సంబంధం అధికారులు వెంటనే స్పందించి భీమ్ రెడ్డి కాలనీలో వీధిలైట్లు వెయ్యాలని వారు కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్, తిప్పాన్న, ముక్కన్న, పట్టణ నాయకులు కృష్ణమూర్తి, నాగరాజు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.

News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




