News
పేదల సంక్షేమం కోసమే జగనన్న సురక్ష కార్యక్రమం
జులై 1వ తేదీ నుండి 25వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాలలో జగనన్న సురక్ష కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించేందుకు సంకల్పించిన గొప్ప కార్యక్రమమని ఆదోని టౌన్ 2కన్వీనర్ వెల్లాల మధుసూదన శర్మ అన్నారు.
కర్నూలు జిల్లా ఆదోని 11, 20, 26, 27, మున్సిపల్ వార్డులలో, చైర్మన్ బోయ శాంతమ్మ, కౌన్సిలర్ వాసీం, వార్డు ఇంచార్జులు,మధు, హాజీబాష అధ్యక్షతన జగనన్న సురక్ష కార్యమముపైన వార్డు కన్వీనర్లకు, వాలెంటీర్స్, మరియు గృహసారధులకు అవగాహన సదస్సు నిర్వహించరు. కార్యక్రమములో టౌన్ కన్వీనర్ వెల్లాల మధుసూదన శర్మ మాట్లాడుతూ జూలై 1నుండి 25వరకు ప్రభుత్వం తలపెట్టిన జగనన్న సురక్ష కార్యక్రమములో అందరు పాల్గొని ప్రతి ఇంటికి వెళ్ళి జగనన్న సురక్ష కార్యక్రమము గురించి వివరంగా చెప్పి అర్హులై ఉండి సంక్షేమ పథకాలు ఎవరికైతే అందడంలేదో తెలుసుకుని వారి నుండి పథకానికి అవసరమైన పత్రాలు తీసుకుని సచివాలయ సిబ్బందికి అందచేసి, సచివాలయంవారు ఇచ్చే టోకెన్ నెంబర్ లబ్దిదారులకు తెలియచేసి ప్రభుత్వం నిర్ణయించిన తేదీలలో మన సచివాలయములో ఉన్నతాధికారులతో నిర్వహించే జగనన్న సురక్ష కార్యక్రమానికి లబ్దిదారులను పిలుచుకుని వచ్ఛి ఉన్నతాధికారులతో తగిన సర్టిఫికెట్ ఇప్పించడమే కాకుండా,ఆ సర్టిఫికెట్ ద్వారా లబ్దిదారులకు రావలసిన పథకానికి అప్లై చేయించి ప్రతి పేద లబ్దిదారుడికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాడానికి చూడాలని నియోజకవర్గ అభివృద్ధికి కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకులు ఆదోని ఎమ్మెల్యే వై సాయిప్రసాద్ రెడ్డి, మరియు వైఎస్సార్ పార్టీ యువనేత వై జయమనోజ్ రెడ్డి కి మనవంతు సహాయ సహకారాలు అందించి రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డిని గెలుపు సహకరించాలని మధుసూదన శర్మ నాయకులను, గృహసారధులను, మరియు హాజరైన నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో వాలెంటీర్స్ టౌన్ ఇంచార్జులు అమిత్, సందీప్, నాయకులు బోయ నాగేంద్ర, మహబూబ్ బాషా, నూరుబాష,షాహిన, మారుతి, వెంకటేష్,దుర్గేష్ మొదలైన వారు పాల్గొన్నారు.


News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




