Connect with us

News

పేదల సంక్షేమం కోసమే జగనన్న సురక్ష కార్యక్రమం

Published

on

జులై 1వ తేదీ నుండి 25వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాలలో జగనన్న సురక్ష కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించేందుకు సంకల్పించిన గొప్ప కార్యక్రమమని ఆదోని టౌన్ 2కన్వీనర్ వెల్లాల మధుసూదన శర్మ అన్నారు.
కర్నూలు జిల్లా ఆదోని 11, 20, 26, 27, మున్సిపల్ వార్డులలో, చైర్మన్ బోయ శాంతమ్మ, కౌన్సిలర్ వాసీం, వార్డు ఇంచార్జులు,మధు, హాజీబాష అధ్యక్షతన జగనన్న సురక్ష కార్యమముపైన వార్డు కన్వీనర్లకు, వాలెంటీర్స్, మరియు గృహసారధులకు అవగాహన సదస్సు నిర్వహించరు. కార్యక్రమములో టౌన్ కన్వీనర్ వెల్లాల మధుసూదన శర్మ మాట్లాడుతూ జూలై 1నుండి 25వరకు ప్రభుత్వం తలపెట్టిన జగనన్న సురక్ష కార్యక్రమములో అందరు పాల్గొని ప్రతి ఇంటికి వెళ్ళి జగనన్న సురక్ష కార్యక్రమము గురించి వివరంగా చెప్పి అర్హులై ఉండి సంక్షేమ పథకాలు ఎవరికైతే అందడంలేదో తెలుసుకుని వారి నుండి పథకానికి అవసరమైన పత్రాలు తీసుకుని సచివాలయ సిబ్బందికి అందచేసి, సచివాలయంవారు ఇచ్చే టోకెన్ నెంబర్ లబ్దిదారులకు తెలియచేసి ప్రభుత్వం నిర్ణయించిన తేదీలలో మన సచివాలయములో ఉన్నతాధికారులతో నిర్వహించే జగనన్న సురక్ష కార్యక్రమానికి లబ్దిదారులను పిలుచుకుని వచ్ఛి ఉన్నతాధికారులతో తగిన సర్టిఫికెట్ ఇప్పించడమే కాకుండా,ఆ సర్టిఫికెట్ ద్వారా లబ్దిదారులకు రావలసిన పథకానికి అప్లై చేయించి ప్రతి పేద లబ్దిదారుడికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాడానికి చూడాలని నియోజకవర్గ అభివృద్ధికి కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకులు ఆదోని ఎమ్మెల్యే వై సాయిప్రసాద్ రెడ్డి, మరియు వైఎస్సార్ పార్టీ యువనేత వై జయమనోజ్ రెడ్డి కి మనవంతు సహాయ సహకారాలు అందించి రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డిని గెలుపు సహకరించాలని మధుసూదన శర్మ నాయకులను, గృహసారధులను, మరియు హాజరైన నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో వాలెంటీర్స్ టౌన్ ఇంచార్జులు అమిత్, సందీప్, నాయకులు బోయ నాగేంద్ర, మహబూబ్ బాషా, నూరుబాష,షాహిన, మారుతి, వెంకటేష్,దుర్గేష్ మొదలైన వారు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న వెల్లాల మధుసూదన శర్మ
సమావేశంలో పాల్గొన్న సచివాలయ సిబ్బంది
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్‌లు స్వాధీనం

Published

on

కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు  ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

Continue Reading

News

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

మృతదేహాన్ని తరలిస్తున్న ఫోటో
Continue Reading

News

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!

Published

on

ఎమ్మిగనూరు, మే 13:

లైసెన్స్‌ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..

ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. సోమన్న, ఏసీబీ డీఎస్పీ

Continue Reading
News1 week ago

ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్‌లు స్వాధీనం

News2 weeks ago

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

News4 weeks ago

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!

News1 month ago

రైతులు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై పొందవచ్చు: ఆదోని మండల వ్యవసాయ అధికారి

News1 month ago

రైతులు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై పొందవచ్చు: ఆదోని మండల వ్యవసాయ అధికారి

News1 month ago

భార్యను పంపడం లేదని సెల్ టవర్ ఎక్కిన భర్త

News2 months ago

క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే పీడీ యాక్ట్: ఆదోని వన్ టౌన్ సీఐ హెచ్చరిక

News2 months ago

పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులకు తీవ్ర గాయాలు

News2 months ago

ఆస్తి కోసం తండ్రి పై కత్తి తో దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

News3 months ago

ఆదోనిలో గ్యాస్ దాడులు 107 సిలిండర్లు సీజ్

Trending