Connect with us

News

పేదల సంక్షేమం కోసమే జగనన్న సురక్ష కార్యక్రమం

Published

on

జులై 1వ తేదీ నుండి 25వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాలలో జగనన్న సురక్ష కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించేందుకు సంకల్పించిన గొప్ప కార్యక్రమమని ఆదోని టౌన్ 2కన్వీనర్ వెల్లాల మధుసూదన శర్మ అన్నారు.
కర్నూలు జిల్లా ఆదోని 11, 20, 26, 27, మున్సిపల్ వార్డులలో, చైర్మన్ బోయ శాంతమ్మ, కౌన్సిలర్ వాసీం, వార్డు ఇంచార్జులు,మధు, హాజీబాష అధ్యక్షతన జగనన్న సురక్ష కార్యమముపైన వార్డు కన్వీనర్లకు, వాలెంటీర్స్, మరియు గృహసారధులకు అవగాహన సదస్సు నిర్వహించరు. కార్యక్రమములో టౌన్ కన్వీనర్ వెల్లాల మధుసూదన శర్మ మాట్లాడుతూ జూలై 1నుండి 25వరకు ప్రభుత్వం తలపెట్టిన జగనన్న సురక్ష కార్యక్రమములో అందరు పాల్గొని ప్రతి ఇంటికి వెళ్ళి జగనన్న సురక్ష కార్యక్రమము గురించి వివరంగా చెప్పి అర్హులై ఉండి సంక్షేమ పథకాలు ఎవరికైతే అందడంలేదో తెలుసుకుని వారి నుండి పథకానికి అవసరమైన పత్రాలు తీసుకుని సచివాలయ సిబ్బందికి అందచేసి, సచివాలయంవారు ఇచ్చే టోకెన్ నెంబర్ లబ్దిదారులకు తెలియచేసి ప్రభుత్వం నిర్ణయించిన తేదీలలో మన సచివాలయములో ఉన్నతాధికారులతో నిర్వహించే జగనన్న సురక్ష కార్యక్రమానికి లబ్దిదారులను పిలుచుకుని వచ్ఛి ఉన్నతాధికారులతో తగిన సర్టిఫికెట్ ఇప్పించడమే కాకుండా,ఆ సర్టిఫికెట్ ద్వారా లబ్దిదారులకు రావలసిన పథకానికి అప్లై చేయించి ప్రతి పేద లబ్దిదారుడికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాడానికి చూడాలని నియోజకవర్గ అభివృద్ధికి కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకులు ఆదోని ఎమ్మెల్యే వై సాయిప్రసాద్ రెడ్డి, మరియు వైఎస్సార్ పార్టీ యువనేత వై జయమనోజ్ రెడ్డి కి మనవంతు సహాయ సహకారాలు అందించి రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డిని గెలుపు సహకరించాలని మధుసూదన శర్మ నాయకులను, గృహసారధులను, మరియు హాజరైన నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో వాలెంటీర్స్ టౌన్ ఇంచార్జులు అమిత్, సందీప్, నాయకులు బోయ నాగేంద్ర, మహబూబ్ బాషా, నూరుబాష,షాహిన, మారుతి, వెంకటేష్,దుర్గేష్ మొదలైన వారు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న వెల్లాల మధుసూదన శర్మ
సమావేశంలో పాల్గొన్న సచివాలయ సిబ్బంది
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్

Published

on

కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్‌మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.

పరీక్షలు నిర్వహిస్తున్న మున్సిపల్ అధికారులు
సంతకం చేస్తున్న కౌన్సిలర్ ఫయాజ్
Continue Reading

News

16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.

పూర్తయిన కాలువలు
పూర్తి చేసిన రోడ్డు పనులు
Continue Reading

News

శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా

Published

on

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో  ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు  బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.

అదుపుతప్పి బోల్తా పడిన బస్సు
అదుపుతప్పి బోల్తా పడిన బస్సు
Continue Reading

Trending