News
పెంచిన కరెంటు చార్జీలు తగ్గించాలి. సిపిఎం..
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కస్టమర్ చార్జీలు, ట్రూ అప్ చార్జీలు, సర్చార్జీలు, విద్యుత్ సుంకం పేరుతో దాదాపు ఏడు రకాలుగా దొడ్డిదారిన కరెంటు చార్జీలు వసూలు చేస్తుందని, కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీన్ని విరమించుకొని కరెంటు చార్జీలు తగ్గించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవుగల్ గ్రామంలో ప్రజలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి కే లింగన్న మాట్లాడుతూ ఒక్కో ఇంటికి కనీసం 200 నుండి 500 రూపాయలు వరకు కరెంటు బిల్లు వచ్చిందని ఇదే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తే వచ్చే నెలలో కరెంట్ బిల్లులు కట్టేది లేదని తెగేసి చెప్పారు. అలాగే 2000 సంవత్సరంలో జరిగిన విద్యుత్ పోరాటం తరహాలోని మరో పోరాటానికి సిపిఎం పార్టీ సిద్ధమవుతుందని ఆయన హెచ్చరించారు. ఈ మధ్యనే వామపక్షాల ఆధ్వర్యంలో ఒక సదస్సు జరిగిందని, 10 వామపక్ష పార్టీలు కలిసి జూన్ 30వ తేదీన పెద్ద ఎత్తున విద్యుత్తు కార్యాలయాల దగ్గర ఆందోళన పిలిపిచ్చారు. ఈ కరెంటు చార్జీల భారాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ మరియు వామపక్షాలు నిర్వహించే పోరాటంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి కే పాండురంగ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




