News
2000 నోట్లు వెనక్కి

■ 2000 నోట్లపై ఆర్బిఐ కీలక నిర్ణయం
■ 2016 నుంచి చలామణిలో ఉన్న 2000 నోట్లు..
■ 2018 లోనే నిలిచిపోయిన 2000 నోట్ల ముద్రణ..
■ 2023 మార్చి 30 నాటికి మార్కెట్లో 3.62 లక్షల కోట్ల విలువైన 2000 నోట్ల చలామణి..
■ 2000 నోట్లు వెనక్కి తీసుకోవాలని నిర్ణయం..
■ మే 23 నుంచి 2000 నోట్లు మార్చుకుని అవకాశం..
■ సెప్టెంబర్ 30వ తేదీ లోపు బ్యాంకులో మార్చుకోవచ్చు
■ రోజుకి ఒక విడతలో 20000 మార్చుకునే అవకాశం..
■2000 నోట్లన్నీ బ్యాంకుల్లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు..
■ బ్యాంకులతోపాటు 19 ఆర్బిఐ రిజనల్ బ్యాంకుల్లో మార్చుకోవచ్చు..


బ్రేకింగ్ న్యూస్ 2000 రూపాయలు నోట్లను ఉపసంహరించుకున్న ఆర్బిఐ . చలామణిలో ఉంచొద్దని బ్యాంకులకు సూచన. ఈనెల 23 నుంచి సెప్టెంబర్ 30 వ తారీకు లోపు మార్చుకోవాలని ప్రజలకు తెలియజేసిన ఆర్బిఐ
2,000 నోటును చలామణి నుంచి ఉపసంహరించుకోవాలని ఆర్బీఐ నిర్ణయించింది
మే 19, 2023 07:01 pm | నవీకరించబడింది 07:10 pm IST – న్యూఢిల్లీ
₹2,000 నోట్లు చట్టబద్ధంగా కొనసాగుతాయి
మే 23 నుండి ఒకేసారి ₹20,000 వరకు మార్పిడి సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
- మార్చుకోగల ₹2000 నోట్ల మొత్తానికి కార్యాచరణ పరిమితి ఉందా?
పబ్లిక్ సభ్యులు రూ.2000 నోట్లను ఒకేసారి రూ.20,000/- వరకు మార్చుకోవచ్చు. - ₹2000 నోట్లను బిజినెస్ కరస్పాండెంట్ల (BCలు) ద్వారా మార్చుకోవచ్చా?
అవును, ఖాతాదారునికి రోజుకు ₹4000/- పరిమితి వరకు BCల ద్వారా ₹2000 నోట్ల మార్పిడిని చేయవచ్చు. - మార్పిడి సౌకర్యం ఏ తేదీ నుండి అందుబాటులో ఉంటుంది?
సన్నాహక ఏర్పాట్లను చేయడానికి బ్యాంకులకు సమయం ఇవ్వడానికి, ప్రజలు మార్పిడి సౌకర్యాన్ని పొందడం కోసం మే 23, 2023 నుండి RBI యొక్క బ్యాంకు శాఖలు లేదా ROలను సంప్రదించవలసిందిగా అభ్యర్థించబడింది. - బ్యాంక్ బ్రాంచ్ల నుండి ₹2000 నోట్లను మార్చుకోవడానికి ఖాతాదారుడిగా ఉండటం అవసరమా?
సంఖ్య. ఖాతా లేని వ్యక్తి కూడా ఏదైనా బ్యాంక్ బ్రాంచ్లో ఒకేసారి ₹20,000/- పరిమితి వరకు ₹2000 నోట్లను మార్చుకోవచ్చు. - వ్యాపారం లేదా ఇతర ప్రయోజనాల కోసం ఎవరికైనా ₹20,000/- కంటే ఎక్కువ నగదు అవసరమైతే?
పరిమితులు లేకుండా ఖాతాల్లో డిపాజిట్ చేయవచ్చు. ₹2000 నోట్లను బ్యాంక్ ఖాతాల్లో జమ చేయవచ్చు మరియు ఈ డిపాజిట్లకు వ్యతిరేకంగా నగదు అవసరాలు డ్రా చేసుకోవచ్చు. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్కతా, లక్నో, ముంబై, నాగ్పూర్, న్యూఢిల్లీ, పాట్నా మరియు తిరువనంతపురం. - మార్పిడి సౌకర్యం కోసం ఏదైనా రుసుము చెల్లించాలా? సంఖ్య. మార్పిడి సౌకర్యం ఉచితంగా అందించబడుతుంది.
- సీనియర్ సిటిజన్లు, వికలాంగులు మొదలైన వారికి మార్పిడి మరియు డిపాజిట్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయా?
₹2000 నోట్లను మార్చుకోవడానికి/జమ చేయాలని కోరుకునే సీనియర్ సిటిజన్లు, వికలాంగులు మొదలైన వారికి అసౌకర్యాన్ని తగ్గించేందుకు ఏర్పాట్లు చేయాలని బ్యాంకులకు సూచించబడింది. - వెంటనే ₹2000 నోటును డిపాజిట్ చేయలేకపోతే / మార్చుకోలేకపోతే ఏమి జరుగుతుంది?
మొత్తం ప్రక్రియను సాఫీగా మరియు ప్రజలకు సౌకర్యవంతంగా చేయడానికి, ₹2000 నోట్లను డిపాజిట్ చేయడానికి మరియు/లేదా మార్చుకోవడానికి నాలుగు నెలలకు పైగా సమయం ఇవ్వబడింది. కావున, ప్రజాప్రతినిధులు, నిర్ణీత సమయంలో వారి సౌలభ్యం మేరకు ఈ సదుపాయాన్ని పొందేందుకు ప్రోత్సహించబడ్డారు. - ఒక బ్యాంకు ₹2000 నోటును మార్చుకోవడానికి / డిపాజిట్ని అంగీకరించడానికి నిరాకరిస్తే ఏమి జరుగుతుంది?
సర్వీస్లో లోపం ఉన్నట్లయితే ఫిర్యాదుల పరిష్కారం కోసం, ఫిర్యాదుదారు/బాధిత కస్టమర్ ముందుగా సంబంధిత బ్యాంకును సంప్రదించవచ్చు. ఫిర్యాదు చేసిన తర్వాత 30 రోజుల వ్యవధిలో బ్యాంకు స్పందించకుంటే లేదా బ్యాంక్ ఇచ్చిన స్పందన/రిజల్యూషన్తో ఫిర్యాదుదారు సంతృప్తి చెందకపోతే, రిజర్వ్ బ్యాంక్ – ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీమ్ (RB) కింద ఫిర్యాదుదారు ఫిర్యాదు చేయవచ్చు. -IOS), RBI ( cms.rbi.org.in )
News
స్విమ్మింగ్ పూల్ నీటిలో మునిగి బాలుడు మృతి

కర్నూలు జిల్లా ఆదోని ఈడెన్ గార్డెన్ స్విమ్మింగ్ పూల్ నీటిలో మునిగి ప్రిన్స్ (5) అనే బాలుడు మృతి చెందడం. తల్లి, తండ్రుల వెంట స్విమ్మింగ్ చేయడానికి వెళ్లిన ప్రిన్స్ అనే బాలుడు చిన్న పూల్ ల్ నుండి పెద్ద పూల్ లోనికి వెళ్లిన తల్లి తండ్రులు గమనించక పోవడంతో నీటిలో మునిగిన బాలుడు ఈత కొడుతూ నీటిలో మునిగి మృతి చెందడం. బాలుడి మృతదేహం ఈతగాళ్ల కాళ్లకు తగలడంతో బాలుడి మృతదేహాన్ని ఈతగాళ్లు బయటకు తీసుకొచ్చారు. వెంటనే ఆదోని ప్రభుత్వ ఆసుపత్రి ఇతర్లించారు డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించడంతో తల్లిదండ్రులు బంధువులు శోక సముద్రంలో మునిగిపోయారు.

News
కర్నూల్ రేంజ్ ఏసిబి డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన డిఎస్పి సోమన్న

కర్నూలు జిల్లా: కర్నూల్ రేంజ్, ఉమ్మడి కర్నూల్ మరియు నంద్యాల జిల్లాల ఎసిబి నూతన డిఎస్పీగా దివిటి సోమన్న 30 04 2025 వతేది బాధ్యతలు స్వీకరించరు. ఎసిబి డిఎస్పీ సోమన్న
ఎసిబి సిబ్బందిచే గౌరవవందనం స్వీకరించారు. శ్దివిటి సోమన్న స్వగ్రామం వేపకుంట గ్రామం, కనగానపల్లి మండలం, అనంతపురం జిల్లా. 1991 లో ఎస్ఐ హోదాలో పోలీసు డిపార్ట్మెంట్ లో విధుల్లో నిర్వహించారు.
ఎస్ఐ గా క్రిష్ణగిరి, సంజామల, నందవరం, వెల్దుర్తి, పిటిసి అనంతపురం నందు ప్రమోషన్ పొందిన తరువాత సిఐ గా సిఐడిలో, ప్యాపిలి, ఆదోని తాలూకా, లక్కిరెడ్డిపల్లిలో పని చేసినారు. 2020 లో డిఎస్పిగా పదోన్నతి పొంది సిఐడి శాఖలో మరియు ఆదోని సబ్ డివిజన్ లో పని చేశారు.
News
కొవ్వొత్తులు వెలిగించి ముస్లిం జేఏసి నాయకులు సంతాపం

పెహెల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన సామాన్య ప్రజల ఆత్మకు శాంతి కలగాలని
కర్నూలు జిల్లా ఆదోని భీమాస్ సర్కిల్లో కొవ్వొత్తులు వెలిగించి ముస్లిం జేఏసి నాయకులు సంతాపం ప్రకటించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించరు. కన్వీనర్ నూర్ అహ్మద్ మాట్లాడుతూ శత్రువులను కూడా క్షమించడమే మహమ్మద్ ప్రవక్త బోధన దానికి విరుద్ధంగా ఉగ్రవాదులు తాము ముస్లింలను చెప్పుకుంటూ సామాన్యులను చంపడం ఇస్లాంకు విరుద్ధమైన చర్య.దీన్ని ప్రతి ముస్లిం ఖండిస్తున్నారు అన్నారు. ఉగ్రవాదులను వెంటనే అరెస్ట్ చేసి ఎర్రకోట ముందు బహిరంగంగా భారతదేశ ప్రజలందరూ చూస్తుండగా తలలు నరికి వేయాలని నూర్ అహ్మద్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా వారికి ఆదోని ముస్లిం జేఏసి అండగా నిలబడుతుందని మద్ధతు ప్రకటించారు. మతసామరస్యం, దేశసమగ్రత కోసం ఆదోని ముస్లిం జేఏసీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.
నాయకులు మహ్మద్ నూర్, సద్దాం హుస్సేన్, మన్సూర్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఉగ్రవాదు దాడులు జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలని అదేవిధంగా నిందితులను కఠినాతి కఠినంగా బహిరంగ శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సంతాప సభలో వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, సేవా సంఘాల నాయకులు కన్వీనర్ నూర్ అహ్మద్, కో కన్వీనర్ మహమ్మద్ నూర్ ,నాయకులు లాయర్ సద్దాం హుస్సేన్, వసీం సాహెబ్, అర్షద్, మన్సూర్ , ఇస్మాయిల్, కౌన్సిలర్ హాజీ, ఫారుఖ్, జీలాన్, షకీల్ మరియు ముస్లిం యువత పాల్గొన్నారు.
-
News2 weeks ago
అదోనిలో 60 లక్షల బంగారు స్వాధీనం
-
News3 weeks ago
భారీ అగ్ని ప్రమాదం లక్షల్లో ఆస్తి నష్టం
-
News2 weeks ago
అదోనిలో వక్ఫ్ బిల్లుకు వ్యతి రేకంగా భారీ ర్యాలీ
-
News3 weeks ago
అంతర్జాతీయ దొంగల ముఠా అరెస్ట్
-
News2 weeks ago
పరీక్ష వ్రాయటానికి యజ్ఞోపవీతాన్ని అవమానించరు.. బ్రాహ్మణ, పురోహిత సంఘం
-
News2 weeks ago
కొవ్వొత్తులు వెలిగించి ముస్లిం జేఏసి నాయకులు సంతాపం
-
Business3 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
News1 week ago
కర్నూల్ రేంజ్ ఏసిబి డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన డిఎస్పి సోమన్న