News
హైవే రోడ్ లో బైఠాయించి నిరసన.. అడ్డుకున్న పోలీసులు
కర్నూలు జిల్లా ఆదోని మెడికల్ కాలేజ్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మెడికల్ కాలేజ్ ప్రవెటీకరణను వ్యతిరేకిస్తు పి డి ఎస్ యు విద్యార్థి సంఘాలు హైవే రోడ్ పై బైఠాయించి రాస్తారోకో చేస్తున్న నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నరు. పోలీసులకు విద్యార్థి సంఘాల నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మెడికల్ కాలేజ్ పై కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పి పి పి పద్ధతిని రద్దు చేయాలి, వెంటనే కాలేజ్ పనులు పూర్తిచేసి తరగతులు ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా పి డి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు కే భాస్కర్ మాట్లాడుతూ…
చంద్రబాబు 30 ఏళ్లుగా సీఎం గా ఉన్న ఇంతవరకు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకొని రాలేదు అన్నారు. కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిదురిస్తూ ఇస్తున్న 40%తో మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేLయలేక పోతుందని ఇది చేతకానితనానికి నిదర్శనమై అన్నారు. కార్పొరేటర్లకు బూడిదం చేస్తున్నార ఆని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం కార్పొరేట్ మెడికల్ మాఫియాకు అండగా మారిందని.. విద్యను నాశనం చేస్తున్న నారా లోకేష్ ను భర్తరాఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజ్ అమ్ముకొని దండుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారని చలనం లేకుండా ఉన్నాడని తెలిపారు. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఆపకపోతే సీఎం ఇల్లు మరియు అసెంబ్లీని ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

పి డి ఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ మాట్లాడుతూ..
ప్రైవేటీకరణ ఆపకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కుటుంబ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


News
ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
ఎమ్మిగనూరు, మే 13:
లైసెన్స్ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..
ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. — సోమన్న, ఏసీబీ డీఎస్పీ
-
News3 weeks agoలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
-
News5 days agoరోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
-
News3 weeks agoరైతులు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై పొందవచ్చు: ఆదోని మండల వ్యవసాయ అధికారి
-
News3 weeks agoరైతులు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై పొందవచ్చు: ఆదోని మండల వ్యవసాయ అధికారి
-
News3 days agoఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్లు స్వాధీనం
