News
రేషన్ బియ్యం కోసం సచివాలయం ముందు ధర్నా
కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలో సిపిఎం నాయకులు రేషన్ బియ్యం కోసం సచివాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం వెల్ఫేర్ అసిస్టెంట్కు వినతిపత్రం అందజేశారు. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే లింగన్న మాట్లాడుతూ పెద్ద తులం గ్రామంలో ఒకటి రెండు వార్డులలో రేషన్ బియ్యం గత 15 సంవత్సరాల నుండి సరఫరా చేస్తున్నారని, కానీ ఈ మధ్యనే 1-2 వార్డులలో కాకుండా డీలర్ తన సొంత ఇల్లు ఉన్న దొడ్డిగేరి ప్రాంతంలో రేషన్ బియ్యం సరఫరా చేయడం వలన ఈ ఒకటి, రెండు వార్డులలో నివసించే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని కావున ప్రభుత్వం ఒకటి, రెండు వార్డులలోనే ప్రభుత్వ రేషన్ బియ్యం దుకాణం ఏర్పాటు చేయాలని సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్కు కోరినట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఒకటి రెండు వార్డులలోనే రేషన్ బియ్యం దుకాణం కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సభ్యులు కాజా, ఒకటి, రెండు వార్డులలో నివాసం ఉంటున్న ప్రజలు పాల్గొన్నారు.
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




