Connect with us

News

నీటి కుంటలో  పడి ఆరూగురు విద్యార్దులు మృతి

Published

on

ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి . నీటి కుంటలో  పడి ఆరూగురు విద్యార్దులు మృత్యు వాత పడ్డారు . దీనితో ఆ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామానికి  చెందిన ఏడు మంది విద్యార్దులు సరదాగా ఈత నేర్చుకోవడానికి జిల్లా పరిషత్ హైస్కూల్ పక్కనే ఉన్న నీటి కుంటవద్దకు వెళ్ళారు. ఈత కొట్టడానికి కుంటలోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండటం తో ప్రమాదవశాత్తు నీటి కుంటలో  మునిగిపోయారు .

భీమేష్
వినయ్
సాయికిరణ్
కిన్నెరసాయి
శశికుమార్

అటుగా  ఉన్న వెళ్తున్నా గొర్రెల కాపరీ చూసి ఒక పిల్లవాడిని  కాపాడాడు, ఒడ్డుకు చేరిన ఆ పిల్లవాడు పరుగెత్తుకుంటూ గ్రామంలోకి వెళ్ళి గ్రామస్థులకు చెప్పగా అందరు ఆ నీటి కుంటవద్దకు చేరుకొని పిల్లల కోసం గాలించగా ఆరుగురు విద్యార్థులు శవంగా తేలారు . ఆరుగురు విద్యార్థులను అందరిని నీటి కుంట నుంచి బయటికి తీశారు. అందరూ మృతి చెందారు మృతి చెందిన పిల్లలు ఒక్కరే కొడుకులు కావడంతో ఆ ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులు భాద వర్ణాతీర్దం. హై స్కూల్ పక్కన ఉన్నటువంటి కొండల్లో కొందరు ఎర్రమట్టి తవ్వకాలు తోవడంతో అక్కడ గుంతలు ఏర్పడ్డాయని మొన్న కురిసిన వర్షాలకు ఆ కుంటలో నీళ్లు చేరడంతో పిల్లలు సరదాగా ఈత నేర్చుకోవడానికి వెళ్లి ఈ ప్రమాదం చోటు చేసుకుందని  గ్రామస్తులు తెలిపారు.

News

శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్

Published

on

కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్‌మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.

పరీక్షలు నిర్వహిస్తున్న మున్సిపల్ అధికారులు
సంతకం చేస్తున్న కౌన్సిలర్ ఫయాజ్
Continue Reading

News

16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.

పూర్తయిన కాలువలు
పూర్తి చేసిన రోడ్డు పనులు
Continue Reading

News

శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా

Published

on

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో  ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు  బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.

అదుపుతప్పి బోల్తా పడిన బస్సు
అదుపుతప్పి బోల్తా పడిన బస్సు
Continue Reading

Trending