News
సంక్షేమ పథకాలు అమలు చేయడంలో టిడిపి పెట్టింది పేరు. గడ్డా ఫక్రుద్దీన్

సంక్షేమ పథకాలు అమలు చేయడంలో టిడిపి పెట్టింది పేరని టీడీపీ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి, అనంతపురం జిల్లా గుంతకల్ మైనార్టీ అబ్జర్వర్ షేక్ బాబా ఫక్రుద్దీన్ అలియాస్ గడ్డా ఫక్రుద్దీన్ ఆనందం వ్యక్తం చేశారు.
కర్నూలు జిల్లా ఆదోనిలో షేక్ బాబా ఫక్రుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ ఆనాడు అన్న ఎన్టీఆర్ కిలో రెండు రూపాయలు బియ్యంతో సంక్షేమ పథకం తో చరిత్ర సృష్టిస్తే ఈసారి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తల్లికి వందనం అనే సంక్షేమ పథకాన్ని అమలు చేసి నారా చంద్రబాబు నాయుడు చరిత్ర సృష్టించారని తెలిపారు. సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అనే సంక్షేమ పథకాన్ని అమలు చేసి చూపించారని కొనియాడారు. ఆనాడు జగన్ ప్రభుత్వం నాలుగేళ్లలో వేసినా అమ్మ ఒడి ఈరోజు కూటమి ప్రభుత్వం ఒకే సంవత్సరంలో తల్లికి వందనం వేసి తల్లుల కళ్ళల్లో ఆనందాన్ని కూటమి ప్రభుత్వం చూడగలిగింది అన్నారు. పిల్లల్ని చదివిస్తే రాష్ట్రానికి అతిపెద్ద సంపద వారేనని నమ్మి ఆచరణలో పెట్టి చూపిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే బులుగు బ్యాచ్ కూటమి ప్రభుత్వంపై విషం కక్కుతుంది, కడుపు మంటతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని 2000 రూపాయలు లోకేష్ బాబు జేబులోకి పోయాయంటూ వైసీపీ నేతలు దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గత ప్రభుత్వం వైసీపీ పాలనలో 13000 ఇచ్చారు అంటే 2000 జగన్ జేబులోకి పోయినాయా? లేదంటే తాడేపల్లి ప్యాలెస్సుకుపోయినాయని? ఈ సందర్భంగా గడ్డా ఫక్రుద్దీన్ ప్రశ్నించారు? గత ప్రభుత్వం జగన్ పాలనలో 47 లక్షల మందికి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం 67 లక్షల మందికి ఈ పథకం లబ్ధి పొందురున్నారని అయితే గత ప్రభుత్వంలో కుటుంబంలో ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు పిల్లలకి అమ్మఒడిఅమలు చేస్తానని చెప్పి కుటుంబంలో ఒక్కరికే అమ్మ ఒడి అమలు చేసి మధ్య తరగతి కుటుంబాలను మోసం చేసిన ఘనత జగన్ కి దక్కుతుందని అన్నారు. అయితే కూటమి ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధిని చూసి జగన్ మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేయడం జగన్ దిగజారుడు రాజకీయానికి నిదర్శమని ఇప్పటికైనా వైసీపీ నాయకులు ఇలాంటి తప్పుడు ఆరోపణలు మానుకోవాలని గడ్డా ఫక్రుద్దీన్ హితువు పలికారు.
News
శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్

కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.


News
16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.


News
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.


-
News2 weeks ago
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా
-
News3 weeks ago
భారీ వర్షనికి రామజల చెరువు నిండి ఇళ్లలోకి నీరు
-
News3 weeks ago
తుంగభద్ర డ్యాంకు పెరుగుతున్న వరద నీరు 27-09-2025
-
News3 weeks ago
ఆదోని డివిజన్లో కురిసిన వర్షపాతం
-
Business3 weeks ago
రోజు రోజుకు పతనమవుతున్న పత్తి ధర..
-
Business4 weeks ago
Gold, Silver Price బంగారు ధర
-
Business4 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు
-
Business3 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు