News
సంక్షేమ పథకాలు అమలు చేయడంలో టిడిపి పెట్టింది పేరు. గడ్డా ఫక్రుద్దీన్

సంక్షేమ పథకాలు అమలు చేయడంలో టిడిపి పెట్టింది పేరని టీడీపీ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి, అనంతపురం జిల్లా గుంతకల్ మైనార్టీ అబ్జర్వర్ షేక్ బాబా ఫక్రుద్దీన్ అలియాస్ గడ్డా ఫక్రుద్దీన్ ఆనందం వ్యక్తం చేశారు.
కర్నూలు జిల్లా ఆదోనిలో షేక్ బాబా ఫక్రుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ ఆనాడు అన్న ఎన్టీఆర్ కిలో రెండు రూపాయలు బియ్యంతో సంక్షేమ పథకం తో చరిత్ర సృష్టిస్తే ఈసారి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తల్లికి వందనం అనే సంక్షేమ పథకాన్ని అమలు చేసి నారా చంద్రబాబు నాయుడు చరిత్ర సృష్టించారని తెలిపారు. సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అనే సంక్షేమ పథకాన్ని అమలు చేసి చూపించారని కొనియాడారు. ఆనాడు జగన్ ప్రభుత్వం నాలుగేళ్లలో వేసినా అమ్మ ఒడి ఈరోజు కూటమి ప్రభుత్వం ఒకే సంవత్సరంలో తల్లికి వందనం వేసి తల్లుల కళ్ళల్లో ఆనందాన్ని కూటమి ప్రభుత్వం చూడగలిగింది అన్నారు. పిల్లల్ని చదివిస్తే రాష్ట్రానికి అతిపెద్ద సంపద వారేనని నమ్మి ఆచరణలో పెట్టి చూపిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే బులుగు బ్యాచ్ కూటమి ప్రభుత్వంపై విషం కక్కుతుంది, కడుపు మంటతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని 2000 రూపాయలు లోకేష్ బాబు జేబులోకి పోయాయంటూ వైసీపీ నేతలు దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గత ప్రభుత్వం వైసీపీ పాలనలో 13000 ఇచ్చారు అంటే 2000 జగన్ జేబులోకి పోయినాయా? లేదంటే తాడేపల్లి ప్యాలెస్సుకుపోయినాయని? ఈ సందర్భంగా గడ్డా ఫక్రుద్దీన్ ప్రశ్నించారు? గత ప్రభుత్వం జగన్ పాలనలో 47 లక్షల మందికి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం 67 లక్షల మందికి ఈ పథకం లబ్ధి పొందురున్నారని అయితే గత ప్రభుత్వంలో కుటుంబంలో ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు పిల్లలకి అమ్మఒడిఅమలు చేస్తానని చెప్పి కుటుంబంలో ఒక్కరికే అమ్మ ఒడి అమలు చేసి మధ్య తరగతి కుటుంబాలను మోసం చేసిన ఘనత జగన్ కి దక్కుతుందని అన్నారు. అయితే కూటమి ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధిని చూసి జగన్ మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేయడం జగన్ దిగజారుడు రాజకీయానికి నిదర్శమని ఇప్పటికైనా వైసీపీ నాయకులు ఇలాంటి తప్పుడు ఆరోపణలు మానుకోవాలని గడ్డా ఫక్రుద్దీన్ హితువు పలికారు.
News
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 17 06 25:
రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయలు


News
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 16 06 25:
రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 23/- రూపాయలు, రిటైల్: 1kg 25/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయలు


News
ఆదోని నూతన తహసిల్దార్ రమేష్ బాధ్యతలు

కర్నూలు జిల్లా ఆదోని నూతన తహసిల్దార్ ఎం. ఏ రమేష్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు పూల మొక్క అందజేసి మర్యాదపూర్వకంగా ఆదోని నూతన తహసిల్దార్ ఎం. ఏ రమేష్ కలిశారు.
-
News2 weeks ago
ఎరువుల అక్రమ రవాణా పై ఉక్కు పాదం
-
News3 weeks ago
కౌతాళం మండలం లో దారుణం
-
News2 weeks ago
క్రికెట్ బెట్టింగ్ లో 91 లక్షల నగదు స్వాధీనం
-
News4 weeks ago
ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్గా లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నిక
-
News2 weeks ago
ఫిట్నెస్ లేని స్కూల్ బస్సుల యాజమాన్యం పై చర్యలు తీసుకోండి
-
News2 weeks ago
రైతులకు రాయితీ వేరుశనగ పంపిణీ
-
News2 weeks ago
వెన్నుపోటు దినం పోస్టర్ విడుదల చేసిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి
-
News2 weeks ago
మెడికల్ కళాశాల పనులు ప్రారంభించాలి