News
భారీ అగ్ని ప్రమాదం లక్షల్లో ఆస్తి నష్టం

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుంబలం గ్రామంలో హజరత్ కిరాణా షాపులో విద్యుత్ షాట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షాపులోని కిరాణ సరుకులు , 50 వేలు రూపాయల నగదు కాలి బూడిదైనయి. లక్షలో ఆస్తి నష్టం ఉంటుందని అంచనా..


News
వెన్నుపోటు దినం పోస్టర్ విడుదల చేసిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి

కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో వెన్నుపోటు దినం పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. మరియు పార్టీ నాయకులు పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నాల్గవ తేదీ కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతులు, యువత నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ప్రజలు చంద్రబాబుకు పాలన ఇచ్చింది తమకు మేలు జరుగుతుందని ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని గెలిపిస్తే ఈ ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రెడ్ బుక్ పాలన చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు చేయకుండా ముఖ్య నాయకుల పై సోషల్ మీడియా పై కేసులు పెడుతూ పరిపాలన సాగిస్తున్నారని అందువల్ల ఇప్పటినుంచి పోరాటాలు చేయకపోతే చాలా అరాచకాలు జరుగుతాయని తెలిపారు. ఈ ప్రభుత్వం అమరావతికి మాత్రమే అభివృద్ధికి కృషి చేస్తుంది కానీ గత వైసిపి ప్రభుత్వం లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర మొత్తం అభివృద్ధి చెందాలని ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని కొనియాడారు. ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా నాలుగో తేదీ పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.


News
విద్యార్థుల ఆట స్థలాలను కాపాడండి DSF, NSUI

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం దొడ్డనగేరి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల లో ఆట స్థలంలో పశువుల హాస్పిటల్ భవనం నిర్మాణ పనులు నిలిపివేయాలని కోరుతూ DSF, NSUI ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు శనివారం వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా DSF జిల్లా అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, NSUI ఎన్ ఎస్ యు ఐ జిల్లా కార్యదర్శి బాలు మాట్లాడుతూ ఆదోని మండలం దొడ్డనగేరి గ్రామంలో విద్యార్థుల ఆటస్థలం ( గ్రౌండ్)లో నుంచి పొలాలకు, ఇండ్లకు వెళ్లే రోడ్డు గా మార్చేశారని అంతటితో ఆగకుండా ఆట స్థలంలో వాటర్ ట్యాంక్, షాపుల కోసం చాలా స్థలము ఆక్రమించారని విద్యార్థి సంఘం బిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పశువుల హాస్పిటల్ కోసం భవన నిర్మాణం చేపడుతున్నారని ఇలా కట్టుకుంటూ వెళ్తే విద్యార్థులకు ఆట స్థలం ఎక్కడ మిగులుతుందని భవిష్యత్తులో భావితరాల విద్యార్థులకు ఆట స్థలం మిగలదని విద్యార్థి సంఘం నాయకులు ఎన్ ఎస్ యు ఐ జిల్లా కార్యదర్శి బాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాఠశాలలో దాదాపుగా 1100 మంది విద్యార్థులు చదువుతున్నరని జూన్ 12 నాటికి పాఠశాలలు ఓపెన్ అయితే విద్యార్థులు ఎక్కడ ఆడుకోవాలని ప్రశ్నించారు. విద్యార్థుల ఆట స్థలాన్ని కాపాడాలని కోరుతూ సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేసినట్లు విద్యార్థి సంఘం నాయకులు తెలిపారు.
News
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 01 06 25:
రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 14/- రూపాయలు, రిటైల్: 1kg 16/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


-
News3 days ago
కౌతాళం మండలం లో దారుణం
-
News1 day ago
క్రికెట్ బెట్టింగ్ లో 91 లక్షల నగదు స్వాధీనం
-
News3 weeks ago
భారత్-పాక్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన
-
News2 weeks ago
ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్గా లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నిక
-
News3 weeks ago
వీరజవాన్ మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించిన మంత్రి నారా లోకేష్
-
News3 weeks ago
శాశ్వతంగా త్రాగునీటి పరిష్కరించాలని సిపిఎం పార్టీ పాదయాత్ర
-
News11 hours ago
వెన్నుపోటు దినం పోస్టర్ విడుదల చేసిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి
-
News3 weeks ago
ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం నిర్మించాలని DSF,PDSO డిమాండ్