News
నలుదిక్కుల ప్రధాన ముఖ్యమైన వార్తలు
◆ ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు పై బిజెపి కసరత్తు, అమిత్ షా నివాసంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై మీటింగ్.. ప్రధాని విదేశీ పర్యటన తర్వాతే కొత్త సీఎం ప్రమాణస్వీకారం ఉండే అవకాశం..
◆ కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య లోపారిక ఒప్పందం జరిగిందన బండి సంజయ్..
అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పోటీ చేయడం లేదని ఆరోపణ.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో బిజెపి గెలుపు ఖాయం అన్న ధీమా..
◆ బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందన్న హరీష్ రావు, కామారెడ్డి లో ఇచ్చిన డిక్లరేషన్ ను అమలు చేయాలని డిమాండ్.. క్యాబినెట్లో 42 శాతం పదవులు బీసీలకే ఇవ్వాలన్న హరీష్ రావు..
◆ వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం.. ఏపీ అంటే రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ మాత్రమే కాదన్న నేతలు అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం చంద్రబాబు దృష్టిసాదించాలని డిమాండ్..
◆ రేపు సిఐడి విచారణకు హాజరు కాలేనన్న రామ్ గోపాల్ వర్మ, స్వారీ మూవీ ప్రమోషన్ లో బిజీగా ఉండడంతో రాలేనని అధికారులకు సమాచారం. ఎనిమిది వారాల తర్వాత డేట్ ఇస్తే హాజరవుతానని సిఐడి కి తెలిపిన ఆర్జీవి..
◆ సంగారెడ్డి జిల్లా ముద్దాయి పేటలో చెరుకు తోట దగ్ధం, 14 ఎకరాల్లో పంట సాగు చేస్తున్న రైతుకు తీవ్ర నష్టం. ఎనిమిది లక్షలు నష్టం జరిగిందని లింగయ్య తీవ్ర ఆవేదన..
◆ మణిపూర్ సీఎం బిరేంద్ర సింగ్ రాజీనామా, గవర్నర్కు రాజీరామా లేఖ అందజేత, బీరన్ సింగ్ పై అవిశ్వాసం పెట్టినందుకు సిద్ధమైన కాంగ్రెస్, తాజా రాజకీయాల పరిణామంతో సీఎం పదవికి రిజైన్..
◆ రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది, కేంద్రం ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ విమర్శలు.. దేశ రక్షణ కోసం పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపు.. వైనాడ్ నియోజకవర్గం లో బూత్ స్థాయి నేతలతో ప్రియాంక భేటీ..
◆ ఆర్జికర్ ఆసుపత్రిలో అత్యాచార ఘటన పై కొనసాగుతున్న నిరసనలు.. పెద్ద ఎత్తున ర్యాలీ తీసిన జూనియర్ డాక్టర్లు.. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్..
◆ తమిళనాడులోని తిరుచిలో అలరిస్తున్న బర్డ్ పార్క్ సందర్భంగా అలరిస్తున్న ఆస్టిన్ కోళ్లు కొంగలు
News
ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
ఎమ్మిగనూరు, మే 13:
లైసెన్స్ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..
ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. — సోమన్న, ఏసీబీ డీఎస్పీ
