News
నిరసన గళం తెలపడానికి సిద్ధమైన వైఎస్ఆర్సిపి
రైతులను నట్టేటా ముంచిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం దగాచేసి అన్నదాతా సుఖీభవ అంటూ పచ్చి మోసం ఏడాదికి రూ.20వేలు ఇస్తామంటూ సూపర్ సిక్స్ హామీ కనుమరుగు చేశారని ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్సిపి పార్టీకి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ మరియు పార్టీ నాయకులు అన్నదాత అండగా వైఎస్ఆర్సిపి పోస్టర్ను విడుదల చేశారు.
దగా చేస్తున్న కూటమి సర్కారుపై నిరసన గళం తెలపడానికి 13వ తేదీ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయానికి పెద్ద ఎత్తున రైతులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాలుగోనలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతు జగనన్న ఇచ్చిన రైతుభరోసాకూ ఎసరు పెట్టారని ఖరీఫ్ ముగిసింది, రబీ వచ్చింది అయినా అన్నదాత సుఖీభవ పెట్టుబడి సహాయం ఆచూకీలేని సహాయం అందక రైతులు గగ్గోలు పెడుతున్నారని బడ్జెట్లో రూ.10,700 కోట్లు పెట్టాల్సి ఉండగా దాని ప్రస్తావనే లేదు తెలిపారు. ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ జగనన్న హయాంలో ఏటా క్రమం తప్పకుండా డా. వైయస్సార్ రైతు భరోసా రైతు భరోసా కింద మేనిఫెస్టోలో పెట్టింది ఏడాది 12వేల 500 రూపాయలు కాని మరో వేయి పెంచి 13 వేల 500 రూపాయలు ఏడాదికి అందించిందని అన్నారు.


News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




