Connect with us

News

దళిత మహిళను హత్య చేసిన ముద్దాయిలు అరెస్టు

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాతన హల్లిలో జులై 12 తేదీ గుండమ్మ అనే దళిత మహిళ హత్య కేసులో 6 మంది నిందితులను డీఎస్పీ శివ నారాయణ స్వామి అరెస్టు చేసి విలేకరుల ముందు హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు. డిఎస్పి తెలుగుని వివరాల మేరకు గుండమ్మ అనే మహిళను ట్రాక్టర్ తో గుద్ది ఆమెపై ట్రాక్టర్ ఎక్కించి చంపారని మరియు పురుషోత్తమ్ రెడ్డిని కట్టే తో కొట్టి తీవ్రంగా గాయపరిచిన ముద్దాయిలను ఆదోని పట్టణం సిరుగుప్ప క్రాస్ రోడ్డు దగ్గర A1 ). జడ్ల శ్రీధర్ రెడ్డి, A2). జడ్ల రాఘవేంద్ర రెడ్డి, A3). జడ్ల సోమ శేఖర్ రెడ్డి, A4). బి. సుబ్బా రెడ్డి @బిసెటి సుబ్బా రెడ్డి, A5). హెబ్బటం రామకృష్ణ @ బోయ రామకృష్ణ, A6). దాసరి గోవిందరాజు @ దాసరి గోవిందు లను అరెస్టు చేసి జుడిషియల్ కోర్టు జడ్జి ముందు హాజరు పరిచయం రిమాండ్కు తరలిస్తున్నామని అదేవిధంగా హత్యకు ఉపయోగించిన AP99-TU- 0407 ట్రాక్టర్ ను సీజ్ చేసినట్లుగా తెలిపారు.

పూర్తి వివరాల్లోకి వెళితే:
డిఎస్పి శివ నారాయణ స్వామి తెలిపిన వివరాల మేరకు నాగనాతనహళ్లి గ్రామం సర్వేనెంబర్ 500/ D లోని 04 ఎకరాల పొలమును తిరుమలమ్మ W/o సోమశేఖర్ రెడ్డి నుండి నాగనాతనహళ్లి గ్రామానికి చెందిన మాదిగ గుండమ్మ W/o శ్రీనివాసులు అను ఆమె 2019 సంవత్సరం లో భూమి కొనుగోలు చేసి, 2022వ సంవత్సరంలో ఆమె కొడుకైన N. కిషోర్ కుమార్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకొన్నారు. అయితే ఈ భూమి విషయంగా గతంలో తిరుమలమ్మ మరియు రాఘవేంద్ర రెడ్డి కి మధ్య వివాదాలు ఉండడంతో ఆదోని సివిల్ కోర్టు నందు సివిల్ కేసు నంబరు O.S No: 50/17 గా వ్యాజ్యము నడుస్తూన్నాయి. వివాదాలు ఉండడం వల్ల భూమిని తిరుమలమ్మ, గుండమ్మకు అమ్మడంతో అప్పటినుండి భూమిని గుండమ్మ సాగు చేసుకుంటూ ఉన్నది. ఈ క్రమంలో జులై 12 తేదీ ఉదయం గుండమ్మ ఆమె కుమారుడు కిషోర్ మరియు కల్లుబావికి చెందిన పురుషోత్తం రెడ్డి ముగ్గురు పొలము వద్ద ట్రాక్టర్ తో ఉన్న సమయంలో నాగనాతనహళ్లి కి చెందిన రాఘవేందర్ రెడ్డి మరియు అతని కుమారుడు శ్రీధర్ రెడ్డి మరియు ఇంకా 4 వ్యక్తులు తమ ట్రాక్టర్ తీసుకుని గుండమ్మ దున్నుతున్న పొలం వద్దకు వెళ్లి ఆ భూమి మాకు కూడా చెందుతుందని మేము కూడా దున్నుతామని గుండమ్మతో వాదిస్తూ రాఘవేంద్ర రెడ్డి కుమారుడు శ్రీధర్ రెడ్డి తన ట్రాక్టర్ తో గుద్ది. ఆమెపై ట్రాక్టర్ ను ఎక్కించి చంపినాడు, మరియు రాఘవేందర్ రెడ్డి కట్టే తో పురుషోత్తమ్ రెడ్డిని కొట్టి తీవ్రంగా గాయపరిచారు.

గుండమ్మ కొడుకైన N. కిషోర్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆదోని రూరల్ CI, G. నిరంజన రెడ్డి గారు పై ఫిర్యాదు పై ఇస్వి పి.ఎస్ Cr.No. 101/2024 U/Sec 103, 109, 329(3), r/w 3(5) BNS and Sec 3(1)(f)(s), 3(2)(v) of SC/ST (POA) Amendment Act-2015 కేసు నమోదు చేశారు.
కర్నూల్ జిల్లా SP కృష్ణకాంత్ పర్యవేక్షణలో దర్యాప్తు అదికారి అయిన SDPO జె. శివనరాయణస్వామి, ఆదోని 2 టౌన్ CI గోపి, ఆదోని రూరల్ CI నిరంజన రెడ్డి, ఇస్వి SI శ్రీనివాసులు 15-07-2024వ తేదీన ఉదయం 11.00 గంటల, ఆదోని టౌన్ లోని, సిరుగుప్ప క్రాస్ రోడ్డు దగ్గరలో ముద్దాయులు
A1 ). జడ్ల శ్రీధర్ రెడ్డి, తండ్రి పేరు జడ్ల రాఘవేంద్ర రెడ్డి, వయసు 19 సంలు, నాగనాతనహళ్లి గ్రామము, ఆదోని మండలం,
A2). జడ్ల రాఘవేంద్ర రెడ్డి, వయస్సు 53 సంలు తండ్రి పేరు లేట్ శివ శంకర్ రెడ్డి, నాగనాతనహళ్లి గ్రామము, ఆదోని మండలం,
A3). జడ్ల సోమ శేఖర్ రెడ్డి, వయస్సు 42 సంలు తండ్రి పేరు లేట్ శివ శంకర్ రెడ్డి, నాగనాతనహళ్లి గ్రామము, ఆదోని మండలం,
A4). బి. సుబ్బా రెడ్డి @బిసెటి సుబ్బా రెడ్డి, వయసు 50 సంలు, తండ్రి పేరు చెన్నా రెడ్డి, నాగనాతనహళ్లి గ్రామము, ఆదోని మండలం,
A5). హెబ్బటం రామకృష్ణ @ బోయ రామకృష్ణ, వయసు 40 సంలు, తండ్రి పేరు నాగప్పు, నాగనాతనహళ్లి గ్రామము, ఆదోని మండలం,
A6). దాసరి గోవిందరాజు @ దాసరి గోవిందు, వయసు 27 సంలు, తండ్రి పేరు తిమ్మయ్య@ తిమ్మప్ప, నాగనాతనహళ్లి గ్రామము, ఆదోని మండలం.
వీరిని అదుపులోకి తీసుకొని విచారించి వారి నుండి హత్యకు ఉపయోగించిన ట్రాక్టర్ AP99-TU- 0407 ను మరియు కట్టెను సిరుగుప్ప క్రాస్ సమీపంలో వైపుల భాస్కర్ రెడ్డి ఖాళీ పొలంలోగల ముళ్ళ పొదలలో పంచాయతీదారుల సమక్షంలో స్వాదినం చేసుకొని ముద్దాయిలను అరెస్టు చేసి ఆదోని రెండవ అదనపు JFCM కోర్ట్ జడ్జి ముందు హాజరు రిమాండ్ కు తరలించారు.

హత్యకు గురైన గుండమ్మ
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

సహకార ఉద్యోగుల సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం బాసట

Published

on

ఆదోని, ఫిబ్రవరి 21:ఆదోనిలోని డి.సి.సి.బి (DCCB) బ్యాంక్ ఎదుట తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సహకార సంఘాల ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం శనివారం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సమ్మె శిబిరాన్ని సందర్శించిన సంఘం నాయకులు ఉద్యోగుల పోరాటానికి సంఘీభావం తెలిపారు.

సభలో మాట్లాడుతున్న వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు లింగన్న

ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె. లింగన్న, మండల కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు:

  • వ్యవసాయానికి వెన్నెముక: గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి సాగు పెట్టుబడి నుంచి ఇతర సేవల వరకు ప్రాథమిక సహకార సంఘాలు ఎంతో మేలు చేస్తున్నాయని వారు కొనియాడారు.
  • ప్రభుత్వ బాధ్యత: సహకార వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా, వాటిని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు గుర్తు చేశారు.
  • తక్షణ పరిష్కారం: గత కొంతకాలంగా తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు శాంతియుతంగా పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. వారి న్యాయమైన కోర్కెలను వెంటనే ప్రభుత్వం ఆమోదించాలని డిమాండ్ చేశారు.
సభలో మాట్లాడుతున్న వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు లింగన్న

ఈ కార్యక్రమంలో సహకార సంఘాల ఉద్యోగులు, కార్మిక సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

News

పోగొట్టుకున్న బ్యాగ్ను పోలీసులు ఒకే ఒక్క గంటలో రికవరీ

Published

on

ఆదోని, ఫిబ్రవరి 18:

ప్రయాణంలో అజాగ్రత్తగా వదిలేసిన లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఆదోని వన్ టౌన్ పోలీసులు కేవలం ఒకే ఒక్క గంటలో రికవరీ చేసి బాధితురాలికి అప్పగించారు. పోలీసుల వేగవంతమైన స్పందనపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

అసలేం జరిగిందంటే?  కౌతాలం నుంచి ఆదోనికి ఆర్టీసీ బస్సులో వచ్చిన ఓ మహిళ, విశాల్ మార్ట్ వద్ద దిగుతూ తన బ్యాగును బస్సులోనే మరిచిపోయింది. ఆ బ్యాగులో 6 లక్షల రూపాయల విలువైన 4 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. అయితే, ఆ తొందరలో తన వెంట తెచ్చుకున్న బ్యాగును బస్సులోనే మరిచిపోయారు. కొద్దిసేపటి తర్వాత బ్యాగు గుర్తుకు రావడంతో హుటాహుటిన బస్టాండ్‌కు చేరుకుని డ్రైవర్‌ను సంప్రదించారు. బస్సులో వెతికినప్పటికీ బ్యాగు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన బాధితురాలు సాయంత్రం 3:30 గంటలకు ఆదోని వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్ గారికి ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు.. బాధితురాలి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన పోలీసులు బస్సు డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు విచారణ చేపట్టారు. పలు ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గాలింపు చేపట్టారు. సాయంత్రం 4:30 గంటలకు పోగొట్టుకున్న సొత్తును తిరిగి పొందిన బాధితురాలు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

Continue Reading

News

నాటు సారా స్థావరంపై పోలీసుల దాడి

Published

on

ఆదోని రూరల్, ఫిబ్రవరి 18:

కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా ఆదోని డీఎస్పీ శ్రీ హేమలత సూచనల మేరకు, రూరల్ సీఐ నల్లప్ప పర్యవేక్షణలో బుధవారం పెద్దతుంబలం పోలీసులు భారీ దాడులు నిర్వహించారు.

ఘటన వివరాలు:

​పెద్దతుంబలం ఎస్ఐ విద్యా శ్రీ, తన సిబ్బంది రంగస్వామి (PC-3603), రామకృష్ణ (PC-3637)లతో కలిసి దొడ్డనగిరి గ్రామ శివార్లలోని సిద్ధాపురం ఆంజనేయస్వామి గుడి సమీపంలో ఉన్న గుట్టల వద్ద తనిఖీలు చేపట్టారు. అక్కడ గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న నాటు సారా బట్టిని పోలీసులు గుర్తించారు. పోలీసుల రాకను గమనించిన నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు.

భారీగా ఊట ధ్వంసం:

​పోలీసులు సారా బట్టి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అక్కడ నిల్వ ఉంచిన ఊటను తక్షణమే ధ్వంసం చేశారు. అలాగే, ప్లాస్టిక్ క్యాన్లలో నిల్వ ఉంచిన 10 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

నిందితుడి గుర్తింపు:

​పోలీసుల ప్రాథమిక విచారణలో, సారా బట్టి నిర్వహిస్తున్న వ్యక్తి ఆదోని పట్టణానికి చెందిన నాగరాజు కుమారుడు బోయ శివగా తేలింది. స్థానిక పొలాల యజమానుల నుంచి సేకరించిన సమాచారం మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విద్యా శ్రీ తెలిపారు. అక్రమ మద్యం తయారీ మరియు రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

Continue Reading

Trending