News
దళిత మహిళను హత్య చేసిన ముద్దాయిలు అరెస్టు
కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాతన హల్లిలో జులై 12 తేదీ గుండమ్మ అనే దళిత మహిళ హత్య కేసులో 6 మంది నిందితులను డీఎస్పీ శివ నారాయణ స్వామి అరెస్టు చేసి విలేకరుల ముందు హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు. డిఎస్పి తెలుగుని వివరాల మేరకు గుండమ్మ అనే మహిళను ట్రాక్టర్ తో గుద్ది ఆమెపై ట్రాక్టర్ ఎక్కించి చంపారని మరియు పురుషోత్తమ్ రెడ్డిని కట్టే తో కొట్టి తీవ్రంగా గాయపరిచిన ముద్దాయిలను ఆదోని పట్టణం సిరుగుప్ప క్రాస్ రోడ్డు దగ్గర A1 ). జడ్ల శ్రీధర్ రెడ్డి, A2). జడ్ల రాఘవేంద్ర రెడ్డి, A3). జడ్ల సోమ శేఖర్ రెడ్డి, A4). బి. సుబ్బా రెడ్డి @బిసెటి సుబ్బా రెడ్డి, A5). హెబ్బటం రామకృష్ణ @ బోయ రామకృష్ణ, A6). దాసరి గోవిందరాజు @ దాసరి గోవిందు లను అరెస్టు చేసి జుడిషియల్ కోర్టు జడ్జి ముందు హాజరు పరిచయం రిమాండ్కు తరలిస్తున్నామని అదేవిధంగా హత్యకు ఉపయోగించిన AP99-TU- 0407 ట్రాక్టర్ ను సీజ్ చేసినట్లుగా తెలిపారు.
పూర్తి వివరాల్లోకి వెళితే:
డిఎస్పి శివ నారాయణ స్వామి తెలిపిన వివరాల మేరకు నాగనాతనహళ్లి గ్రామం సర్వేనెంబర్ 500/ D లోని 04 ఎకరాల పొలమును తిరుమలమ్మ W/o సోమశేఖర్ రెడ్డి నుండి నాగనాతనహళ్లి గ్రామానికి చెందిన మాదిగ గుండమ్మ W/o శ్రీనివాసులు అను ఆమె 2019 సంవత్సరం లో భూమి కొనుగోలు చేసి, 2022వ సంవత్సరంలో ఆమె కొడుకైన N. కిషోర్ కుమార్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకొన్నారు. అయితే ఈ భూమి విషయంగా గతంలో తిరుమలమ్మ మరియు రాఘవేంద్ర రెడ్డి కి మధ్య వివాదాలు ఉండడంతో ఆదోని సివిల్ కోర్టు నందు సివిల్ కేసు నంబరు O.S No: 50/17 గా వ్యాజ్యము నడుస్తూన్నాయి. వివాదాలు ఉండడం వల్ల భూమిని తిరుమలమ్మ, గుండమ్మకు అమ్మడంతో అప్పటినుండి భూమిని గుండమ్మ సాగు చేసుకుంటూ ఉన్నది. ఈ క్రమంలో జులై 12 తేదీ ఉదయం గుండమ్మ ఆమె కుమారుడు కిషోర్ మరియు కల్లుబావికి చెందిన పురుషోత్తం రెడ్డి ముగ్గురు పొలము వద్ద ట్రాక్టర్ తో ఉన్న సమయంలో నాగనాతనహళ్లి కి చెందిన రాఘవేందర్ రెడ్డి మరియు అతని కుమారుడు శ్రీధర్ రెడ్డి మరియు ఇంకా 4 వ్యక్తులు తమ ట్రాక్టర్ తీసుకుని గుండమ్మ దున్నుతున్న పొలం వద్దకు వెళ్లి ఆ భూమి మాకు కూడా చెందుతుందని మేము కూడా దున్నుతామని గుండమ్మతో వాదిస్తూ రాఘవేంద్ర రెడ్డి కుమారుడు శ్రీధర్ రెడ్డి తన ట్రాక్టర్ తో గుద్ది. ఆమెపై ట్రాక్టర్ ను ఎక్కించి చంపినాడు, మరియు రాఘవేందర్ రెడ్డి కట్టే తో పురుషోత్తమ్ రెడ్డిని కొట్టి తీవ్రంగా గాయపరిచారు.
గుండమ్మ కొడుకైన N. కిషోర్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆదోని రూరల్ CI, G. నిరంజన రెడ్డి గారు పై ఫిర్యాదు పై ఇస్వి పి.ఎస్ Cr.No. 101/2024 U/Sec 103, 109, 329(3), r/w 3(5) BNS and Sec 3(1)(f)(s), 3(2)(v) of SC/ST (POA) Amendment Act-2015 కేసు నమోదు చేశారు.
కర్నూల్ జిల్లా SP కృష్ణకాంత్ పర్యవేక్షణలో దర్యాప్తు అదికారి అయిన SDPO జె. శివనరాయణస్వామి, ఆదోని 2 టౌన్ CI గోపి, ఆదోని రూరల్ CI నిరంజన రెడ్డి, ఇస్వి SI శ్రీనివాసులు 15-07-2024వ తేదీన ఉదయం 11.00 గంటల, ఆదోని టౌన్ లోని, సిరుగుప్ప క్రాస్ రోడ్డు దగ్గరలో ముద్దాయులు
A1 ). జడ్ల శ్రీధర్ రెడ్డి, తండ్రి పేరు జడ్ల రాఘవేంద్ర రెడ్డి, వయసు 19 సంలు, నాగనాతనహళ్లి గ్రామము, ఆదోని మండలం,
A2). జడ్ల రాఘవేంద్ర రెడ్డి, వయస్సు 53 సంలు తండ్రి పేరు లేట్ శివ శంకర్ రెడ్డి, నాగనాతనహళ్లి గ్రామము, ఆదోని మండలం,
A3). జడ్ల సోమ శేఖర్ రెడ్డి, వయస్సు 42 సంలు తండ్రి పేరు లేట్ శివ శంకర్ రెడ్డి, నాగనాతనహళ్లి గ్రామము, ఆదోని మండలం,
A4). బి. సుబ్బా రెడ్డి @బిసెటి సుబ్బా రెడ్డి, వయసు 50 సంలు, తండ్రి పేరు చెన్నా రెడ్డి, నాగనాతనహళ్లి గ్రామము, ఆదోని మండలం,
A5). హెబ్బటం రామకృష్ణ @ బోయ రామకృష్ణ, వయసు 40 సంలు, తండ్రి పేరు నాగప్పు, నాగనాతనహళ్లి గ్రామము, ఆదోని మండలం,
A6). దాసరి గోవిందరాజు @ దాసరి గోవిందు, వయసు 27 సంలు, తండ్రి పేరు తిమ్మయ్య@ తిమ్మప్ప, నాగనాతనహళ్లి గ్రామము, ఆదోని మండలం.
వీరిని అదుపులోకి తీసుకొని విచారించి వారి నుండి హత్యకు ఉపయోగించిన ట్రాక్టర్ AP99-TU- 0407 ను మరియు కట్టెను సిరుగుప్ప క్రాస్ సమీపంలో వైపుల భాస్కర్ రెడ్డి ఖాళీ పొలంలోగల ముళ్ళ పొదలలో పంచాయతీదారుల సమక్షంలో స్వాదినం చేసుకొని ముద్దాయిలను అరెస్టు చేసి ఆదోని రెండవ అదనపు JFCM కోర్ట్ జడ్జి ముందు హాజరు రిమాండ్ కు తరలించారు.

News
ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
ఎమ్మిగనూరు, మే 13:
లైసెన్స్ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..
ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. — సోమన్న, ఏసీబీ డీఎస్పీ
