News
ఏపీలో 37 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్

రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ అయ్యారు. రాష్ట్రంలో 37 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ.
రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఈ మేరకు సీఎస్ నీరభ్కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా పలువురు అధికారులకు డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు.


బదిలీ అయిన ఐపీఎస్ అధికారుల వివరాలు
శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా కె.వి.మహేశ్వర్రెడ్డి
విజయనగరం జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్
అనకాపల్లి జిల్లా ఎస్పీగా ఎం.దీపిక
సత్యసాయి జిల్లా ఎస్పీగా వి.రత్న
పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీగా ఎస్.వి.మాధవరెడ్డి
కాకినాడ జిల్లా ఎస్పీగా విక్రాంత్ పాటిల్
గుంటూరు జిల్లా ఎస్పీగా ఎస్.సతీశ్కుమార్
అల్లూరి జిల్లా ఎస్పీగా అమిత్ బర్దార్
విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్ 1గా అజిత వేజెండ్ల
విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్ 2గా తుహిన్ సిన్హా
తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా డి.నరసింహ కిషోర్
అన్నమయ్య జిల్లా ఎస్పీగా వి.విద్యాసాగర్ నాయుడు
కోనసీమ జిల్లా ఎస్పీగా బి.కృష్ణారావు
కృష్ణా జిల్లా ఎస్పీగా ఆర్.గంగాధర్రావు
పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీగా అద్నాన్ నయీమ్ ఆస్మీ
ఏలూరు జిల్లా ఎస్పీగా కె.ప్రతాప్ శివకిషోర్
పల్నాడు జిల్లా ఎస్పీగా కె.శ్రీనివాసరావు
ఏపీఎస్పీ విజయనగరం బెటాలియన్ కమాండెంట్గా మల్లికాగార్గ్
ప్రకాశం జిల్లా ఎస్పీగా ఏఆర్ దామోదర్
కర్నూలు జిల్లా ఎస్పీగా జి.బిందు మాధవ్
నెల్లూరు జిల్లా ఎస్పీగా జీ.కృష్ణకాంత్
నంద్యాల జిల్లా ఎస్పీగా అధిరాజ్ సింగ్ రానా
కడప జిల్లా ఎస్పీగా వి.హర్షవర్ధన్ రాజు
అనంతపురం జిల్లా ఎస్పీగా కేవీ మురళీకృష్ణ
తిరుపతి జిల్లా ఎస్పీగా ఎల్.సుబ్బారాయుడు.
ఎర్రచందనం టాస్క్ ఫోర్సు ఎస్పీగానూ సుబ్బారాయుడుకు పూర్తి అదనపు బాధ్యతలు
ఎన్టీఆర్ డిప్యూటీ పోలీసు కమిషనర్ శాంతిభద్రతలుగా గౌతమీ శాలి
ఇంటెలిజెన్స్ అడ్మిన్ ఎస్పీగా వి.గీతాదేవీ బదిలీ
డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని రఘువీరారెడ్డి, సిద్థార్థ్కు ఆదేశం.
డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని కౌశల్, సుమిత్ సునీల్కు ఆదేశం.
డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని పి.జగదీశ్, ఎస్.శ్రీధర్, సత్తిబాబుకు ఆదేశం.
డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని రాధిక, మేరీ ప్రశాంతి, ఆరిఫ్ హఫీజ్కు ఆదేశం.
News
శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్

కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.


News
16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.


News
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.


-
News2 weeks ago
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా
-
News3 weeks ago
భారీ వర్షనికి రామజల చెరువు నిండి ఇళ్లలోకి నీరు
-
News3 weeks ago
తుంగభద్ర డ్యాంకు పెరుగుతున్న వరద నీరు 27-09-2025
-
News3 weeks ago
ఆదోని డివిజన్లో కురిసిన వర్షపాతం
-
Business3 weeks ago
రోజు రోజుకు పతనమవుతున్న పత్తి ధర..
-
Business4 weeks ago
Gold, Silver Price బంగారు ధర
-
Business4 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు
-
Business4 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు