News
ఏపీలో 37 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ అయ్యారు. రాష్ట్రంలో 37 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ.
రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఈ మేరకు సీఎస్ నీరభ్కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా పలువురు అధికారులకు డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు.


బదిలీ అయిన ఐపీఎస్ అధికారుల వివరాలు
శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా కె.వి.మహేశ్వర్రెడ్డి
విజయనగరం జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్
అనకాపల్లి జిల్లా ఎస్పీగా ఎం.దీపిక
సత్యసాయి జిల్లా ఎస్పీగా వి.రత్న
పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీగా ఎస్.వి.మాధవరెడ్డి
కాకినాడ జిల్లా ఎస్పీగా విక్రాంత్ పాటిల్
గుంటూరు జిల్లా ఎస్పీగా ఎస్.సతీశ్కుమార్
అల్లూరి జిల్లా ఎస్పీగా అమిత్ బర్దార్
విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్ 1గా అజిత వేజెండ్ల
విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్ 2గా తుహిన్ సిన్హా
తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా డి.నరసింహ కిషోర్
అన్నమయ్య జిల్లా ఎస్పీగా వి.విద్యాసాగర్ నాయుడు
కోనసీమ జిల్లా ఎస్పీగా బి.కృష్ణారావు
కృష్ణా జిల్లా ఎస్పీగా ఆర్.గంగాధర్రావు
పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీగా అద్నాన్ నయీమ్ ఆస్మీ
ఏలూరు జిల్లా ఎస్పీగా కె.ప్రతాప్ శివకిషోర్
పల్నాడు జిల్లా ఎస్పీగా కె.శ్రీనివాసరావు
ఏపీఎస్పీ విజయనగరం బెటాలియన్ కమాండెంట్గా మల్లికాగార్గ్
ప్రకాశం జిల్లా ఎస్పీగా ఏఆర్ దామోదర్
కర్నూలు జిల్లా ఎస్పీగా జి.బిందు మాధవ్
నెల్లూరు జిల్లా ఎస్పీగా జీ.కృష్ణకాంత్
నంద్యాల జిల్లా ఎస్పీగా అధిరాజ్ సింగ్ రానా
కడప జిల్లా ఎస్పీగా వి.హర్షవర్ధన్ రాజు
అనంతపురం జిల్లా ఎస్పీగా కేవీ మురళీకృష్ణ
తిరుపతి జిల్లా ఎస్పీగా ఎల్.సుబ్బారాయుడు.
ఎర్రచందనం టాస్క్ ఫోర్సు ఎస్పీగానూ సుబ్బారాయుడుకు పూర్తి అదనపు బాధ్యతలు
ఎన్టీఆర్ డిప్యూటీ పోలీసు కమిషనర్ శాంతిభద్రతలుగా గౌతమీ శాలి
ఇంటెలిజెన్స్ అడ్మిన్ ఎస్పీగా వి.గీతాదేవీ బదిలీ
డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని రఘువీరారెడ్డి, సిద్థార్థ్కు ఆదేశం.
డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని కౌశల్, సుమిత్ సునీల్కు ఆదేశం.
డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని పి.జగదీశ్, ఎస్.శ్రీధర్, సత్తిబాబుకు ఆదేశం.
డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని రాధిక, మేరీ ప్రశాంతి, ఆరిఫ్ హఫీజ్కు ఆదేశం.
News
క్రికెట్ బెట్టింగ్కు పాల్పడితే పీడీ యాక్ట్: ఆదోని వన్ టౌన్ సీఐ హెచ్చరిక
ఆదోని, ఏప్రిల్ 13:
పట్టణంలో అక్రమంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ యువత జీవితాలతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆదోని వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్ హెచ్చరించారు. సోమవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత బెట్టింగ్ నిర్వాహకులను స్టేషన్కు పిలిపించి ఆయన కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. పోలీసుల ఆదేశాలను అతిక్రమించి ఎవరైనా క్రికెట్ బెట్టింగ్కు పాల్పడితే వారిపై పీడీ (PD) చట్టాన్ని ప్రయోగిస్తామని స్పష్టం చేశారు. కేవలం కేసులతోనే సరిపెట్టకుండా, బెట్టింగ్ ద్వారా అక్రమంగా సంపాదించిన ఆస్తులను జప్తు చేస్తామని మరియు వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తామని (Freeze) తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

ముఖ్య అంశాలు:
- కఠిన చర్యలు: బెట్టింగ్ నిర్వాహకులకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరించే వారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తాం.
- నిఘా: బెట్టింగ్ రాయుళ్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచడం జరిగింది.
- ప్రజలకు విన్నపం: అక్రమ కార్యకలాపాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు సంబంధిత వ్యక్తులు పాల్గొన్నారు.
News
పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులకు తీవ్ర గాయాలు
ఆదోని, ఏప్రిల్ 03:
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని బాలాజీ విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలలో పెను ప్రమాదం తప్పింది. తరగతి గది పైకప్పు పెచ్చులు ఊడి పడటంతో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఘటన వివరాలు:
శుక్రవారం పాఠశాలలో తరగతులు జరుగుతుండగా ఒక్కసారిగా పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో మూడవ తరగతి చదువుతున్న చరణ్, అరవింద్ అనే విద్యార్థులకు తలలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం కావడంతో గమనించిన ఉపాధ్యాయులు వెంటనే వారిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సెలవు రోజూ పాఠశాల నిర్వహణ:
ఈ ఘటనపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ‘గుడ్ ఫ్రైడే’ సందర్భంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్యం పాఠశాలను నడుపుతున్నట్లు తెలిసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు సంబంధిత విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

యాజమాన్యం వివరణ:
ఈ ఘటనపై పాఠశాల సంగీత టీచర్ మాట్లాడుతూ.. సిలబస్ పూర్తి కాలేదన్న కారణంతోనే సెలవు రోజున ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. భవనం పైభాగంలో కోతులు బలంగా దూకడం వల్లే పెచ్చులు ఊడి పడ్డాయని ఆమె పేర్కొన్నారు. పాఠశాల నడుస్తున్న కారణంగా రిపేర్లు చేయించలేకపోయామని, వేసవి సెలవుల్లో పనులు చేయించాలని అనుకున్నామని వివరణ ఇచ్చారు.
తల్లిదండ్రుల ఆందోళన:
శిథిలావస్థకు చేరిన భవనాల్లో క్లాసులు నిర్వహించి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి సెలవు రోజున స్కూల్ నడుపుతున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

News
ఆస్తి కోసం తండ్రి పై కత్తి తో దాడి చేసిన వ్యక్తి అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని మండలం కపటి గ్రామం లో గత నెల 18వ తేదీ తండ్రి ఆస్తి పంచడం లేదని కత్తి తో దాడి చేసి అడ్డొచ్చిన తల్లిని కొట్టి తండ్రి సెల్ తో ఫోన్ పే ద్వారా 2 లక్షలు తన అకౌంట్ లో వేసుకొని తండ్రి బుల్లెట్ వాహనం తో పరారైన వేణుగోపాలను ఇస్వి పోలీసులు చాగి బస్టాండ్ వద్ద అరెస్టు చేసి అతని వద్ద నుండి ఒక లక్ష 92 వేల నగదు, బుల్లెట్ మోటార్ సైకిల్, బంగారు గొలుసు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని రిమైండ్ కి తరలించారు.


