News
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపిన ట్రైనింగ్ డిఎస్పి ధీరజ్
మట్క, పేకాట, కర్ణాటక మద్యంపై పోలీసు నిఘా నేత్రాలు పనిచేస్తున్నాయని ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారికి ఎవరైనా అధికారులు ప్రోత్సహిస్తే వారికి కూడా శిక్ష తప్పదని ట్రైని డి.ఎస్.పి దిరాజ్ హెచ్చరించారు..

కర్నూలు జిల్లా ఆదోని మండలం దుడ్డనిగిరి గ్రామంలో ట్రైనీ డిఎస్పి ధీరజ్ పర్యటించారు. ఈ సందర్భంగా ట్రైని డిఎస్పి ధీరజ్ మాట్లాడుతూ గ్రామాల్లో ఎవరైనా మట్కా పేకాట అక్రమ కర్ణాటక మద్యం లాంటివి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని అలాగే అధికారులు ఎవరినైనా ప్రోత్సహిస్తే వారి పైన కూడా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గ్రామాలలో మొహరం పండుగ కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగని అందరూ దీనికి సహకరించి ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఘర్షణలకు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎవరిని ఉపేక్షించేది లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాలుక సీఐ నిరంజన్ రెడ్డి, పెదతుమలం ఎస్సై చిన్న పీరయ్య గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




