News
చదువుకు దూరం అవుతున్న బడుగు విద్యార్థినిలు
కర్నూలు జిల్లా ఆదోనిలో విద్యార్థినిలు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది హాస్టల్ వసతి లేకపోవడం వల్ల గ్రామీణ విద్యార్థులు ఉన్నత చదువులు చదవలేక మధ్యలోనే మానేసి బాల కార్మికులుగా మిగిలిపోతున్నారు. తరగతులు ప్రారంభమై 20 రోజులు గడిచిన హాస్టల్ వసతి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. చేసేదేమీ లేక చదువులు మధ్యలోనే ఆపేసే పరిస్థితి ఉందని బీసీ విద్యార్థినుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. నియోజకవర్గంలో చాలా గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల ప్రతి రోజు ఆటో చార్జీలు చెల్లించుకోలేక స్కూళ్లకు డుమ్మ కొడుతున్న పరిస్థితి ఉంది.

అలాంటి పరిస్థితి రానివ్వకుండా ప్రతి విద్యార్థినికి హాస్టల్ వసతి కల్పిస్తామని ఎమ్మెల్యే పార్థసారథి గత నెల 22న మాటిచ్చారు ఆయన మాటలు నమ్మి నియోజకవర్గంలోని ఆయా గ్రామాల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్లో ఉన్నత విద్య అభ్యాసన కోసం చేర్పించారు.

నెరవేరని ఎమ్మెల్యే హామీ: డివిజన్ కేంద్రమైన ఆదోనిలో అద్దె భవనంలోనైనా బీసీ హాస్టల్ కొనసాగేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పార్థసారథి గత నెల 22న పత్రికాముఖంగా హామీ ఇచ్చారు. హరులైన విద్యార్థినిల నుండి హాస్టల్ వసతి కోసం దరఖాస్తులు స్వీకరించాలని సోషల్ వెల్ఫేర్ అధికారులకు ఆదేశించారు. ఆ సూచన మేరకు ఆదోని పట్టణంలోనే ప్రభుత్వ గర్ల్స్ హై స్కూల్ ప్రాంగణంలో ఉన్న ఎస్సీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ అధికారులకు తల్లిదండ్రులు దరఖాస్తుల సమర్పించారు. ఇప్పటివరకు సుమారుగా 160 మంది విద్యార్థినిలు దరఖాస్తులు చేసుకున్నారు. తరగతులు గత నెల 13న ప్రారంభమయ్యాయి, ఇప్పటివరకు హాస్టల్ సదుపాయం లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుండి రోజు చదువుకోడానికి ఆదోనికి వచ్చేందుకు నాన ప్రయాసలు పడాల్సి వస్తుందని విద్యార్థులు చెబుతున్నారు దరఖాస్తు చేసుకున్న వారందరికీ సదుపాయం కల్పించాలని కోరుతున్నారు. దరఖాస్తు చేసుకున్న వారందరూ రోజు ఇంటిగ్రేటెడ్ హాస్టల్ చుట్టూ తిరుగుతున్న అక్కడ ఉద్యోగుల నుండి సరైన సమాధానం రాకపోవడంతో నిరుత్సాహానికి లోనవుతున్నారు. ఇచ్చిన హామీ మేరకు ఆరో తరగతి నుండి పదవ తరగతి చదివే బిసి విద్యార్థినులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఆ దిశగా ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


విద్యార్థులందరికీ వసతి కల్పించాలి: శ్రీనివాసులు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఆదోని
డివిజన్ కేంద్రమైన ఆదోనిలో చదువుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి నుండి పదవ తరగతి చదువే గ్రామీణ విద్యార్థులకు తప్పనిసరిగా హాస్టల్ వసతి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది బీసీ హాస్టల్ నిర్వాణకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఎంతో హర్షించారన్నారు. ఎమ్మెల్యే హామీ ఇచ్చి రోజులు గడిచిన ఎలాంటి చర్యలు కనపడలేదు దరఖాస్తు చేసుకున్న వారందరూ హాస్టల్ సీటు కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి దరఖాస్తు చేసుకున్న బిసి బాలిక విద్యార్థులందరికీ హాస్టల్ వసతి కల్పించాలని లేనియెడల ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

News
క్రికెట్ బెట్టింగ్కు పాల్పడితే పీడీ యాక్ట్: ఆదోని వన్ టౌన్ సీఐ హెచ్చరిక
ఆదోని, ఏప్రిల్ 13:
పట్టణంలో అక్రమంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ యువత జీవితాలతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆదోని వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్ హెచ్చరించారు. సోమవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత బెట్టింగ్ నిర్వాహకులను స్టేషన్కు పిలిపించి ఆయన కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. పోలీసుల ఆదేశాలను అతిక్రమించి ఎవరైనా క్రికెట్ బెట్టింగ్కు పాల్పడితే వారిపై పీడీ (PD) చట్టాన్ని ప్రయోగిస్తామని స్పష్టం చేశారు. కేవలం కేసులతోనే సరిపెట్టకుండా, బెట్టింగ్ ద్వారా అక్రమంగా సంపాదించిన ఆస్తులను జప్తు చేస్తామని మరియు వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తామని (Freeze) తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

ముఖ్య అంశాలు:
- కఠిన చర్యలు: బెట్టింగ్ నిర్వాహకులకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరించే వారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తాం.
- నిఘా: బెట్టింగ్ రాయుళ్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచడం జరిగింది.
- ప్రజలకు విన్నపం: అక్రమ కార్యకలాపాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు సంబంధిత వ్యక్తులు పాల్గొన్నారు.
News
పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులకు తీవ్ర గాయాలు
ఆదోని, ఏప్రిల్ 03:
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని బాలాజీ విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలలో పెను ప్రమాదం తప్పింది. తరగతి గది పైకప్పు పెచ్చులు ఊడి పడటంతో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఘటన వివరాలు:
శుక్రవారం పాఠశాలలో తరగతులు జరుగుతుండగా ఒక్కసారిగా పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో మూడవ తరగతి చదువుతున్న చరణ్, అరవింద్ అనే విద్యార్థులకు తలలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం కావడంతో గమనించిన ఉపాధ్యాయులు వెంటనే వారిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సెలవు రోజూ పాఠశాల నిర్వహణ:
ఈ ఘటనపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ‘గుడ్ ఫ్రైడే’ సందర్భంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్యం పాఠశాలను నడుపుతున్నట్లు తెలిసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు సంబంధిత విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

యాజమాన్యం వివరణ:
ఈ ఘటనపై పాఠశాల సంగీత టీచర్ మాట్లాడుతూ.. సిలబస్ పూర్తి కాలేదన్న కారణంతోనే సెలవు రోజున ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. భవనం పైభాగంలో కోతులు బలంగా దూకడం వల్లే పెచ్చులు ఊడి పడ్డాయని ఆమె పేర్కొన్నారు. పాఠశాల నడుస్తున్న కారణంగా రిపేర్లు చేయించలేకపోయామని, వేసవి సెలవుల్లో పనులు చేయించాలని అనుకున్నామని వివరణ ఇచ్చారు.
తల్లిదండ్రుల ఆందోళన:
శిథిలావస్థకు చేరిన భవనాల్లో క్లాసులు నిర్వహించి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి సెలవు రోజున స్కూల్ నడుపుతున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

News
ఆస్తి కోసం తండ్రి పై కత్తి తో దాడి చేసిన వ్యక్తి అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని మండలం కపటి గ్రామం లో గత నెల 18వ తేదీ తండ్రి ఆస్తి పంచడం లేదని కత్తి తో దాడి చేసి అడ్డొచ్చిన తల్లిని కొట్టి తండ్రి సెల్ తో ఫోన్ పే ద్వారా 2 లక్షలు తన అకౌంట్ లో వేసుకొని తండ్రి బుల్లెట్ వాహనం తో పరారైన వేణుగోపాలను ఇస్వి పోలీసులు చాగి బస్టాండ్ వద్ద అరెస్టు చేసి అతని వద్ద నుండి ఒక లక్ష 92 వేల నగదు, బుల్లెట్ మోటార్ సైకిల్, బంగారు గొలుసు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని రిమైండ్ కి తరలించారు.


