News
ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలి.. డీఎస్పీ శివ నారాయణస్వామి
కర్నూలు జిల్లా ఆదోని లో పోలీసుల అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం చేసిన డి.ఎస్.పి శివ నారాయణ స్వామి, సిఐలు, ఎస్సైలు, పోలీసులు.
డీఎస్పీ శివ నారాయణ స్వామి మాట్లాడుతూ అక్టోబర్ 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగా ప్రతిరోజు వివిధ రకాల కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు వచ్చి చేరువయ్యే విధంగా ర్యాలీలు ఎస్సే రైటింగ్ లు చేపట్టామని తెలిపారు చివరి రోజు కావడంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ప్రతి ఒక్క పోలీసు డిపార్ట్మెంట్లో ఉన్నవారు రక్తదానం చేశారని తెలిపారు. ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ప్రాణాలు కాపాడిన అమరవీరులను స్మరించుకుంటూ ఆదోని డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులు రక్తదానం చేయడం జరిగిందని తెలిపారు.
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




