News
కోటి రూపాయల నిధులు స్వాహా
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని హిందూ స్మశాన వాటిక లో మృతదేహాలను దహనం చేసే బిల్డింగుకు 2020-21వ సంవత్సరములలో 14వ వార్షిక నిధులు కోటి రూపాయల విడుదల కాగా ఆ నిధులను నామమాత్రంగా ఖర్చు చేసి నిధులను స్వాహా చేశారని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే. అజయ్ బాబు ఆరోపించారు. అవినీతి ఆక్రమణలకు పాల్పడినటువంటి అధికారులను మరియు కాంట్రాక్టర్లల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని , వారు దోచుకున్నటువంటి సొమ్మును రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని సిపిఎం పార్టీ నాయకులు హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి పట్టణాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిధులు కేటాయిస్తే వాటిని కాంట్రాక్టర్లు అధికారులు పనులు చేయకుండా పనులు చేసినట్లు చూపించి నిధులను స్వాహా చేస్తున్నారు అని సిపిఐ పట్టణ మండల కార్యదర్శి లు సుదర్శన్, విమర్శించారు.
ఈ కార్యక్రమంలో కల్లుబావిరాజు, సహాయ కార్యదర్శి విజయ్, ఏ ఐ టి యు సి పట్టణ అధ్యక్ష కార్యదర్శులు భీమేష్, వెంకన్న, సహాయ కార్యదర్శి ప్రకాష్ సిపిఐ పార్టీ నాయకులు పుష్పరాజు, అయ్యన్న స్వామి తదితరులు పాల్గొన్నారు.
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




