News
డాక్యుమెంట్ రైటర్స్ పెన్ డౌన్
రాష్ట్రవ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లు పెన్ డౌన్ సమ్మె నిర్వహించారు అందులో భాగంగా
కర్నూలు జిల్లా ఆదోని లో డాక్యుమెండేటర్లు కూడా పెన్ డౌన్ సమ్మె నిర్వహించారు. షాపులను బంద్ చేసి తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా ఆదోని టౌన్ దస్తావేజుకల సంఘం వైస్ ప్రెసిడెంట్ మోహన్ మురళి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సబ్ రిజిష్టర్ లో ప్రవేశ పెట్టిన కార్డ్ పైమ్ 2.0 టెక్నాలజీ వలన ప్రజలకు మరియు ధస్తవేజు లేఖరులకు మరియు స్టాంప్ వెండర్స్ కు నష్టం జరుగుతుంది అని దీనివలన రాష్ట్రవ్యాప్తంగా 50,000 మంది ఉన్నటువంటి దస్తా వేజు రైటర్లు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతారని ఆవేదన వ్యక్తం పరిచారు. కార్డ్ పైమ్ 2.0 టెక్నాలజీ వలన పనిలో పారదర్శకత లోపించి అక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




