News
మంత్రాలయం రైల్వే స్టేషన్ లో 7 నెలల బాలుడు కిడ్నాప్
7 నెలల బాలుడు అదృశ్యమైన సంఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం తుంగభద్ర రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. కాచాపురం గ్రామానికి చెందిన అంజి, అంకమ్మ దంపతులు పాత రైల్వే స్టేషన్ లో పాన్పు పై నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి 7 నెలల బాలుడు రామును అపహరించారు. గమనించిన తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో విచారించగా కన్పించకపోవడం తో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఆదోని రైల్వే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ఇద్దరు వ్యక్తులు బాబును అపహరించినట్లు గుర్తించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ వేగవంతం చేశారు.
News
మత్తులో వాహనాలు నడిపితే శిక్షలు తప్పవు
మద్యం మత్తులో వాహనాలు నడిపితే తీవ్రమైన శిక్షలు తప్పవని మరోసారి రుజువు అయ్యింది.

కర్నూలు జిల్లా ఆదోని మండలంలో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. మద్యం మత్తులో వాహనాలను నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు లో పట్టుబడిన 15 మందిని పోలీసులు న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. వారిలో ట్రాఫిక్ పోలీసులు నలుగురిని, రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 11 మందిని అదుపులోకి తీసుకుని కోర్టు లో హాజరు పరుచగా విచారణ అనంతరం న్యాయమూర్తి 4 గురికి ఒక వారం రోజులు, 5 గురికి 30 రోజులు రిమాండ్ విధిస్తూ ఆదోని సబ్ జైలుకు తరలించరు. 6గురికి 10 వేల రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించరు. రోడ్డుపై ప్రయాణించే వాహన చోదకులు ముఖ్యంగా ద్విచక్ర వాహనాలతో పాటు, అన్ని రకాల వాహనాలను నడిపే వాహన డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలను రోడ్డుపై నడపవద్దని, ఇది చాలా ప్రమాదకరమని ఇకపై ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలో పట్టుపడితే ఇదే విధమైన జైలు శిక్ష తప్పదని ఆదోని పోలీసులు హెచ్చరించరు.

News
ఆదోనిలో రోడ్డు ప్రమాదం – వ్యక్తి మృతి
కర్నూలు జిల్లా ఆదోనిలో ఆస్పరి బైపాస్ రోడ్డు పెట్రోల్ బంక్ సమీపంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని AP 04 V 1430 నంబర్గల లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నప్పటికీ, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
ఆదోని పాత బ్రిడ్జిపై నుంచి పడి వృద్ధురాలికి తీవ్రగాయాలు
కర్నూలు జిల్లా ఆదోని పాత ఓవర్ బ్రిడ్జి పై నుండి కింద పడి శాంతమ్మ (70) అనే వృద్ధురాలికి తీవ్రగాయాలు అయ్యాయి. వృద్ధురాలి కుమారుడు మహానంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి కల్లుబాయిలో నివాసం ఉంటున్నామని వారం రోజుల క్రితం మహానంది తల్లి శాంతమ్మ (70) ఆస్పరి లో ఉన్న తన కూతురు వద్దకు వెళ్లి ఈరోజు మధ్యాహ్నం తిరుగు ప్రయాణమై బ్రిడ్జిపై నుంచి నడుచుకుంటూ వస్తూ కళ్ళు తిరగడంతో కింద పడిందని మహానంది తెలిపారు. స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా తీవ్ర గాయాలు ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారని మహానంది మీడియాకు తెలిపారు.
