News
యం.హెచ్.పి.యస్. సభ్యత్వం తీసుకున్న బుద్దిస్ట్ మైనారిటీ జిల్లా కార్యదర్శి
కర్నూలు జిల్లా ఆదోనిలో యం.హెచ్.పి.యస్. రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ ఆధ్వర్యంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితిలో బుద్దిస్ట్ మైనారిటీ కర్నూలు జిల్లా కార్యదర్శి హెచ్. రామలింగయ్య సభ్యత్వం పొందారు. హెచ్. రామలింగయ్యను శాలువా కప్పి సన్మానించి యం.హెచ్.పి.యస్ సంస్థ లోకి నాయకులు నూర్ అహ్మద్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా నూర్ అహ్మద్ మాట్లాడుతూ యం హెచ్ పి యస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఫారుఖ్ షుబ్లీ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలో సంస్థ బలోపేతానికి నాయకులు నిరంతరం కృషి చేస్తామన్నారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైకాపా పాలనలో జగన్ రెడ్డి, నాయకులు దోచుకున్న ప్రజా ధనాన్ని స్వాధీనం చేసుకుని ప్రజలకు పంచి పెట్టాలని యం హెచ్ పి యస్ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి మరియు నాయకులు హసన్, వసీమ్ సాహెబ్, షకీల్, సద్దాం పాల్గొన్నారు
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




