News
కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు..వెల్లాల మధుసూధనశర్మ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యతన గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎండోమెంట్ దేవస్థాన పాలకమండలి కమిటీలలో మరియు ప్రతి పాలకమండలి కమిటీలో ఇద్ధరు బ్రాహ్మణులకు ఉండేట్టు చూస్తామని అందుకు అనుగుణంగా బిల్లును అసెంబ్లీలో ఆమోదించడానికి నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయమని ఆదోని బిజెపి నాయకుడు వెల్లాల మధుసూదనశర్మ మరియు మున్సిపల్ కౌన్సిలర్ వి.లలితమ్మ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదములు తెలిపారు.
ఈ సందర్భంగా వీరిరువురు మాట్లాడుతూ గత ప్రభుత్వ పరిపాలనలో బ్రాహ్మణులకు తీవ్ర అన్యాయం జరిగిందని, అందువల్ల బ్రాహ్మణులు ఆర్థికముగా, రాజకీయంగా, సామాజికంగా చాలా కష్టనష్టాలను ఎదుర్కొన్నారని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వలన బ్రాహ్మణులకు ఆత్మాభిమానం పెరుగుతుందని సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, బిజెపి అధ్యక్షురాలు శ్రీమతి పురేంధేశ్వరికి ఆదోని ఎమ్మెల్యే పార్థసారథికి, మరియు కూటమి నాయకులందరికీ పేరుపేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు లలితామధుసూధనశర్మ దంపతులు తెలియచేసారు.
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




