Connect with us

News

రైతుల సొంత భూములను రైల్వే భూములుగా ఎలా చూపిస్తారు

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్ గ్రామంలో రెవెన్యూ అధికారులు రైతు సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రైతు సదస్సులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల అధ్యక్షుడు కే. శేఖర్ మరియు రైతులు రీ సర్వే డిప్యూటీ తాసిల్దార్ పెద్దయ్యకు రీ సర్వేలో భాగంగా  రైతుల సొంత భూములను రైల్వే భూములుగా చూపించి, రైతు పేర్లు ఆన్లైన్ నుండి తొలగించారని వారి పేర్లను ఆన్లైన్లో చేర్చి, వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా డిప్యూటీ తాసిల్దార్ పెద్దయ్య మాట్లాడుతూ మాకు 30 రోజులు వ్యవధి కావాలని ఆలోగా సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. రైతు సంఘం అధ్యక్షుడు శేఖర్ మాట్లాడుతూ 30 రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలని లేనిపక్షంలో రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రైతులు సుభాన్, బోజప్ప, తదితరులు పాల్గొన్నారు.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

తప్పిపోయి 30 సంవత్సరాల తర్వాత ఇంటికి చేరిన యువకుడు..

Published

on

తప్పిపోయి 30 సంవత్సరాల తర్వాత సొంత కుటుంబానికి చేరాడు యువకుడు..
కర్నూలు జిల్లా ఆదోని పట్టానికి చెందిన వీరేష్ గత 30 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల వయసులో రైల్లో తప్పిపోయి తమిళనాడులో ప్రత్యక్షమయ్యాడు. అక్కడ బోర్డింగ్ లో కొద్దిరోజులు నివసించి. అక్కడనుండి ముంబై లోని అనాధాశ్రమమునకు  బదిలీ చేశారు. అక్కడే పదవ తరగతి వరకు చదువుకొని హోటల్లో వెయిటర్ గా పనిచేస్తున్నాడు. ఎప్పటికైనా సొంత వారిని కలుస్తానన్న ఆశ తగ్గలేదు. కేవలం అతనకు నానమ్మ అంజనమ్మ, నాన్న జనార్ధన్, ఊరు ఆదోని అని మాత్రమే తెలుసు. ఈ నేపథ్యంలోనే గత రెండు రోజుల నుంచి ఆదోని లో తిరుగుతున్న ఎటువంటి కుటుంబ సభ్యుల సమాచారం అందలేదు.  సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక   ఉన్నదని తెలుసుకొని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు తనకు జరిగిన విషయాన్ని తెలియజేశాడు. అనంతరం సబ్ కలెక్టర్ వెంటనే స్పందించి మున్సిపల్ కమిషనర్ ఫోన్ ద్వారా వీరేష్ వివరాలు తెలియజేసారు. ఈ నేపథ్యంలో  పట్టణంలో ఉండే సచివాలయాల్లో మరియు సామాజిక మాధ్యమం, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రకటన విడుదల చేశారు. ప్రకటనల ద్వారా  సమాచారాన్ని తెలుసుకున్న మేనత్త భర్త జగదీష్ సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. జగదీష్ విషయాలను పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని తాసిల్దార్ వారికి మరియు మున్సిపల్ కమిషనర్కు సబ్ కలెక్టర్ ఆదేశించారు. అనంతరం పూర్తిస్థాయిలో విచారణ చేపట్టగా వీరేష్ వారి అమ్మ వీరేష్  పుట్టిన సంవత్సరం లోపల మరణించిందని, వీరేష్ తండ్రి అనారోగ్యంతో 2008 సంవత్సరంలో మరణించాడని అలాగే వారి నానమ్మ అంజనమ్మ 2011వ సంవత్సరంలో మరణించారని తెలిపారు. వారి కుటుంబ సభ్యులలో వారి మేనత్త లక్ష్మి (చిట్టెమ్మ) మాత్రమే జీవించారని ప్రస్తుతం వారు కర్నూలు నగరంలో నివసిస్తున్నారని విచారణలో తెలిపారు. చిన్నప్పుడు తను నివసించిన ప్రదేశాల్లో మేనత్త భర్త అయినా జగదీష్ తీసుకెళ్లి చూపించాడు. చూసిన వీరేష్ ఇవన్నీ నిజమేనని వీరు నా రక్త సంబాధికులే అని వీరేష్ అధికారులకు తెలిపాడు.
ఈ సందర్భంగా వీరేష్ జనార్ధన్ మాట్లాడుతూ…  నేను చిన్న వయసులో తప్పిపోయాను, 30 సంవత్సరాలు అయిందని నా కుటుంబ సభ్యులను , 24 గంటల్లోపే నాయొక్క కుటుంబ సభ్యుల చెంతకు చేర్చిన సబ్ కలెక్టర్కు, మున్సిపల్ కమిషనర్, తాసిల్దార్, రెవెన్యూ, మీడియా సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మేనత్త భర్త అయినా జగదీష్ మాట్లాడుతూ… వీరేష్ కొరకు చాలా రోజులుగా వెతికాము కానీ ఎటువంటి సమాచారం లేదు, 30 సంవత్సరాల తర్వాత వీరేష్ మమ్మల్ని వెతుక్కుంటూ రావడం చాలా భావిద్వేగానికి గురై సంతోషం గా ఉన్నది. వీరేష్ మా వరకు తీసుకొని వచ్చిన ప్రభుత్వ అధికారులకు మరియు మీడియా కృతజ్ఞతలు తెలియజేశారు.

Continue Reading

News

తుంగభద్రా డ్యాం 4 గేట్లు ఎత్తి దిగువకు నీరు

Published

on

తుంగభద్ర డ్యాం. 02 07 2025 బుధవారం ఉదయం నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నట్లు డ్యామ్ అధికారులు తెలిపారు. రెండు అడుగులు ఎత్తుకు నాలుగు గేట్లు ఎత్తి దిగువకు 10400 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు తుంగభద్ర డ్యామ్ అధికారులు సమాచారం ఇచ్చారు నది తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తుంగభద్ర డ్యాం అధికారులు ఆదేశాలు  జారీ చేశారు.
.

తుంగభద్ర డ్యాం నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీరు వదిలిన అధికారులు
Continue Reading

News

అక్రమంగా ఫీజులు వసూలు చేస్తూన్నారు

Published

on

ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు  గుర్తింపు రద్దు చేయాలని డి ఎస్ ఎఫ్, పిడిఎస్ఓ విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లా ఆదోని బీమాస్ రెస్టారెంట్లో విద్యార్థి సంఘాలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిహెచ్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, పి ఎస్ డి ఓ రాష్ట్ర నాయకుడు తిరుమలేష్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కొన్ని పాఠశాల యాజమాన్యలు స్కూల్ ఫీజు, యూనిఫామ్ ఫీజు బస్సు ఫీజు, ట్యూషన్ ఫీజు, డిపాజిట్ ఫీజ్ అని రకరకాల పేర్లతో తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు వసూళ్లకు పాల్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత చేస్తున్నా విద్యాశాఖ అధికారులు ఏమి తెలియనట్లు వివరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించాలని డి.ఎస్.ఎఫ్, పి.డి.ఎస్.ఓ విద్యార్థి సంఘా నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో దశలవారీగా ఉద్యమాలు చేపట్టేందుకు సిద్ధమవుతామని ప్రభుత్వనికి, విద్యాశాఖ అధికారులను హెచ్చరించారు.ఈ సమావేశంలో DSF, PDSO నాయకులు నవీన్ రాజ్ కుమార్ కిరణ్ పాల్గొన్నారు.

ధనాపురం ఉదయ్ యూట్యూబ్ వీడియో
Continue Reading

Trending